-
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్లో రింకూ సింగ్కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు.. -
T20 WC: టీమిండియా గెలవాలంటే అతడు జట్టులో ఉండాల్సిందే!
విరాట్ కోహ్లి గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. పనీపాటా లేని వాళ్లే వదంతులు సృష్టించి జనాల మీదకు వదులుతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు కోహ్లి లేని ప్రపంచకప్ జట్టును ఊహించడం కూడా కష్టమన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2024 భారత జట్టులో కోహ్లికి చోటు ఇవ్వకుండా.. యువకులకు పెద్దపీట వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లి బ్యాటింగ్ స్టైల్ వెస్టిండీస్ పిచ్లకు అంతగా సూట్ కాదని.. అందుకే ఈ ఢిల్లీ బ్యాటర్ను తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. టీమిండియా గెలవాలంటే అతడు ఉండాల్సిందే ఈ విషయంపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి లేకుండా టీ20 ప్రపంచకప్ టీమా? ఛాన్సే లేదు. 2022లో జట్టును సెమీస్కు చేర్చిన ఘనత తనది. ఆ ఎడిషన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా అతడే. అలాంటి వ్యక్తికి జట్టులో చోటు ఉండదా? అసలు ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు? వాళ్లకు వేరే పనులేమీ లేవా? నిరాధారపూరిత వ్యాఖ్యలతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? ఒకవేళ ఈసారి టీమిండియా గనుక టీ20 వరల్డ్కప్ గెలవాలంటే విరాట్ కోహ్లి కచ్చితంగా జట్టులో ఉండి తీరాల్సిందే’’ అని చిక్కా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా స్పందించాడు. సచిన్ మాదిరే కోహ్లికి కూడా ఆ గౌరవం దక్కాలి ఈ మేరకు.. ‘‘వన్డే వరల్డ్కప్ లేదంటే టీ20 ప్రపంచకప్.. ఈవెంట్ ఏదైనా.. జట్టును ఒడ్డుకు చేర్చే ఆటగాడు ఉండాల్సిందే. విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు కేవలం జట్టులో ఉంటే చాలు. అన్నీ సజావుగా సాగిపోతాయి. వందకు వంద శాతం జట్టుకు కోహ్లి అవసరం ఉంది. కోహ్లి కోసం టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్ ట్రోఫీ గెలవాలి. 2011లో సచిన్ టెండుల్కర్కు దక్కిన మాదిరే విరాట్ కోహ్లికి కూడా గౌరవం దక్కాలి. అతడికి జట్టు ఇచ్చే గొప్ప కానుక అంతకంటే మరొకటి ఉండదు’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!
‘‘జట్టును ప్రకటించినప్పుడే నాకంతా అర్థమైపోయింది. స్నేహాలు, వ్యక్తిగత బాంధవ్యాల ఆధారంగానే ఈ సెలక్షన్ జరిగింది. జట్టు సమతూకంగా లేదు. ఇండియాలో వరల్డ్కప్ టోర్నీలో పాకిస్తాన్కు ఈ తిప్పలు తప్పవని నేను ముందే ఊహించాను. వాళ్లు(మేనేజ్మెంట్) అన్నీ మాట్లాడతారు గానీ సరైన వ్యూహాలు రచించలేకపోతున్నారు. ఇండియాలో పిచ్ పరిస్థితులు బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్కు అనుకూలిస్తాయన్న విషయం వాళ్లు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. సెలక్షన్ మొత్తం తప్పుల తడక ఈ టీమ్ సెలక్షన్ మొత్తం తప్పులతడకగా ఉంది. నసీం షా అందుబాటులో లేడని హసన్ అలీ చేతికి కొత్త బంతిని ఇస్తున్నారు. హసన్ అలీ కేవలం మేనేజ్మెంట్లోని కీలక సభ్యులతో తనకున్న ఫ్రెండ్షిప్ కారణంగానే జట్టులోకి వచ్చాడు. ఇక ఉసామా మిర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సుల్తాన్స్కు ఆడతాడు. ముస్తాక్ అహ్మద్కు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్తో సత్సంబంధాలు ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే జట్టు గురించి ఎవరికీ పట్టింపు లేదు. అలాంటపుడు ఇలాంటే ఫలితాలే వస్తాయి. అప్పుడు నన్నైతే పక్కనపెట్టారు అయినా.. పాకిస్తాన్ గతంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగిందే లేదు. షాహిద్ ఆఫ్రిది ఉన్నాడన్న కారణంగా వన్డే జట్టు నుంచి నన్ను తప్పించేవారు. ఈ టోర్నీలో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగినపుడు షాదాబ్ ఖాన్ను తప్పించి ఉసామా మిర్ను రప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇమాద్ వసీం(లెఫ్టార్మ్ స్పిన్నర్)ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు’’ అంటూ పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ సెలక్షన్ తీరుపై మండిపడ్డాడు. ఇకనైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకపోతే ఇలాంటి అవమానాలు మరిన్ని ఎదుర్కోక తప్పదంటూ ఘాటు విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లో ఇప్పటికే పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుందన్న కనేరియా.. ఇకముందు కూడా కోలుకునే అవకాశం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా మెగా ఐసీసీ టోర్నీలో ఆరంభంలో వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్తాన్.. ఆ తర్వాత మూడు పరాజయాలు చవిచూసింది. బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు కనీవిని ఎరుగని రీతిలో వన్డే ఫార్మాట్లో అదీ మేజర్ ఈవెంట్లో అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో మూడు ఓడి పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ సెమీస్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్లలో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓటములపై స్పందించిన డానిష్ కనేరియా ఈ మేరకు ఆజ్ తక్తో మాట్లాడుతూ పాక్ బోర్డు, సెలక్టర్లను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కాగా పాక్ వరుస ఓటములు నేపథ్యంలో కెప్టెన్గా బాబర్ ఆజంను తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక.. -
చహల్కు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2023: ‘‘ప్రస్తుతం యుజువేంద్ర చహల్కు టీమిండియాలో స్థానం దక్కించుకునే అర్హత లేదు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్నాడు. చహల్ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు’’ పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్కు మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. అందుకే చహల్పై వేటు అతడిని కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ విషయం గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని స్పష్టం చేశాడు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్కప్నకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. అంతటి మొనగాడు లేడు..అయినా ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు చహల్ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరును విమర్శిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్ను మించి మొనగాడు లేడని.. అలాంటిది తనకు జట్టులో చోటు లేకపోవడం ఏమిటని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చదవండి: అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్ -
టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. నటరాజన్కు అవకాశం ఇవ్వాలి: పాక్ మాజీ క్రికెటర్
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా భారత్ అంతగా రాణించలేకపోయింది. వన్డే వరల్డ్కప్ సన్నహాకాల్లో భాగంగా జరిగిన సిరీస్లో ఓటమిపాలైన రోహిత్ సేనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ను భారత్ గెలవాలంటే మెరుగైన బౌలింగ్ యూనిట్ అవరమని కనేరియా అభిప్రాయపడ్డాడు. కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం టీమిండియా చెత్త బౌలింగ్ లైనప్ కలిగి ఉంది. వన్డే ప్రపంచకప్లో భారత్కు మెరుగైన బౌలర్లు అవసరం. ప్రస్తుత బౌలర్లతో భారత్ వన్డే ప్రపంచకప్ను గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్,టి నటరాజన్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇక భారత బ్యాటర్లు స్పిన్కు అద్భుతంగా ఆడుతారని అందరూ అంటుంటారు. వారు నెట్స్లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్లను ఎదుర్కొంటారు. వారి కొంచెం వేగంగా బౌలింగ్ చేయడం వల్ల బంతి పెద్దగా టర్న్ కాదు. అయితే మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు బంతిని అద్భుతంగా టర్న్ చేశారు. కాబట్టి భారత బ్యాటర్లు స్పిన్కు వికెట్లు సమర్పించుకున్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంత్ స్థానంలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement