-
ఎన్టీఆర్తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
పాట.. ఫైటు
గోవాకు బై బై చెప్పారు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శ్రుతీ మరాఠి, చైత్ర, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల గోవాలో మొదలైన ‘దేవర’ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైటు సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ మొదటివారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని భోగట్టా. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
పుష్ప 2 సాంగ్ ని మించి దేవర బంపర్ సాంగ్!
-
శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'
మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
రామ్ చరణ్తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ
రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్దిరోజుల క్రితం బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవర చిత్రం తర్వాత టాలీవుడ్లో మరొక ఛాన్స్ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. ' నా సినిమాల అప్డేట్స్ గురించి మా నాన్న (బోనీ కపూర్) పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' మాత్రమే చేస్తున్నాను.' అని చెప్పారు. ‘ఉప్పెన’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్చరణ్ హీరోగా ఓ సినిమా (‘RC 16’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా ఉంది. దీంతో ఈ విషయం గురించి బోనీకపూర్ను ప్రశ్నించగా.. రామ్ చరణ్తో జాన్వీ సినిమా చేస్తుందని ప్రకటించారు. ఆపై కోలీవుడ్ హీరో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. కానీ, బోనీకపూర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో గత కొద్దిరోజులగా వైరల్గా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ‘ఆర్సీ 16’ ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లనుందని టాక్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement