cock fights
-
డ్రోన్ తప్పుకుంది.. కోడి గెలిచింది!
సాక్షి, అమరావతి: టెక్నాలజీ పేరుతో హడావుడి చేయడంలో రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబు మాట్లాడితే డ్రోన్ల ప్రస్తావన చేస్తుంటారు. ఆయన కంటే తామేమి తక్కువ తినలేదన్నట్టుగా పోలీసులు ఈసారి కోడి పందాల కట్టడికి డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రతి యేటా సంక్రాంతికి ముందు కోడి పందాల కట్టడి పేరుతో పోలీసులు హడావుడి చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి కోడి పందేలను అడ్డుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పోలీసులు డ్రోన్లను ఎగుర వేశారు.బరుల గుర్తింపు, వాటి వద్ద నిర్వాహకుల ఏర్పాట్లను వాటితో చిత్రీకరించారు. పలు ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టే వారిని, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని బైండోవర్ చేశారు. కోడి పందేలు చట్ట రీత్యా నేరం అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు మైక్ ప్రచారాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా కొన్ని చోట్ల కోడి పందేల బరులను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేశారు. ఇంతా చేసి చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి ఆయా ప్రాంతాల్లో బరులు సిద్ధమైపోతుండటం గమనార్హం.సీన్ కట్ చేస్తే..కోడి పందేల నిర్వాహకులు పోలీసుల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అధికార పార్టీ నేతలను రంగంలోకి దించి వారి ఆశీస్సులతో ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నపాటి బరుల నుంచి భారీ బరుల వరకు వందల సంఖ్యలో సిద్ధం చేశారు. భోగి రోజునే పందేలు మొదలుపెట్టి మూడు రోజులపాటు అడ్డు అదుపు లేకుండా నిర్వహించుకునేలా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా కోడి పందేలకు బ్రాండ్గా నిలిచిన భీమవరం, ఐభీమవరం, వెంప, ఏలూరు, అమలాపురం, కోనసీమ కొబ్బరి తోటల్లో భారీ బరులు సిద్ధం చేశారు. ఒక్కొక్క బరిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల ఖర్చుతో తీర్చిదిద్దారు.బరుల్లో భారీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయగా, బరులకు ఆనుకుని మద్యం బెల్ట్ షాపులు, గుండాట, పేకాట నిర్వహించుకునే ఏర్పాట్లతోపాటు కూల్ డ్రింక్స్, బిర్యానీ, కోడి పకోడి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందేలను చూసేందుకు, బెట్టింగ్లు వేసేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పందేల రాయుళ్లు ఈ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. వారి కోసం భీమవరం తదితర పట్టణాల్లో మూడు నెలల ముందు నుంచే లాడ్జీలు, హోటళ్లు బుక్ చేశారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్హౌస్లకు తోడు చేపల చెరువుల వద్ద మకాంలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటి దాకా ఇంత చేసిన పోలీసులు ఆ మూడు రోజులు మాత్రం గప్చిప్ అని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. -
కాంతి నింపిన సంక్రాంతి
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/నెట్వర్క్: ఏ వీధి చూసినా రంగులద్దిన రంగవల్లులు.. వాటిపై గొబ్బెమ్మలు.. ప్రతి ఇంటి నుంచి కమ్మటి పిండివంటల వాసనలు.. యువతీయువకుల కేరింతలు.. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేస్తూ గోపూజలు.. కోడిపందేలు, ఎడ్లపందేలు.. గాలిపటాలు.. క్రీడాపోటీలు.. ముగ్గుల పోటీలు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడురోజులు కనిపించిన దృశ్యాలివి. భోగి రోజైన శుక్రవారం మొదలైన కోడి పందాల జాతర కనుమ రోజైన ఆదివారం సా.5 గంటలతో పరిసమాప్తమైంది. బరుల వద్ద ఏకంగా బౌన్సర్లను రంగంలోకి దించారు. భీమడోలు మండలం గుండుగొలనులో పేకాట శిబిరం వద్దకు మఫ్టీలో వెళ్లిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాట రాయుళ్లు దాడి చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పల్లంకుర్రులో నిర్వహించిన భారీ కోడి పందేల్లో ఇన్నోవా కారును బహుమతిగా పెట్టడం విశేషం. ‘పశ్చిమ’ంలోని కాళ్ల మండలం సీసలిలో నిర్వాహకులు రెండు బుల్లెట్లు సిద్ధంచేశారు. అలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు బులెట్, స్కూటీలను బహుమతులుగా అందజేశారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలను స్మరించుకుని వారికి పిండివంటలు నివేదించారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో బొజ్జన్నకొండ వద్ద కనుమ సందర్భంగా జాతర కోలాహలంగా జరిగింది. ఇక్కడి బౌద్ధస్థూపం వద్ద జరిగిన బౌద్ధమేళాలో మయన్మార్ బౌద్ధ భిక్షువు వెనరబుల్ ఆయుపాల మహాథేరోజీ పాల్గొన్నారు. సింహాచలంపై మకరవేట ఉత్సవాన్ని నిర్వహించారు. విశాఖలో గాలిపటాలు ఎగురవేశారు. ఆలయాల్లో ఘనంగా గోపూజలు కనుమ పండుగ సందర్భంగా దేవదాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ ఆదివారం గోపూజ కార్యక్రమాలు నిర్వహించింది. దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్ సతీ సమేతంగా విజయవాడ దుర్గగుడిలో గోపూజ చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో జరిగిన గోపూజలో ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్ మందిరం వేదికగా సిద్ధరామేశ్వర, రాజరాజేశ్వరి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోమాతలకు సీమంతాలు, గోదూడలకు నామకరణ ఉత్సవం నిర్వహించారు. గుడివాడలో జాతీయ ఎడ్ల పందేలు మంత్రి కొడాలి నాని సారథ్యంలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని లింగవరం రోడ్డులో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించారు. రసవత్తరంగా పందుల పందేలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో మూడురోజుల పాటు పందుల పందేలు రసవత్తరంగా సాగాయి. పితృదేవతల స్మరణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సింహపురీయులు శనివారం పితృదేవతలను స్మరిస్తూ నెల్లూరులోని పవిత్ర పినాకిని తీరంలో ఉన్న సమాధుల తోట (బోడిగాడితోట)లో తమ పూర్వీకుల సమాధుల వద్ద పూజలు చేశారు. బహుమతులందజేసిన ఎమ్మెల్యే రోజా వైఎస్సార్ జిల్లా శెటిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సందడిలేని అతిథులు సంక్రాంతి కోడి పందేలను.. ఇక్కడి వారి ఆత్మీయ విందును రుచిచూసి మళ్లీ ఏడాది వరకు ఎదురుచూసే అతిథులు ఈసారి పెద్దగా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంబరాన్నంటిన ప్రభల సంబరం అమలాపురం: సంక్రాంతి పండగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. జిల్లాలో సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకూ ప్రభల తీర్థాలు జరుగుతాయి. గత ఏడాది స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మెప్పు పొందిన అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ఆదివారం నయనానందకరంగా సాగింది. ఏకాదశ రుద్రులను (11 ప్రభలను) పంటపొలాలు, కాలువలు దాటుతూ తరలించిన తీరు భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు అప్పర్ కౌశిక కాలువను దాటి వచ్చే అపురూప దృశ్యాన్ని పెద్దసంఖ్యలో భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మొత్తం 11 ప్రభలు జగ్గన్నతోటలో ఒకేచోట కొలువుదీరి భక్తులను పరవశింపజేశాయి. అంబాజీపేట మండలంలో వాకలగరువు సరిహద్దున జరిగిన తీర్థాల్లో వాకలగరువు ప్రభ 47 అడుగులు, తొండవరం ప్రభ 46 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 గ్రామాల్లో ప్రభల తీర్థాలు కనులపండువగా జరిగాయి. జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అప్పర్ కౌశిక కాలువను దాటి వస్తున్న గంగలకుర్రు అగ్రహారం ప్రభ రంగంపేటలో ఉత్సాహంగా జల్లికట్టు చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట గ్రామంలో నిర్వహించిన పశువుల పండుగ వేడుక అంబరాన్నటింది. పశువుల యజమానులు వాటి కొమ్ములకు పలకలను కట్టి పందేలకు సిద్ధం చేశారు. జిల్లాలోనే ఎడ్ల పందేలు (జల్లికట్టు)కు అత్యంత ప్రాధాన్యత ఉన్న గ్రామం రంగంపేట. జల్లికట్టును చూడటానికి జిల్లా నలుమూలల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. -
జోరుగా కోడి పందేలు
-
కోడిపందేలపై కరోనా దెబ్బ
సాక్షి, అమరావతి: ఏటా ఖాకీపై కోడి గెలిచింది అనేమాట వినిపించేది. ఈసారి సంక్రాంతికి కో‘ఢీ’, కోవిడ్ అనే చర్చసాగుతోంది. పోలీస్ ఆంక్షల నడుమ సంక్రాంతి మూడురోజులు కోడిపందేలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కోడిపందేలకు కరోనా వైరస్ కూడా సవాలు విసురుతోంది. సంక్రాంతి మూడురోజులపాటు నిర్వహించే కోడిపందేలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి వందలాది కుటుంబాలు జీవిస్తుంటాయి. కోడి కత్తులు తయారు చేసేవారు, కోడి పుంజులకు కత్తులు కట్టేవారు, పందేల కోసం బరుల ఏర్పాటుకు కూలీలు.. వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది. కేవుల్ (కమిషన్) తీసుకుని ఏర్పాట్లు చూసే నిర్వాహకులు ఈ మూడురోజుల కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. కోడిపందాలు, పేకాట, గుండాట, కోతాట జీవనోపాధిగా మలుచుకున్న అనేకమందికి ఆ మూడురోజులు పండుగే. దీనికితోడు కోడిపందేలు, కోతాట, గుండాట బరుల వద్ద పెద్ద ఎత్తున స్టాల్స్ (తాత్కాలిక షాపులు) ఏర్పాటు చేస్తారు. కూల్ డ్రింక్స్ షాపు నుంచి సిగరెట్ షాపులు, పలావు సెంటర్లు, కోడిమాంసం పకోడి దుకాణాలు, ఇతరత్రా మాంసాహారాలు దొరికే హోటళ్లు, అల్పాహార కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం స్థలం అద్దె, అనుమతి ఇచ్చినందుకు నిర్వాహకులకు రోజువారీ చెల్లింపులుగా పెద్ద మొత్తాలు ఇస్తుంటారు. ఇలా ఉభయ గోదావరితోపాటు పలు జిల్లాల్లో వందలాది కుటుంబాలకు ఉపాధి, వేలాదిమందికి జూదకాంక్ష, లక్షలాదిమందికి కనువిందు కలిగించే కోడిపందేలకు ఈసారి కోవిడ్ పెనుసవాలు విసురుతోంది. చదవండి: పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే పుష్యలక్ష్మి.. మూడు సంపదల పండగ -
కోడి పందేలకు ‘ఐటీ’తో చెక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలను అడ్డుకునేందుకు ఈ సారి జిల్లా యంత్రాంగం కొత్త వ్యూహాలను పన్నుతోంది. ఇన్కంట్యాక్స్ (ఐటీ) అధికారులతో దాడులు చేయించడం ద్వారా వీటిని అడ్డుకోవచ్చని భావించిన అధికారులు ఈ మేరకు ఆ శాఖకు లేఖ రాశారు. ఐటీ అధి కారులు కూడా 20 వరకు బృందాలను పంపడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సంక్రాంతి ముందు రెండు రోజుల నుంచి అన్ని హోటళ్లు, గెస్ట్ హౌస్లతో పాటు పందేలు జరిగే ప్రాంతాల్లో బృందాలు దాడులు చేయనున్నాయి. కాగా, ప్రతి ఏటా సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. అయితే గత కొంత కాలంగా కోడి పందేల్లో భారీగా బెట్టింగ్లు జరుగుతుండటంతో అధికారులు నిఘాను పటిష్టం చేశారు. బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించేందుకు ఈ సారి ఆదాయపన్ను శాఖ అధికారులను రంగంలోకి దించాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. (చదవండి: రోజూ సైకిల్పై 18 కి.మీ. పయనం: గ్రూప్–2 విజేత) గృహ నిర్మాణ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా శేఖర్ సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా అదే శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తోన్న పి.బాలముని శేఖర్ నియమితులయ్యారు. అలాగే, చీఫ్ ఇంజనీర్ మల్లిఖార్జునను టెక్నికల్ ఎగ్జామినర్గా నియమిస్తూ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జైళ్ల శాఖలో పోస్టుల అప్గ్రేడ్ సాక్షి, అమరావతి: జైళ్ల శాఖలో శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా జైళ్లల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు) పోస్టులను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు)గా అప్గ్రేడ్ చేశారు. అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడపలో ఉన్న కేంద్ర జైళ్లకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు) పోస్టులను కొత్తగా సృష్టించారు. -
కనువిందుగా కనుమ పండుగ..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కనుమ పండుగ కనువిందుగా జరుగుతోంది. మరక దున్నెందుకు ఏడాదంతా చాకిరీచేసి సహకరించిన గోవులకు రైతులు పూజలు నిర్వహిస్తున్నారు. పంటలకు క్రిమికీటకాల బెడద తొలగించటంలో అండగా నిలిచే పక్షులకు ధాన్యాన్ని ఆహారంగా పెట్టి రుణం తీర్చుకొంటున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కనుమ కమనీయతను ఆస్వాదిస్తున్నారు ఈడుపుగల్లు, ఉప్పులూరు, గోడవర్రు, అంపాపురంలలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. సంప్రదాయబద్ధంగా సాగుతుండటంతో యువత పెంపుడు పుంజులను దింపి సై అంటున్నారు. చివరి రోజు కావటంతో రైతులు, మహిళలు, యువత పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముగ్గుల పోటీలు, కోలాటాలు ఆకట్టుకుంటున్నాయి. పదేళ్ల తర్వాత సంపూర్ణ సంక్రాంతి సంబరాన్ని ఆస్వాదిస్తున్నామని రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కనుమ సంబరాల్లో మంత్రి కొడాలి నాని, ఆయన కుమార్తె, కుమారుడు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో సంపూర్ణ సంక్రాంతి వేడుకలు సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలతో పాటు కోడిపందాల బరిలోనూ యువత మేమే సైతం అంటూ ముందుకొచ్చారు. ఇంత సరదాగా సంక్రాంతి జరుపుకోవడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోందని యువత అంటున్నారు. జగ్గయ్యపేట పాత గడ్డపై వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ యువ నేతలు సామినేని వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబు, తన్నీరు నాగేశ్వరావు, తుమ్మల ప్రభాకర్, నూకల సాంబశివరావు, నూకల రంగా, నంబూరి రవి పాల్గొన్నారు. -
మూడో రోజు జోరుగా కోడి పందాలు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో మూడవ రోజు కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భీమవరం, దెందులూరు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, పాలకొల్లు, ఉండి ప్రాంతాలలో భారీగా కోడి పందాల బిరులు ఏర్పాటు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కోడి పందాల బిరులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. కాగా చింతలపూడి కోడి పందేల్లో ఓ కోడిపుంజుకి కత్తిని కడుతుండగా ఒక్కసారిగా కాళ్లు విదిలించింది. దీంతో ఆ కత్తి పందేలని చూడగానికి వెళ్లిన సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తికి తొడభాగంలో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మృతి చెందాడు. కోడి పందాల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా : సాంప్రదాయ సంక్రాంతి సంబరాల బరిలో తలపడేందుకు పందెం పుంజులు కాలుదువ్వుతున్నాయి. ఏడాదిపాటు కఠోర శిక్షణ ఇచ్చిన పందెం రాయుళ్లు తమ కోళ్లతో కదనరంగానికి క్యూలు కడుతున్నారు. పౌరుషాన్ని చాటి యజమానుల పరువు నిలిపేందుకు పందెం కోళ్లు విజయమా వీరమరణమా అన్నట్టు తలపడుతున్నాయి. -
కోడి పందాలపై డేగకన్ను
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించే వారిపై పోలీసులు డేగ కన్ను వేశారు. అటు జిల్లాలోను, ఇటు నగరంలోనూ ఈ సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరంలో ఎక్కువగా కోడిపందాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నగరంలో విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో కూడా గతంలో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గత ఏడాది కోడిపందాలు నిర్వహించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని.., వారు మళ్లీ పందాల నిర్వహణకు ముందుకొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నగరంలో కొన్ని చోట్ల విచ్చలవిడిగా కోడి కత్తులు తయారుచేస్తూ విక్రయిస్తున్నారు. టాస్్కఫోర్స్ పోలీసులు ఇప్పటికే 245 కోడి కత్తులను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే కోర్టులు కూడా పందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ పందాలు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే ఆదేశాలున్నాయి. ఇవీ హాట్స్పాట్లు నగర పరిధిలో కోడి పందాలు జరిగే ప్రాంతాలను పోలీసులు హాట్స్పాట్లుగా గుర్తించారు. వీటీలో ఆరిలోవ, దువ్వాడ, భీమిలి మండలం తాటితూరు, ఆనందపురం మండలం గుళ్లేపల్లి, పద్మనాభం మండలం రేవిడి, పాండ్రంగి తదితర ప్రాంతాలున్నాయి. అలాగే జిల్లాలోని పాయకరావుపేట మండలం పీఎల్ పురం, మంగవరం, పెదరామభద్రపురం, వెంకటనగరం, కుమారపురం, పాల్మాన్పేట, నక్కపల్లి మండలం వేంపాడు, నెల్లిపూడి, గొడిచెర్ల, దేవవరం, రమణయ్య పేట, రేబాక, డీఎల్ పురం, తీనార్ల, ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరు, లింగరాజుపాలెం, పెదుప్పలం, కోటఉరట్ల మండలం పాములవాక, రామచంద్రాపురం, ములగల లోవ, యలమంచిలి మండలం పెదపల్లి, గూండ్రుబిల్లి, పులపర్తి, ఏటికొప్పాక, రాంబిల్లి మండలం లాలంకోడూరు, దిమిలి, కట్టుబోలు, మురకాడ, మామిడికొత్తూరు, నాతవరం గునుపూడి, వైబీ పట్నం, నర్సీపట్నం మండలం లింగాపురం, అప్పన్న దొరపాలెం, గొలుగొండ మండలం పాకలపాడు, ఏఎల్ పురం, అమ్మపేట, జోగంపేట, చీడిగుమ్ముల తదితర ప్రాంతాల్లో ఏటా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పెషల్ టీంల ఏర్పాటు ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ కోడి పందాలు నిర్వహించుకుండా మండలంలో ఉన్న పోలీస్స్టేషన్ ఎస్ఐల ఆధ్వర్యంలో స్ఫెషల్ టీంలు పనిచేస్తున్నాయి. ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఈ టీంలు నిఘా కొనసాగిస్తాయి. కోడిపందాల నిర్వాహకుల సమచారం తెలుసుకుని అక్కడకు వెళ్లి కేసులు నమోదు చేస్తారు. టాస్్కఫోర్స్, క్రైం, లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. -
పందెంరాయుళ్లు వర్సెస్ పోలీసులు..
పల్లెల్లో కోడి పందేల హడావిడి మొదలైంది. పండుగ నాడు పందెం కోళ్లు సందడి చేస్తున్నాయి.. బరిలోకి దిగి ప్రత్యర్ధి కోడిని మట్టికరిపిస్తున్నాయి. పందెం రాయుళ్లు సైతం జోరుగా పందేలు కాస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు పందేల రూపంలో చేతులు మారనుంది. కృష్ణా జిల్లా/ గుడివాడ: టీడీపీ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోడి పందేలు ప్రారంభమయ్యాయి. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. మాకు అధికారుల అండదండలు ఉన్నాయంటూ పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలిసినా కోడిపందాల శిబిరాలపై దాడులకు పోలీసుయంత్రాంగం వెనుకడుగు వేస్తోంది. నందిగామ మండలం చందాపురం గ్రామంలో కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించి పందెంరాయుళ్లు బరులను సిద్ధం చేయగా.. పోలీసు అధికారులు వాటిని రాత్రికి రాత్రి నాశనం చేశారు. దీంతో పందెంరాయుళ్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఎలాగైనా సరే పందెం వెయ్యాల్సిందే అని భీష్మించుకు కూర్చున్నారు. అసలు పందెమే జరగనియ్యమని పోలీసు అధికారులు అంటున్నారు. నాశనం చేసిన బరుల వద్ద పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి: జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. పందెంరాయుళ్లు శిబిరాల వద్ద హడావిడి చేస్తున్నారు. కోడి పందేల శిబిరాల వద్ద గుండాటలు, పేకాట జోరుగా సాగుతున్నాయి. ఆకివీడు మండలం, ఐ భీమవరం, కాళ్ళ మండలం సీసలి, కాళ్ళ, ఉండి మండలం కోలమూరు, ఉండిలలో యధేచ్చగా కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా.. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కనపడకపోవటం గమనార్హం. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కాళ్ళ మండలం సీసలిలో కోడి పందేలను ప్రారంభించారు. కోడి పందేలు సాంప్రదాయం అంటూనే పందెంరాయళ్లు కోళ్లకు కత్తులు కడుతున్నారు. తూర్పుగోదావరి: సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ వ్యాప్తంగా పలు గ్రామాల్లోని 40 బరుల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. కోడి పందేలతో పాటు భారీగా గుండాట, పేకాటలు జోరందుకున్నాయి. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ఎస్ గున్నేపల్లి, ఇందుప్పల్లి, కామనగరువు, అల్లవరం, గోడి, గోడివంక, రెల్లిగడ్డ, దేవగుప్తం, గుండెపూడి, కోమరగిరిపట్నం, ఎన్.కొత్తపల్లి, భీమనపల్లి, చల్లపల్లి గ్రామాలలో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. రెవిన్యూ, పోలీసు యంత్రాంగం కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చివరివరకూ ప్రచారం చేసి చివరకు చేతులెత్తేసి.. ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోడి పందేలను ప్రారంభించారు. కోడిపందేల బరుల వద్దే జూదం శిబిరాలు వెలిశాయి. గుండాటలు జోరుగా సాగుతున్నాయి. జనం కోడి పందేలపై వేలల్లో బెట్టింగ్లు కాస్తున్నారు. కృష్ణా: జిల్లా వ్యాప్తంగా కోడిపందేల బరులు సిద్దమయ్యాయి. జిల్లాలో రెండు వందల బరుల్లో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. నిషేదాలను పట్టించుకోకుండా కత్తులు కట్టి కోళ్ళతో పందాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో కోడిపందాల నిర్వహణ జరుగుతోంది. ఇడుపు గల్లు, గోడవర్రు, అంపాపురంలో పదెకరాల్లో భారీగా కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలు చూడడానికి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. పోలీసులు సైతం కోడిపందాల బరుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కోడి పందేలతో పాటు గుండాట, కోసు వ్యాపారం ద్వారా మూడు రోజుల్లో రూ. వంద కోట్ల మేర సొమ్ము పందేల రూపంలో చేతులు మారనుంది. -
పల్లె పులకింత
ఎన్నాళ్ల నిరీక్షణో ఇది.. సంక్రాంతి రూపంలో ఫలించింది. బతుకుపోరులో సుదూరాలకు తరలి వెళ్లిన తన బిడ్డ పాదాన్ని పల్లెతల్లి మళ్లీ సుతారంగా ముద్దాడింది. ఏడాదికోసారి ఊరికి ఉత్సవాన్ని తెస్తున్న ఆ బిడ్డను చూసి పులకించిపోయింది. ఉద్వేగంతో గుండెలకు హత్తుకుంంది. పుట్టి పెరిగిన నేలపైకి కాలుమోపగానే.. ఆ బిడ్డకూ ఏదో నూతనోత్తేజం. పైరగాలి తాకి తనువు పరవశించింది. పచ్చదనాన్ని పరుచుకున్న పొలాల్ని చూసి హృదయం ఉప్పొంగింది. ఓ వైపు.. పక్షుల కిలకిలారావాలు.. ఎక్కడో సుదూర తీరాన చెట్టుపై నుంచి లీలగా వినిపిస్తున్న కోయిలమ్మ కూనిరాగాలు. ఎహే... అంటూ ముల్లుగర్రతో ఎద్దును అదిలిస్తున్న రైతన్న కేకలు.. మరోవైపు.. ఇళ్ల ముందు రంగవల్లులు.. ఆ ముగ్గుల సిగలో గుమ్మడి పువ్వులతో ముస్తాబైన గొబ్బెమ్మలు.. పలుకే బంగారమాయెరా కోదండరామా.. అంటూ వీధుల్లో వీనుల విందుగా భక్తిపారవశ్యంలో తేలియాడిస్తున్న హరిదాసు కీర్తనలు.. లంగాఓణీల్లో పల్లె పడుచుల కేరింతలు.. పిండివంటల ఘుమఘుమలు.. పేక ముక్కల కోతలు.. కోడి పందేలు.. అమలాపురం: గ్రామాల్లో ఎటు చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లినవారు... వేలాది రూపాయల ప్రయాణ భారాన్ని లెక్కచేయకుండా సొంత ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో పట్టణవాసులు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. చివరి నిమిషంలో బయలుదేరిన వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నాయి. బస్సులు, విమాన చార్జీలను ఒక్కసారిగా పెంచేయడంతో హైదరాబాద్, చెన్నై, విశాఖ వంటి నగరాల్లో ఉన్న వారు సొంతకార్లలో ఊళ్లకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉన్న వారు సైతం కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం, విశాఖ.. ఇలా నగరాలు, పట్టణాలన్నీ నూతన వస్త్రాలు కొనుగోలు చేసేవారితో కిటకిటలాడుతుంటే సోమవారం భోగి పండుగ కావడంతో గ్రామాల్లో పండగ సందడి పతాక స్థాయికి చేరింది. ఆడపడుచులు ఇళ్ల ముంగిట ముగ్గులతో పోటీ పడుతుంటే మగవారి కోసం కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. ప్రభల తీర్థం ప్రత్యేకం తూర్పుగోదావరి అనగానే గుర్తుకొచ్చేది ప్రభల తీర్థం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమలో సంక్రాంతి పండుగ మూడురోజులూ పెద్ద ఎత్తున ప్రభల తీర్థాలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు వంటి ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్న చిన్న తీర్థాలు జరిగినా.. ఒక్క కోనసీమలోనే 90 వరకు తీర్థాలు జరుగుతాయి. వీటి నిర్వహణలో కోనసీమ సంప్రదాయం ఉట్టిపడుతుంది. అంబాజీపేట మండలం జగ్గన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంటల్లో జరిగే ప్రభల తీర్థాలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు ఈ తీర్థాలకు తప్పనిసరిగా హాజరవుతుంటారు. 20 అడుగుల వెడల్పు, 42 అడుగుల ఎత్తున భారీ ప్రభలను తయారుచేసి కుల, మతాలకు అతీతంగా భక్తులు తీర్థాలకు తరలించుకొస్తారు. పంటపొలాలు, పంట బోదెలు, కౌశికలు దాటుకుని ప్రభలు వచ్చే తీరు అద్భుతంగా ఉంటుంది. కోడి పందేలు ఇప్పటికే జరుగుతుండగా.. పండుగ వేళ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోడి పందేలకు అనుమతిచ్చేది లేదని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు లెక్కచేయడం లేదు. బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేలతో పాటు పొట్టేలు పందేలు, గుండాటలకు సైతం రంగం సిద్ధమైంది. -
'బరి'తెగిస్తున్నారు...!
కొంతమందికి పందెం కాయడం సరదా... మరికొంతమందికి ప్రవృత్తి... ఎన్నికల ఫలితాలా లేక క్రికెట్,మట్కా, పేకాట, కోడిపందెం అన్న వాటితో సంబంధంలేకుండా సీజనల్ వారీగా, అనుకూలంగా ఉన్న వాటిని ఎంచుకోవడం పరిపాటిగా మారింది. సంక్రాంతి ఇంకాపది రోజులు ఉండగానే పందెంరాయుళ్లు బరిలోకి కోళ్లనుదింపారు... కాళ్లకు కత్తులు కట్టి రసవత్తరంగా పోటీలు నిర్వహిస్తున్నారు.. రూ. కోట్ల రూపాయలు చేతులుమారుతున్నాయి... ఇక పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటేపండుగ రోజుల్లో ఇంకెన్ని రూ.కోట్లు చేతులు మారుతాయో పరిస్థితికి అద్దం పడుతోంది. అసాంఘికకార్యక్రమాలను పోట్లాటలో ఆగినంత గస వస్తోందే తప్ప వాటిని పోలీసులు నిలువరించలేక పోతున్నారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి : జిల్లాలో కోడిపందెంరాయుళ్లకు సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు మరో వారం రోజులు ఉండగానే పందేలు లక్షలు, కోట్ల రూపాయలుగా చేతులు మారుతున్నాయి. రంగ వల్లులు.. తినుబండారాలు.. వచ్చే బంధువుల జాబితాలతో మహిళలు ముచ్చటిస్తుండగా, కోడి పందెలు, ఎద్దుల బల ప్రదర్శన తదితర పందేల గురించి యువకులు, పురుషుల మధ్య జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఒక్కో కోడి పుంజు ఈక, కలరు, జాతిని బట్టి రూ.5 నుంచి లక్ష రూపాయలను వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రాయచోటి, రాజంపేట, బద్వేల్, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో కోడిపందెం ఆట మూడు పుంజులు ఆరు కత్తులు అన్న రీతిలో సాగుతోంది. పందెం రాయుళ్లపై పోలీసులు డేగకన్నేసినప్పటికీ కోడిపుంజుల తన్నులాటలను మాత్రం నిలువరించలేక పోతున్నారు. ప్రతి రోజు పులివెందుల, రాజంపేట సబ్ డివిజన్ల పరిధిల్లో కోడిపందెం స్థావరాలపై దాడులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కోడి పుంజులతో పాటు లక్షల రూపాయలు పట్టుబడుతున్నా చర్యల పరంగా నామమాత్రం కావడంతో కోడిపందెం రాయుళ్లు బరితెగిస్తున్నారు... సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న కొద్ది పందెం కోళ్ల కోసం వేట మొదలైంది. రంగును బట్టి ధర.. పందెం కోళ్ల కోసం జిల్లాలో పల్లె, పట్టణం అన్నా తేడా లేకుండా డిమాండ్ భారీగా నెలకొంది. బలమైన కోడికూత వినిపిస్తే చాలు క్షణాల్లో అక్కడ పందెంరాయుళ్లు వాలిపోతున్నారు. కోడిని పట్టిపట్టి పరీక్షించి యజమానితో బేరసారాలు సాగిస్తున్నారు. రంగును బట్టి కోడి ధరను నిర్ణయిస్తున్నారు. జాతిని బట్టి ఒక్కో కోడి ధరలు వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. జాతితో పాటు రంగులూ కలిసొస్తే అనుకున్న ధరకంటే మరింత వెచ్చించడానికి పందెం ప్రియుళ్లు సిద్ధమవుతున్నారు. వ్యాపారంగా... కోడిపందెం ఆడడం కొంతమందికి ఆనందమైతే.. ఆ కోడి పుంజులను సేకరించి వాటిని నాజూగ్గాను, పందెం పిచ్లో పరుగులు, ఎదుటి కోడిపై ఎగిరి దూకేలా తయారు చేయడం సదానందం. వీటి సేకరణ, యుద్ధానికి తయారు చేసి విక్రయిం చుకోవడంతో అనేకమంది వేలకు వేల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇందుకోసం పల్లెల వెంట తిరిగి కోడిపుంజులను సేకరించి ఇళ్ల ముంగిట కట్టేసి వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం కోడి పందెం ఆట చట్ట వ్యతి రేకం. ఎవరు ప్రోత్సహించినా, ఆడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనేకమంది సంక్రాంతి పండుగ సంప్రదాయమంటూ కోడిపందెం ఆటపై దృష్టి పెడుతున్నారు. అలాంటి ఆటలను సాగనివ్వం. కోడిపందెం ఎక్కడ జరుగుతున్నా దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తాం. –నాగరాజ, డీఎస్పీ, పులివెందుల -
ఆ ప్రజాప్రతినిధులను వదిలిపెట్టం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడి పందేలు ఆడిన ప్రజాప్రతినిధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వారి హోదాలు, చిరునామాలతో సహా పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కోడి పందేలు ఆడిన తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ నేతలకు నోటీసులు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్పై ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. టీడీపీ నేత అరెస్టు!
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని పెంటపాడు పోలీస్ స్టేషన్లో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంటపాడు మండలం పరిమెళ్ళ గ్రామంలో కోడి పందెల నిర్వాహాకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసినవారిలో టీడీపీకి చెందిన తాడేపల్లి గూడెం ఏఎంసీ డైరెక్టర్ సత్యనారాయణతో పాటు మరో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అరెస్టైన వారిని స్టేషన్లో దారుణంగా కొట్టారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నిందితుల బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అదుపులోకి తీసుకున్న నిందితులతోనే ఏఏంసీ డైరెక్టర్ని కొట్టించారని ఆయన బంధువులు గందరగోళం సృష్టించారు. మరోవైపు పోలీసుల వారి నుంచి పన్నెండు ద్విచక్ర వాహనాలు, రూ. 9600 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
కోడి పందేలపై హైకోర్టు సీరియస్
-
కోడి పందేలపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : కోర్టు ఆదేశాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్లో కోడి పందేలు యథేచ్చగా సాగడంపై హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు సోమవారం మరోసారి సీరియస్ అయింది. కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీలను పందేలను ఎందుకు కట్టడి చేయలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే కోడి పందేలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించింది. సంక్రాంతి పర్వదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కోడి పందేలపై ఎన్ని కేసులు నమోదయ్యాయని, ఎంత మంది అరెస్టు చేశారో పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది. ఇందుకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరాలు అందజేసేందుకు నాలుగు వారాల గడువు కోరారు. అందుకు అనుమతించిన న్యాయమూర్తి కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. -
కోడి పందేలకు బ్రేక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముక్కనుమ రోజు కూడా జిల్లాలో చాలాచోట్ల కోడిపందేలను నిర్వహించారు. అయితే పోలీసుల దాడులతో బుధవారం మధ్యాహ్నానికి పందేలు ఆగాయి. దెందులూరు ఎమ్మెల్యే నిర్వహిస్తున్న కొప్పాక కోడిపందేల బరిపై పోలీసులు దాడి చేసి నిలిపివేశారు. ఎప్పుడూ వారం రోజులకు పైగా ఈ బరిలో పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మూడు రోజుల్లో కూడా జిల్లాలో అతి పెద్ద పందేలు నిర్వహించిన బరిగా కొప్పాక పేరు పొందింది. అక్కడికి పోలీసులను కాని, మీడియాని కాని అనుమతించకుండా తన సొంత సైన్యంతో చింతమనేని కోడిపందేలు నిర్వహిస్తూ వచ్చారు. ఎట్టకేలకు పోలీసులు ఆ బరివైపు తొంగిచూడటం పట్ల జిల్లాలో హర్షం వ్యక్తం అయింది. ఎవరిని అరెస్టు చేయకపోయినా చింతమనేని వేస్తున్న పందేలు ఆపే తెగువ పోలీసుల నుంచి రావడం మంచి పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు. కొన్ని చోట్ల ముక్కనుమ అయిన బుధవారం కూడా పందాలు వేసేందుకు కొందరు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్.మురళీకృష్ణ కామవరపుకోట మండలంలోని కోడిపందాల బరులను పరిశీలించారు. మండలంలోని రావికంపాడు, కామవరపుకోట, కొల్లివారిగూడెం తదితర కోడిపందేల బరుల వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. టి.నరసాపురం మండలంలో బండివారిగూడెం, అల్లంచర్ల రాజుపాలెం గ్రామాల్లో కోడిపందేలపై టి.నరసాపురం పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేశారు. నిడమర్రు మండలంలో పోలీసులు కోడిపందేల శిబిరాల వద్దకు వెళ్లి జరుగుతున్న పందాలను నిలిపివేసి, టెంట్లు పీకేసారు. పత్తేపురం, బువ్వనపల్లి, సిద్దాపురం, బావాయిపాలెం, తోకలపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 9 నుండి 11 గంటలల్లోపు వరకూ పందేలు కొనసాగినా ఆ తర్వాత పోలీసులు రావడంతో ఆయా శిబిరాల్లో పందేలు నిలిచిపోయాయి. పాలకొల్లు మండలంలో శివదేవునిచిక్కాల, వాలమర్రు, లంకలకోడేరు గ్రామాల్లో పందేల శిబిరాలపై దాడులు చేసి 14మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కోడి పందేల కట్టడిలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోయిన విషయంపై ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం వీఆర్వోలు, గ్రామకార్యదర్శులతో తహసీల్దార్లు సమావేశం నిర్వహించి వారి నుంచి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్లు స్వీకరించారు. 144 సెక్షన్ అమలుకు పోలీసు శాఖ తమకు సహకరించలేదని ఎక్కువ మంది తమ నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఏ ఏ బరుల వద్ద నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎంతెంత మామూళ్లు వసూలు చేశారన్న విషయాలను కూడా తమ నివేదికల్లో పొందుపరుస్తున్నట్లు సమాచారం. -
3 రోజుల్లో వంద కోట్ల బెట్టింగ్లు
-
కోడిపందేలను జూదంగా మార్చేశారు
-
హైదరాబాద్ టు ఆంధ్రా
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలకు నగరవాసులు సైతం సై అంటున్నారు! ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే కోడి పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే సంక్రాంతికి దాదాపు 20 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లగా.. ప్రత్యేకంగా కోడి పందేల్లో పాల్గొనేందుకు మరో 10 వేల మంది వరకు వెళ్లారు. ఆదివారం అమీర్పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి వీరంతా సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్కు పయనమయ్యారు. కోడి పందేలు, పొట్టేళ్ల పందేలతోపాటు పలుచోట్ల జరిగే గుండాటల్లో పాల్గొనేందుకు వీరు ఉత్సుకత చూపుతున్నారు. తెలంగాణవాసులను ఆహ్వానిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కటౌట్లు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. లష్కర్ టు భీమవరం కోడి పందేళ్లలో పాల్గొనేందుకు పలువురు లష్కర్వాసులు భీమవరం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వీరు శనివారం ఉదయం భీమవరం చేరుకున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్నగర్ నియోజకవర్గాల నుంచి వెయ్యి మంది సుమారు 200 వాహనాల్లో వెళ్లారు. గత పదిహేనేళ్లుగా ఏటా భీమవరం వెళ్లడం, కోడి పందేళ్లలో పాల్గొని రావడం వీరికి మామూలే. భీమవరం ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, ప్రత్యేక భవనాలు ముందే అద్దెకు తీసుకుని, మూడ్రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి పెట్టుకుంటారు. కొందరైతే ఇక్కడి నుంచే వంటవాళ్లను, పనివాళ్లను తీసుకువెళ్తున్నారు. భీమవరం బాట పడుతున్నవారిలో భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు, పెద్దమొత్తంలో ఇంటి అద్దెల ఆదాయం కలిగిన వారు, పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ్నుంచి 90 పొట్టేళ్లు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లులో జరిగే పొట్టేళ్ల పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్వాసులు మక్కువ చూపుతున్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 60 నుంచి 90 వరకు పొట్టేళ్లను తీసుకెళ్లారు. ‘‘ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా పొట్టేళ్ల పందెంలో పాల్గొనేందుకు వెళ్తున్నాం. మా పొట్టేళ్లు ఈసారి గతంలో కంటే మెరుగ్గా పోటీపడతాయి’’అని పాతబస్తీకి చెందిన మంజూర్ పేర్కొన్నారు. ఏపీలో కత్తులు దూసిన పందెం కోళ్లు ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ.3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగినట్టు అంచనా వేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోడి పందేలను ప్రారంభించారు. పాతబస్తీలో రూ.15 కోట్ల వ్యాపారం ఏపీలో జరిగే కోళ్ల పందేల కోసం నగరంలో దాదాపు రూ.15 కోట్లకుపైగా కోళ్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. పాతబస్తీలోని బార్కస్, ఎర్రకుంట, షాహీన్ నగర్లో 50 మంది పందెం కోళ్ల పెంపకందారులు ఉన్నారు. ఒక్కొక్కరు కనీసం 50 నుంచి 60 కోళ్లను పెంచి, విక్రయించినట్లు తెలిసింది. ఒక్కో కోడి ధర రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా పలికినట్టు సమాచారం. వీటిని కొనుగోలు చేసేందుకు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొద్దినెలల కిందటే పందెం రాయుళ్లు వచ్చారు. వీరు దాదాపు 2 వేల నుంచి 3 వేల కోళ్ల దాకా కొనుగోలు చేసినట్టు పాతబస్తీలోని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా కొనుక్కు వెళ్లిన వాటిలో కొన్నింటిని ఇళ్లలోనే పెంచుకుంటూ వచ్చే ఏడాది పందేలకు సిద్ధం చేస్తారు. బలిష్టంగా ఉన్న కోళ్లను ఈ ఏడాదే పందెం బరిలోకి దింపుతారు. నగరానికి ‘పల్లె’శోభ నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. వీధుల్లో భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల సయ్యాటలతో భోగిని నగరవాసులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పల్లెలకు వెళ్లలేనివారు నగరంలోనే పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. దీంతో ఆదివారం నగరంలో చాలాచోట్ల పల్లె వాతావరణం కనిపించింది. -
కొక్కొరొకో..
సాక్షి, అనంతపురం: సంక్రాంతి అంటే హరిదాసు సంకీర్తనలు. గొబ్బెమ్మలు గుర్తుకు వస్తాయి. అదే కోస్తా జిల్లాల్లో అయితే పందెంకోళుŠల్ కదనరంగంలో కాళ్లు దువ్వుతాయి. ఈ సంస్కృతి ‘అనంత’కు కూడా విస్తరించింది. అయితే జిల్లాలో కోడిపందేలు ఆడటం మామూలుగా జరుగుతున్నా సంక్రాంతి పండుగ సమయంలో కొంత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కోడిపందేలపై కొరడా ఝుళిపించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశించడంతో జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వారం రోజుల నుంచి కోడిపందేలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామంలోనూ దండోరాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు. ఐదు కన్నా ఎక్కువ మంది గుమికూడినా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆరు డివిజన్లపై ప్రత్యేక దృష్టి జిల్లాలో ఎక్కువగా శింగనమల, తాడిపత్రి, హిందూపురం, కదిరి, అనంతపురం, గుంతకల్లు ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహిస్తారని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయ ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన వారిని వారం రోజులుగా పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం, తహసీల్దార్ల వద్ద బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 271 మందికి పైగా కోడిపందేల నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 18 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 46 కోళ్లు, 23 కత్తులు, రూ. 11530లు స్వాధీనం చేసుకున్నారు. నిఘా కోసం జాయింట్ యాక్షన్ బృందాలు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడి పందేలపై నిఘా ఉంచడానికి మండల స్థాయిలో జాయింట్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, జంతు సంక్షేమ కమిటీ సభ్యులతో కూడిన ఈ బృందాల ద్వారా నిఘా పెట్టడంతో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారాలు ఈ బృందాలకు అప్పగించారు. కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించడం నిషేదం. ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులతో పాటు స్థలాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. – జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ -
బరిలో కో‘ఢీ’
ఏలూరు టౌన్, అమలాపురం, కంకిపాడు(పెనమలూరు): పోటీలకు పందెం కోడి కత్తులు దూస్తోంది! పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. న్యాయస్థానం ఆదేశాలు, పోలీస్ ఆంక్షలను ధిక్కరిస్తూ కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పండుగకు ఒకరోజు ముందే కోడి పందేలకు అంకురార్పణ చేశారు. భారీగా డబ్బులు చేతులు మారటంతో బరులు పందెంరా యుళ్లతో నిండిపోయాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజక వర్గంలోనూ కోడి పందేలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ బరికి సన్నద్ధం చేస్తున్నారు. -
జోరుగా కోడిపందేలు: పోలీసుల దాడులు
-
'కోడి పందేలను అడ్డుకోవడం దురదృష్టకరం'
విజయవాడ : కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. పూర్వం నుంచి కోడి, పొట్టేలు పందేలను పండుగ సంప్రదాయంలో భాగంగా వేడుకలాగా నిర్వహించేవారన్నారు. హింసకు తావు లేకుండా చట్టానికి లోబడి ఈ వేడుకలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఎవరో ఓ వ్యక్తి కోర్టుకి వెళితే పోలీసులు అడ్డుకోవడం మెజార్టీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వనట్టేనని పేర్కొన్నారు. తమిళనాడులో జల్లి కట్టు కోసం ఆర్డినెన్స్ తెచ్చారు. ఇక్కడ అలా కాకుండా కేవలం సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కోళ్ల పందేలకు అనుమతి ఇస్తే బాగుంటుందని తెలిపారు. -
పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా కోడిపందేలు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా జరుగుతున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేపట్టారు. జిల్లాలోని ఏలూరు డివిజన్, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లో శనివారం భారీ ఎత్తున దాడులు నిర్వహించి కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పందేలను నిలువరించేందుకు ఏపీఎస్పీకి చెందిన బెటాలియన్ను కేటాయించినట్టు డీఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. ఏలూరు డివిజన్లో 500 మందిపై బైండోవర్ కేసులు, 700 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కోడి పందేలను అరికట్టడానికి 67 పికెట్స్.. 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పందేలపై అనుమతి లేదని అనధికారకంగా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈశ్వరరావు స్పష్టం చేశారు. -
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వలేం: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: కోడి పందేలపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీజేపీ నేత కనుమూరు రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొనగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అనూప్ చౌదరి స్పందిస్తూ కోళ్లను అదుపులోకి తీసుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని విన్నవించారు. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ అంశం స్పష్టంగా ఉందని వివరించారు. అయితే ఈ అంశంపై హైకోర్టునే సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. సంబంధిత ఉత్తర్వులు లిఖితపూర్వకంగా వెలువడాల్సి ఉంది. -
కోడి x వెలగపూఢీ
సంప్రదాయాల ముసగులో విషసంస్కృతికి బీజం వేస్తున్న కోడి పందాలకు అడ్డుకట్ట వేయాలని హైకోర్టు ఆదేశాలు.. తమ ఆదేశాలను పాటించకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరికలు.. అయినా.. ఆ పందాలకు నిలయాలైన ఉభయగోదావరి జిల్లాలతోపాటు.. తాజాగా విశాఖ జిల్లాలోనూ పందెంరాయుళ్లు ‘బరులు’ సిద్ధం చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి.. వాటిని ఉసిగొల్పి రక్తమోడేలా అవి కొట్టుకుంటుంటే(చచ్చిపోతుంటే).. వాటిపై డబ్బులు సంపాదించే రాక్షస క్రీడకు మొదటి నుంచి ఉత్తరాంధ్ర ప్రజానీకం దూరమే. ఎక్కడో ఏమో కానీ అటువంటి సంస్కృతి మన జిల్లాలో లేదనేది నిర్వివాదాంశం. కానీ పొట్టచేత పట్టుకుని వలసవచ్చి ఇక్కడి ఆదాయవనరులపై ‘పడి’ నడమంత్రపు సిరితో రెచ్చిపోతున్న కొందరు టీడీపీ నేతలు గత కొన్నేళ్లుగా ఆ విషసంస్కృతికి ఇక్కడా బీజం వేస్తున్నారు. ఆ క్రమంలోనే విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కొన్నేళ్లుగా ఇక్కడా కోడిపందాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎప్పుడూ చూసీచూడనట్టు వదిలేసే పోలీసులు ఈసారి మాత్రం యాక్షన్లోకి దిగారు. సోమవారం ముడసర్లోవలో బరులు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి యువసేన అధ్యక్షుడు సందీప్ను అరెస్టు చేశారు. ఇదే యాక్షన్ను సంక్రాంతి అయ్యే వరకు కొనసాగిస్తారా.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఒగ్గేస్తారా.. చూడాలి.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ వలస నేతల పుణ్యమాని కత్తులు కట్టి ఆడించే కోడిపందాల విష సంస్కృతి ఇక్కడా వేళ్లూనుకుంటోంది. సంక్రాంతి పండుగ రోజుల్లో డిగ్గీ కోడి (కత్తులు కట్టకుండా ఆడించే) పందాలకు గోదావరి జిల్లాలు అనాది నుంచి పెట్టింది పేరు. తర్వాతికాలంలో కోళ్లకు కత్తులు కట్టి రూ.కోట్లలో పందాలు కాయడం, రాత్రిపగలూ తేడా లేకుండా పందాల బరుల వద్దే శిబిరాల్లో పేకాట, గుండాటలు యధేచ్ఛగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విష సంస్కృతి పెచ్చుమీరిపోయింది. దీంతో గత మూడేళ్లుగా వరుసగా హైకోర్టు జోక్యం చేసుకోవడం.. చివరికి కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా పండుగ మూడురోజులు పందాలు నిర్వహించడం రివాజుగా వస్తోంది. గోదావరి జిల్లాల్లో ఎలా ఉన్నా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోడిపందాల సంస్కృతి ఎన్నడూ లేదు. ఎక్కడైనా ఒకటి రెండుచోట్ల పందాలు నడిచినా బరులు గీసి రూ.కోట్లలో పందాలు కాసే పరిస్థితి ఎప్పుడూ లేదు. అధికారుల నీడలోనే.. కానీ గత కొన్నేళ్లుగా వివాదాస్పద వలసనేతగా ముద్రపడ్డ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం తన ఇలాకాలో విచ్చలవిడిగా కోడిపందాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గత రెండేళ్లుగా ఆరిలోవ సమీపంలోని ముడసర్లోవ ప్రాంతంలో (రామకృష్ణా పురం వెనుక) సుమారు పది ఎకరాల జీవీఎంసీ ఖాళీ స్థలంలో భారీగా పందాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది స్వయంగా ఆయనే పందాలను ప్రారంభించారు. పందెంరాయుళ్లు రూ.కోట్లలో పందాలు కాశారు. వాటితో పాటు పేకాట, మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయి. గత ఏడాది ఎమ్మెల్యే వెలగపూడి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ బరి కోసం నిర్దేశించిన స్థలాన్ని చదును చేయగా.. నీటిసరఫరా విభాగం అధికారులు ప్రతి రోజు నీళ్లు చల్లారు. పండుగ మూడు రోజులు పందాలకు పోలీసులే కాపలా కాశారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే రీతిలో నిర్వహించేందుకు వెలగపూడి అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన స్థలాన్నే మళ్లీ చదును చేసి బరిని సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో పందాలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు వెంటనే స్పందించి సోమవారం బరులు సిద్ధం చేస్తున్న వెలగపూడి యువసేన అధ్యక్షుడు, ఎన్నో వివాదాస్పద కేసుల్లో ఉన్న కంచర్ల సందీప్ సహా 12మందిని అరెస్టు చేశారు. ఇదే రీతిన సంక్రాంతి అయ్యే వరకు ఖాకీలు కోడిపందాలపై పోలీసులు గెలుస్తారా?.. అధికార బలంలో ఒత్తిడి పెంచి పందాలు నిర్వహించడంలో టీడీపీ నేతలు గెలుస్తారా??.. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు.. దీనిపై తహసీల్దారు బాస్కరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం ఎక్కడ వీటిని నిర్వహించినా నేరమవుతుందన్నారు. నిర్వహించినవారు ఎలాంటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. వెలగపూడి యువసేన అధ్యక్షుడు సందీప్ అరెస్టు ఆరిలోవ(విశాఖ తూర్పు): ముడసర్లోవ రిజర్వాయరు వెనుక రామకృష్ణాపురం సమీపంలో జీవీఎంసీ ఖాళీ స్థలంలో కోడి పందాలు నిర్వహించడానికి తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజులగా ఇక్కడ స్థలాన్ని శుభ్రం చేయిస్తున్నారు. సోమవారం ఇక్కడ తుప్పలు కొడుతూ పందాల బరి కోసం మార్కింగ్ వేస్తుండగా ఆరిలోవ పోలీసులు అక్కడకు చేరుకొని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆరిలోవ పోలీసులు రూరల్ తహసీల్దారు భాస్కరరెడ్డి ముందు హాజరుపరిచారు. ఈ 12 మందిపైనా తహసీల్దారు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వారిలో గత రెండేళ్లు ఇక్కడ కోడి పందాలు నిర్వహించిన వెలగపూడి యువసేన అధ్యక్షుడు కంచర్ల సందీప్(దీనదయాల్పురం), ఎం.రమేష్(పీఎం పాలెం), బి.వెంకటరెడ్డి, సీహెచ్.చక్రపాణి(పైనాపిల్కాలనీ), కొప్పుల అర్జున్(శ్రీకృష్ణాపురం), మారిక సన్యాసి(శ్రీకృష్ణాపురం), మారిక మహేష్(శ్రీకృష్ణాపురం), కొప్పల కుమార్(శ్రీకృష్ణాపురం), యామలపల్లి అప్పలరాజు(శ్రీకృష్ణాపురం), యామలపల్లి కృష్ణ(శ్రీకృష్ణాపురం), మారిక కుమారరాజు(శ్రీకృష్ణాపురం), మారిక నూకరాజు(శ్రీకృష్ణాపురం) ఉన్నారు. అయితే అక్కడ స్థలం తమ గిరిజనులదేనని, వ్యవసాయం చేయడానికి పనులు చేస్తుంటే ఆరిలోవ పోలీసులు తీసుకొచ్చి బైండోవర్ కేసులు పెట్టించారని వీరంతా తహసీల్దారుకు చెప్పడం విశేషం. -
జూబ్లీహిల్స్లో కోడిపందాలు: కోళ్లు, నగదు స్వాధీనం
-
జూబ్లీహిల్స్లో కోడిపందాలు: 20 కోళ్లు, నగదు స్వాధీనం
హైదరాబాద్: హైదరాబాద్లోని అత్యంత ప్రముఖులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్లోనూ కోడిపందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కోడి పందాల స్థావరాలపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా 20 పందెం కోళ్ళను స్వాధీనం చేసుకుని 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరినుంచి 25 సెల్ఫోన్లు, రూ.70 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించారు. -
‘పుంజు’కుంటున్నాయ్
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : సంక్రాంతి సమీపిస్తోంది. సంబరాల మాటున ఇప్పటికే చాటుమాటున కోడి పందేలు మొదలయ్యాయి. భోగి మొదలుకుని కనుమ వరకు భారీఎత్తున పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కోళ్లను బరిలోకి దింపేందుకు నేతలు, పందేలరాయుళ్లు సై అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, పందేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు ఎప్పటిలా గంభీరంగా ప్రకటిస్తున్నారు. రాజకీయ నేతలు రంగంలోకి దిగుతుండటంతో పోలీస్ ప్రకటనలు అమలవుతాయా లేక తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోతాయా అనేది త్వరలోనే తేలనుంది. తీరప్రాంతాలే వేదికగా.. కోడి పందేలకు తీర ప్రాంతాలను వేదికగా చేసుకుంటున్నారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో పందేలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊటుకూరు పంచాయతీ పరిధిలో గత ఏడాది ఆగిన పందేలను ఈసారి కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు, జొన్నవాడ పెన్నా నదిలో ఇప్పటికే చాటుమాటుగా పందేలను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో పందేలు నిర్వహించి, పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. సంగం మండలం దువ్వూరు, మక్తాపురం ప్రాంతాల్లో ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు ప్రాంతంలోనే గతంలో కోడిపందేలు వేసేవారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి మరీ పందేలు నిర్వహించేవారు. ఈసారి పందేలు వేసే బరులు మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పుంజులకు డిమాండ్ బుచ్చిరెడ్డిపాళెంలో పందెం పుంజులకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు బాదం, పిస్తా, జీడిపప్పుతో కూడిన పౌష్టికాహారం అందించి మరీ వాటిని పెంచుతున్నారు. కొందరైతే పుంజులకు మద్యం సైతం తాగిస్తున్నారు. బయట ప్రాంతాల వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ ఏర్పడటంతో పందెం కోళ్ల ధరలు వేలాది రూపాయలు పలుకుతున్నాయి. రూ.వంద నుంచి లక్షల్లో.. దామరమడుగు పెన్నా నదిలో సుదూరంగా ఇప్పటికే కోడి పందేలు వేస్తున్నారు. రూ.వంద నుంచి రూ.లక్షల పందెం కడుతున్నారు. ఇక్కడి బరుల్లో ప్రస్తుతం 10 నుంచి 20 మంది పాల్గొంటుండగా.. సంక్రాంతి నాటికి వందలాది మందితో జరిగే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా! కోడి పందేలు నిర్వహించడం నేరమని హైకోర్టు నిషేధం విధించింది. ఇవి జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు సైతం వీటిని జరగనివ్వబోమని చెబుతున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ 1960, ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే, చివరి వరకు ఈ మాటపై నిలబడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది. నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆధ్వర్యంలో కోడిపందేలకు చెక్ పడుతుందని పలువురు భావిస్తున్నారు. -
కోడి పందేలు జరగడానికి వీల్లేదు
సాక్షి, హైదరాబాద్: రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎక్కడైనా కోడి పందేలు జరిగితే అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీరిద్దరు స్వయంగా పర్యవేక్షించాలంది. కోడి పందేల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం లెక్క లేకుండా పోతోందని, జోక్గా భావిస్తున్నారని మండిపడింది. ఏం చర్యలు తీసుకుంటున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. కోడి పందేలకు సిద్ధం చేసిన మైదానాల్లో ఎన్నింటిని తనిఖీలు చేశారు.. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారు.. ఎన్ని చోట్ల 144 సెక్షన్ కింద నిషేదాజ్ఞలు విధించారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని వారికి స్పష్టం చేసింది. ఒకవేళ ఈ వివరాలను సమర్పించకుంటే స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న సంక్రాంతికి కోడి పందాలు జరగకుండా∙చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు వార్నింగ్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కోడిపందాలు, జూదాల విషయంలో హద్దులు దాటొద్దంటూ పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. జూదాల విషయంలో పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే నియోజకవర్గాలకు ఏ,బీ,సీ గ్రేడింగులు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పనితీరు సరిగా లేకుంటే అభ్యర్థులను మార్చడానికి వెనకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2018 చివరికల్లా జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని సూచన చేశారు. అలాగే జన్మభూమి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. అర్హులైన లబ్దిదారులు ఇబ్బండి పడకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు, పార్టీ ఇన్ఛార్జుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
కొనసాగిన కోట్లాట
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ప్రభుత్వ యంత్రాంగం ఓడిపోయింది. కోడి పందేలతోపాటు జూద క్రీడలను ముందుండి మరీ గెలిపించింది. జూదరుల సొమ్ములను కరిగించేసి.. పందేల నిర్వాహకులకు సిరుల వర్షం కురిపించింది. రాజకీయ క్రీడలో.. అధికార పార్టీ నేతలు అండదండలు అందించడంతో ప్రభుత్వం నుంచి ‘చూసీచూడనట్టు వెళ్లండి’ అంటూ మౌఖిక ఆదేశాలు వెలువడటంతో జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టీమ్లు అడ్రస్ లేకుండా పోయాయి. మూడు రోజుల పండగ అయినా బోనస్గా నాలుగో రోజున కూడా పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. దీంతో సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, పేకాట, ఇతర జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా రూ.2 వేల నకిలీ నోట్లనూ చలామణి చేయడం కలకలం సృష్టించింది. అకివీడు మండలం ఐ.బీమవరం జూద శిబిరంలో పెద్దఎత్తున రూ.2 వేల నకిలీ నోట్లు చలామణి అయ్యాయి. దీనిని గుర్తించిన నిర్వాహకులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించి వేశారు. కొన్ని దొంగనోట్లను చించివేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. కోడిపందేల మాటున జూద క్రీడలు, పేకాట పెద్దఎత్తున సాగినా ఖాకీలు మిన్నకుండటం విమర్శలకు తావిచ్చింది. అంతా అయిపోయాక పందేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీలు పనిచేయలేదు. ఈ నెపాన్ని కిందిస్థాయి సిబ్బందిపై నెడతారా, వారికి నోటీసులు ఇస్తారా లేక ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా అనేది వేచి చూడాల్సిందే. కోర్టుకు చూపడం కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 330 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అన్నిచోట్లా ఆడించారు ప్రధానంగా భీమవరం మండలం వెంప, వీరవాసరం మండలం కొణితివాడ, భీమడోలు మండలం గుండుగొలను, పెదవేగి మండలం కొప్పాకలో భారీస్థాయి పందేలు నిర్వహించగా, భీమవరం మండలం తోకతిప్ప, ఈలంపూడి, దిరుసుమర్రు, చినఅమిరం, రాయలం, యనమదుర్రు, లోసరి, దెయ్యాలతిప్ప, వీరవాసరం, అండలూరు, నందమూరుగరువు, మత్య్సపురి, నవుడూరు, ఉత్తరపాలెం, వడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఒక మోస్తరు పందేలు జరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం కూడా కోడిపందేలు, గుండాట, పేకాట విచ్చలవిడిగా సాగాయి. మొగల్తూరు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో గుండాట, కోడి పందేలను రేయింబవళ్లు నిర్వహించారు. రామన్నపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లోని శిబిరాలపై పోలీసులు సోమవారం పోలీసులు దాడులు చేశారు. లిఖితపూడి, రాజుల్లంక, వేములదీవి, లక్ష్మణేశ్వరం, రుస్తుంబాద, తూర్పుతాళ్లు, మత్స్యపురి, యర్రంశెట్టివారిపాలెం పందేలు యథావిదిగా జరిగాయి. పాలకొల్లు మండలం పూలపల్లి ప్రధాన బరులు కోలాహలంగా మారింది. దగ్గులూరు, తిల్లపూడి, చింతపర్రు, భగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, గొల్లవానిచెరువులో జూద క్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఎట్టి పరిస్థితితుల్లోను కోడి పందాలను ఆపాలని అధికార పార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో సోమవారం ఉదయం పోలీసులు, గ్రామస్తులు మధ్య రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. భీమడోలు మండలం గుండుగొలను, కురెళ్లగూడెం, పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్పేట తదితర గ్రామాల్లో పందేలు భారీ ఎత్తున జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలోని పెద్ద బరితోపాటు రెండు చిన్నబరుల్లోనూ పందెంకోళ్లు కత్తులు దూశాయి. కాళ్ల మండలం సీసలి, జక్కరం, పెదఅమిరం, మాలవానితిప్ప, ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం, కొమడవోలు, జాలిపూడి, శ్రీపర్రు గ్రామాల్లో పందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగాయి. కాట్లంపూడి, మాదేపల్లి శివారు ప్రాంతాల్లోని చేపల చెరువులు, పంటభూముల మధ్య చెట్ల కింద కొత్తగా పేకాట స్థావరాలు నడిచాయి. జంగారెడ్డిగూడెం, సుబ్బంపేట రోడ్డు, శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో పందేలు, జూదాలు జోరుగా నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, బయ్యనగూడెం, దిప్పకాయలపాడు, పరింపూడి గ్రామాల్లోనూ కొనసాగాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు నిర్వహించే బరుల్లో సోమవారం పందేలు వేయగా, మిగిలిన చోట్ల నిలిచిపోయాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ధర్మాజీగూడెం, కలరాయనగూడెం, ములగలంపాడు గ్రామాల్లోని ఆయిల్పామ్, మామిడి తోటల్లో నిర్వహించిన పందేలకు కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి పందెగాళ్లు తరలివచ్చారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు కొనసాగాయి. -
కోడిపందేల సమరం మదలైంది
-
పందెం రాయుళ్లకు ప్రజాప్రతినిధుల భరోసా
-
కోళ్లు రెడీ.. కొట్లాట లేదు! .
► నిఘా నీడలో శివపల్లి ►దశాబ్దాలుగా కోడి పందేలకు కేంద్రం ►రెండేళ్లుగా నిషేధం అమలు ►ఈయేడూ కట్టడికి పోలీసుల వ్యూహం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నదమ్ములే దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేలను ప్రోత్సహిస్తున్నారు. పండుగ వచ్చిందంటే చాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పందెంరాయుళ్లు కారులో, జీపుల్లో గ్రామానికి చేరుకుని బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. విజయరమణారావు తండ్రి కాలం నుంచి గ్రామంలో పెద్దరికం కొనసాగుతుండగా, ఆ కుటుంబం కోడి పందేలకు అండగా నిలుస్తోంది. విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పం దేలు జోరందుకున్నాయి. వందల్లో ఉన్న పం దెంరాయుళ్ల సంఖ్య వేలకు చేరింది. తన పదవీకాలం ఐదేళ్లలో విజయరమణారావు ఏటా సంక్రాంతికి పెద్ద జాతరే నడిపించారు. రెండేళ్ల క్రితం పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఈ పందేలపై నిషేధం విధించింది. దీంతో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కోడిపుంజుల కొట్లాటను పోలీసులు కట్టడి చేశారు. గతేడాది పందెంరాయుళ్లను వారం రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. కొట్లాటే లేదు జిల్లాలో చాలా గ్రామాల్లో నాటుకోళ్లు పెంచేవారంతా పందెం కోళ్లను పెంచుతున్నారు. నాటుకోడి మార్కెట్లో రూ.400 నుంచి రూ.500లకు లభిస్తుండగా, పందెం కోడికి రూ.2 వేలు పలుకుతోంది. దీంతో చాలా మంది గ్రామాల్లో పందెం కోళ్లను పెంచేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పందెం కోళ్లను నాగపూర్, చంద్రాపూర్, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన వారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గ్రామంపై ప్రత్యేక నిఘా జిల్లాలోని శివంపల్లిలో చాలా ఏళ్లుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ పందేలను ప్రభుత్వం నిషేధించింది. దీంతో పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా గ్రామంపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఊళ్లోకి వచ్చిపోయేవారిపై దృష్టిసారించాం. ఎవరైనా రహస్యంగా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు . – మల్లారెడ్డి, ఏసీపీ పందేలు నిలిపేసినం.. దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేళు జరిగాయి. అందరూ ఇష్టంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంధ్రా ప్రాంతం మాదిరిగా రూ.వేలల్లో కాకుండా వందల్లో సరదాగా డిపాజిట్లు కొనసాగేవి. ప్రస్తుతం ఇలాంటి ఆటలు నిషేధించడంతో గ్రామంలో సైతం పందేలు ఆలిపేసినం. – శ్యామ్సుందర్రావు, సర్పంచ్ -
సంక్రాంతి కయ్యానికి సై అంటున్న కోడి పుంజులు
-
హత్యకేసులో ఇద్దరి అరెస్ట్
కామవరపుకోట : హత్య కేసులో ఇద్దరు యువకులను గురువారం అరెస్ట్ చేసినట్లు తడికలపూడి ఏఎస్సై డి.ఎ.దీక్షితులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వీరవల్లి వీరాస్వాములుకు, మరికొందరికి గత మంగళవారం కోడిపందేల సందర్భంగా ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వీరాస్వాములు హత్యకు గురయ్యాడు. దీంతో కామవరపు కోట పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెంకు చెందిన జోడాల గిరిబాబు, కొండగూడెంకు చెందిన బిరుదుగడ్డ మోహనరావు అనే ఇద్దరు యువకులను కామవరపు కోట బస్స్టాండ్ వద్ద చింతలపూడి సీఐ జి.దాసు.అరెస్ట్ చేశారు. -
కోడిపందేలు వద్దన్నందుకు.. కడతేర్చారు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో ఓ వివాహితపై భర్త, అత్తలు కలసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... పట్టింపాలెం గ్రామానికి చెందిన సత్యవాణి (24)కి ఐదేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. భర్త తరచూ కోడిపందేలు ఆడుతూ ఉండడంతో ఈ విషయమై వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలోనూ గొడవ జరిగింది. దీంతో భర్త, అత్తలు సత్యవాణిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె తీవ్ర కాలిన గాయాలతో మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ ఖాకీకి సరిపోలేదట !
ఏలూరు : కోడిపందేల మాటున జిల్లావ్యాప్తంగా చాలామంది పోలీసులు రూ.కోట్లు వెనకేసుకున్నారన్న వార్తలు కలకలం రేపుతుండగా.. మెట్ట ప్రాంతంలోని ఓ పోలీస్ అధికారి మాత్రం ఇంకా సొమ్ము కావాలని సిబ్బందిని వేధిస్తున్నట్టు తెలిసింది. కోడిపందేల పేరుతో ఖాకీలు సాగించిన వసూళ్లపై ‘పోలీసులకు ఎంతెంత’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. సర్కిళ్లు, స్టేషన్ల వారీగా సాగిన వసూళ్ల ఆరోపణలపై వెలువడిన కథనం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వర్గాల నుంచి ఓ సమాచారం బయటకు పొక్కింది. మెట్ట ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారికి పందేల నిర్వాహకుల నుంచి నేరుగా రూ.11 లక్షలు ముట్టాయి. అయినా.. తన పరిధిలో ఉన్న స్టేషన్ల నుంచి మామూళ్లు రాలేదని ఆయన కస్సుబుస్సు లాడినట్టు తెలిసింది. ‘మీరెవరూ ఇవ్వకుంటే పరిస్థితి ఏమిటి. ఉన్నత స్థాయిలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధికి కూడా సొమ్ము ఇవ్వాలి. ఎక్కడి నుంచి తేవాల‘ని తన కిందిస్థాయి సిబ్బందితో వాదులాడినట్టు సమాచారం. ‘అదేంటి సార్. మీ వాటా మీకు వచ్చిందిగా...’ అని అడిగితే.. ‘నాకే ఎదురు సమాధానం చెబుతారా. మీ సంగతి చూస్తా’నని ఆయన బెదిరింపులకు దిగారని అంటున్నారు. ఎక్కడికక్కడ వాటాలు వేసుకుని సొమ్ము పంచుకున్నా.. తమ వాటా కూడా లాగేసుకుంటున్నారని ఆ ప్రాంత పోలీసులు మొత్తుకుం టున్నారు. ఇదిలావుండగా, భీమడోలు పరిధిలోని పోలీసు సిబ్బందికి, అధికారికి వాటాల విషయంలో ఇదే రకమైన స్పర్థలు వచ్చాయంటున్నారు. మొత్తంగా చూస్తుంటే కోడిపందేల మాటున సాగిన వసూళ్లలో పోలీసులతోపాటు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకూ వాటాలు వెళ్లాయన్న వాదనలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజు గోదావరి జిల్లాల్లో కోడిపందాల జోరు
-
కోళ్లు.. కోట్లు
అమలాపురం :సంక్రాంతి పర్వదినాల్లో మొదటిదైన భోగి పండగ సందర్భంగా జిల్లాలో గురువారం విస్తృతంగా కోడిపందేలు నిర్వహించారు. పలువురు వేలు, లక్షల్లో పందేలు కాశారు. దీంతో తొలి రోజే జిల్లాలో ఏకంగా రూ.25 కోట్ల వరకూ కోడిపందేలు జరిగినట్టు అంచనా. గుండాట బోర్డుల వద్ద రూ.500కు తక్కువ పందెం లేదని నిర్ణయించారు. హైకోర్టు అడ్డుకట్ట వేసినా.. అధికార పార్టీ నేతలు తమ పలుకుబడి వినియోగించి కోడిపందేలకు అనధికార అనుమతి సాధించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై పశ్చిమ గోదావరి నేతల ఒత్తిడి చాలావరకూ ఉన్నా, మన జిల్లా నేతలు సైతం తమవంతు పాత్ర పోషించారు. దీంతో ప్రధాన రహదారులను ఆనుకుని కోట్ల రూపాయల పందేలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తిరునాళ్లగా మారిన మురమళ్ల అందరూ ఊహించినట్టుగానే ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు పెద్ద ఎత్తున జరిగాయి. తొలి రోజు ఈ ఒక్కచోటనే రూ.10 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు అంచనా. తొలి పందెమే రూ.5 లక్షలతో మొదలవగా, యజమానులు ఒక్కో పందేన్ని రూ.10 లక్షల వరకూ కాస్తున్నారు. వీరితోపాటు చుట్టూ జనం కూడా వారిలో వారు పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు. దీంతో పెద్ద బరిలో ఒక్కో పందేనికి రూ.50 లక్షల వరకూ చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. మరో రెండు చిన్న బరుల్లో ఒక్కో పందెం రూ.20 లక్షల వరకూ కాస్తున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు దగ్గరుండి మరీ ఈ పందేలు నిర్వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో కాట్రేనికోన మండలం చెయ్యేరు, పల్లంకుర్రు, ముమ్మిడివరం, తాళ్లరేవుల్లో సహితం పందేలు జరిగాయి. కోనసీమలోని అల్లవరం, గోడిలంక, కొమరగిరిపట్నాల్లో పెద్ద ఎత్తున పందేలు నిర్వహించారు. గోడిలంకలో తొలి రోజు రూ.కోటి వరకూ పందేలు జరిగాయి. అమలాపురం, ఉప్పలగుప్తం, ఆత్రేయపురం, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో కూడా పందేలు జరిగాయి. మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం, కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కాజులూరు మండలం పల్లెపాలెం, రామచంద్రపురం మండలం హసనబాదలో కోడిపందేలు, గుండాటలను అధికార పార్టీ నేతలు దగ్గరుండి నిర్వహిస్తున్నారు. కొప్పవరం, మండల కేంద్రమైన బిక్కవోలు, రంగంపేట, పెదపూడి, జి.మామిడాడ గ్రామాల్లో పందేలు సాగుతున్నాయి. పిఠాపురం పట్టణం వైఎస్సార్ గార్డెన్స్లో కోడిపందేలను ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. విరవ, పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం వాకతిప్ప, యండపల్లి, కొండెవరం, ఇసుకపల్లి, శ్రీరాంపురం, గొల్లప్రోలు మండలం కొడవలి, దుర్గాడ గ్రామాల్లో పందేలు జరుగుతున్నాయి. మెట్టలోనూ అదే జోరు మెట్ట ప్రాంతంలోని కిర్లంపూడిలో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహిస్తున్నారు. జగ్గంపేట, గండేపల్లి, గోకవరం మండలాల్లో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, వల్లూరుతోపాటు, తొండంగి, కోటనందూరు మండలాల్లో పందేలు సాగుతున్నాయి. సామర్లకోట మండలం వేట్లపాలెం, మేడపాడు, అచ్చంపేట, పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం, జి.రాగంపేటల్లో పందేలు జోరుగా జరిగాయి. మొదటి రోజు రూ.50 లక్షలు చేతులు మారినట్టు అంచనా. రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి, పాత బొమ్మూరు, శాటిలైట్ సిటీల్లోని కొబ్బరి తోటలు పందేలకు వేదికలయ్యాయి. దివాన్చెరువు, పుణ్యక్షేత్రం, మల్లంపూడి, తోకాడతోపాటు సీతానగరం మండలంలో పందేలు జరిగాయి. ఏజెన్సీలోని దేవీపట్నం, గంగవరం మండలాలతోపాటు పలుచోట్ల పందేలు జరిగాయి. విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం మండలాల్లో రూ.30 లక్షల వరకూ పందేలు సాగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి పందెగాళ్లు వీఆర్ పురం, కూనవరం తరలివచ్చారు. -
మొదలైన కోడిపందేలు
-
మొదలైన కోడిపందేలు
గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. బోగి మంటలతో పాటు.. కోడి పందాలు జోరుగా మొదలయ్యాయి. ఓ వైపు కోడి పందాలపై పోలీసులు ఆంక్షలు, మరో వైపు హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి.. పందెంరాయుళ్లు అవేవీ లెక్కచేయకుండా.. పందేల జాతర మొదలు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. మురిమళ్ల, అల్లవరం, గోడిలంకలో పందేల నిర్వహణకు సర్వం సిద్దమై పోయింది. కాగా.. పోలీసులు సంక్రాంతి కోడి పందాలను దృష్టిలో ఉంచుకుని 1000 మందిపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేశారు. -
'కోడి పందేల'తో గ్రామాల అభివృద్ధి
- పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాభివృద్ధికి విరాళాలిస్తారు - కోడి పందేల కోసం జీవో తెస్తామన్న ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు దేవరపల్లి (పశ్చిమగోదావరి): కోడి పందేలు సంప్రదాయ క్రీడ అని, వీటిని అధికారికంగా నిర్వహించుకునే విషయమై జీవో తీసుకొస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురంలో శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేల నిర్వహన ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయమని, న్యాయస్థానాలు వీటిని నిలుపుదల చేయటం సరికాదని, అయితే కోర్టులను తాను గౌరవిస్తున్నానని ఎంపీ బాబు అన్నారు. కోడి పందేల వల్ల పట్టణవాసులకు గ్రామీన వాతావరణ అలవాటవుతుందని, విదేశీయులు, బంధువులు, స్నేహితులు పందేలను తిలకించి ఆనందం పొందుతారని ఎంపీ చెప్పుకొచ్చారు. కోడి పందేలు జూదం కాదన్న మాగంటి.. గ్రామాల అభివీద్ధికి పందేలకు లింకుందన్నారు. పండక్కి పందేలు చూసేందుకు వచ్చే ఎన్నారైలు గ్రామాల అభివృద్ధి కోసం ధారళంగా విరాళాలు అందిస్తున్నారని, జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి 12 వేల మంది ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్నారని గుర్తుచేశారు. వేల కోట్ల వ్యయంతో గుర్రపు పందేలు నిర్వహించటానికి అనుమతి ఇస్తున్నప్పుడు కోడి పందేలకు అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. -
కోడి పందేలు వద్దు పుట్బాల్ ముద్దు
-
ఇకనైనా జూలు విదులుస్తారా!
హైకోర్టు ఆదేశాలనైనా అమలు చేస్తారా? బరి తెగించిన టీడీపీ నేతలకు అడ్డుకట్ట వేస్తారా ! లేదంటే ప్రకటనలకే పరిమితం అవుతారా? ఖాకీల ముందున్న కోడిపందేల సవాల్ సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతాం.. ఎవరైనా ఆడినా, ఆడించినా రౌడీషీట్ తెరుస్తాం... ఎంతటి వారైనా వదిలేదు లేదు.. కఠినంగా శిక్షిస్తాం.. ’’ ప్రతి రోజూ పత్రికల్లో ఆర్భాటంగా కనిపిస్తున్న పోలీసు అధికారుల ప్రకటనలివి. కానీ కార్యాచరణలో మాత్రం ఎక్కడా ఆ ప్రతాపం కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా కోడిపందేలు ఆడించే చరిత్ర ఎవరెవరికి ఉంది..ఎక్కడెక్కడ ఎవరెవరు ఆడిస్తారు.. అనే వాస్తవాలు జిల్లా పోలీసు అధికారులు తెలుసుకోవడం పెద్దకష్టమేమీ కాదు. అటువంటి ఆటగాళ్ల చిట్టా తీసి బైండోవర్ చేయించాల్సిన అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడో ఎందుకు.. జిల్లా కేంద్రం ఏలూరు సమీపంలో నిత్యం పగలు, రాత్రి తేడా లేకుండా కోడిపందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులను సంబంధిత రెవెన్యూ అధికారుల వద్ద బైండోవర్ చేయించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు పంపి చాలాకాలమైంది. కానీ నేటికీ ఆ ఇద్దరు నేతల జోలికి వెళ్లే సాహసం పోలీసు సిబ్బంది చేయడం లేదు. దాంతో ఇదే అదనుగా ఆ నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా తమ ఇలాకాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పెద్ద పందేలు ఇంకా ఎక్కడా మొదలు కాకున్నా ఇక్కడ మాత్రం ఓ మోస్తరు పందేలు నిత్యం అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్నాయి. సర్కారు హామీని తెలుగు తమ్ముళ్లు నిలబెడతారా? సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందేలను అనుమతించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. పందేలు, జూదాలు తదితర అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా గతేడాది జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని, ఈ ఏడాది కూడా పోలీసులు వాటిని అమలు చేస్తారని సర్కారు స్పష్టం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి కోడిపందేలు నిర్వహిస్తారని, ఈ ఏడాది కూడా పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఏలూరుకు చెందిన నరహరి జగదీష్కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు వివరణనిచ్చిన సర్కారు కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం న్యాయస్థానంలో ఇచ్చిన హామీ క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో బడా పందేల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే ఉన్నారనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వం హైకోర్టులో ఇచ్చిన హామీ మేరకైనా ఈ ఏడాది టీడీపీ నేతలు కోడిపందేల విషయంలో వెనక్కి తగ్గుతారా.. లేదా గతేడాది మాదిరి కోర్టు ఆంక్షలను ధిక్కరించి జోరుగా పందేలు వేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది చివర్లో మారిన సీన్ గతేడాది కూడా కేవలం హైకోర్టు ఆదేశాలను అమలు చేసి కోడిపందేలపై కొరడా ఝుళిపించిన అప్పటి ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డిపై అప్పట్లో టీడీపీ నేతలు కక్ష గట్టారు. కోడిపందేలపై ఆంక్షల నేపథ్యంలోనే ఆయన్ను బదిలీ చేయించాల్సిందిగా పట్టుబట్టారు. తాను హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నానని చెప్పినా నానాయాగీ చేశారు. అయినా రఘురామిరెడ్డి ఖాతరు చేయలేదు. అయితే, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గిన పాలకులు సంక్రాంతి పండగ మూడురోజుల పాటు మాత్రం పందేలపై ఆంక్షలు ఎత్తివేశారు. దాంతో పండగ వేళ పందేల మాటున వందల రూ.కోట్లు చేతులు మారాయి. కానీ ఈసారి కాస్త ముందుగానే పందేల నిర్వహణలో టీడీపీ నేతలు తలమునకలయ్యారు. ప్రస్తుత ఎస్పీ భాస్కర్ భూషణ్ కూడా కోడిపందేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. పందేలు జరిగితే చూస్తూ ఊరుకోనని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నా ఆయనకు క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది ఏ మేరకు సహకరిస్తారు.. ఆయన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తారా.. పార్టీలకతీతంగా వ్యవహరించి ‘పచ్చ’ పందేల నిర్వాహకులను పరుగులెత్తించగలరా.. అనేది ఈ వారంలోనే తేలిపోనుంది. ఈసారి పందేలు జరిగితే కోర్టు ధిక్కార పిటిషన్లు వేస్తాం సాక్షి ప్రతినిధి, ఏలూరు : హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చట్టవ్యతిరేకంగా కోడిపందేలు వేస్తే ఈసారి కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేస్తామని ఏలూరుకు చెందిన నరహరి జగదీష్కుమార్, న్యాయవాది పీడీఆర్ రాయల్ తెలిపారు. జగదీష్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ నేపథ్యంలోనే ప్రభుత్వం కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని హైకోర్టుకు నివేదించింది. ఈ సందర్భంగా బుధవారం జగదీష్, న్యాయవాది రాయల్ ఏలూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. కత్తులు లేకుండా కోడిపందేలు ఆడుకునేందుకు తాము వ్యతిరేకంగా కాదన్నారు. అయితే కోడిపందేల మాటున కొన్నేళ్లుగా జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ సారి.. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కోడిపందేలు ఆడిన వారికి, ప్రోత్సహించిన నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా కోర్టు ధిక్కార పిటిషన్లను కూడా దాఖలు చేస్తామని తెలిపారు. కోడిపందేలను అరికట్టేందుకు చట్టప్రకారం పని చేస్తున్న జిల్లా పోలీసులకు అందరూ సహకరించాలని వారు కోరారు. -
కోడిపందాలు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్
మంత్రాలయం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మంత్రాలయం డివిజన్లోని తారాపురం గ్రామంలో ఆదివారం కోడిపందెం శిబిరంపై దాడి చేశారు. ముందస్తు సమాచారంతో దాడిచేసిన మంత్రాలయం పోలీసులు.. ఈ దాడిలో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.7,900లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, 30 స్కూటర్లు, మూడు కోడిపుంజులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
కోడి పందాలపై పోలీసుల పంజా
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని అల్లిమిల్లి గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు సోమవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 20 కోడి పుంజులు, రూ.1.5 లక్షల నగదు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. కాగా పలువురు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. ప్రతిరోజూ ఇక్కడ కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. -
కోడి పందాలపై పోలీసుల పంజా
విశాఖపట్నం: జిల్లాలోని కోటవురట్ల మండలం ఆక్సాయిపేట గ్రామంలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో భారీ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడిలో పట్టుబడిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు. -
కోడి పందాల్లో కొట్లాట.. 8 మందికి కత్తి పోట్లు
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మండలం కొవ్వాడలో కోడి పందాల స్థావరం వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొవ్వాడలో కోడి పందాల స్థావరం వద్ద శుక్రవారం ఉదయం అనిల్కుమార్తో భీమ్ సింగ్, షేర్ సింగ్ ఘర్షణ పడ్డారు. ఈ దాడిలో అనిల్కుమార్తో పాటు మరో ఏడుగురు కత్తి పోట్లకు గురయ్యారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. -
కత్తి లేకుండానే.. కాయ్ రాజా కాయ్
సంక్రాంతి సందర్భంగా పందెంరాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. కోడిపందేల రూపంలో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కత్తి కట్టకుండానే పందేలు నిర్వహించడం ఈసారి స్పెషాలిటీ. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, చాగల్లు మండలాల్లో కోడిపందేలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమవరంలో కోడిపందేల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కత్తి కట్టకుండానే జరుపుతున్న కోడిపందేలను తిలకిస్తున్నారు. కత్తి కడితే జంతుహింస కిందకు వస్తుందన్న అనుమానంతోనే ఈసారి కత్తులు లేకుండా పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కత్తి కడితే నిమిషాల్లోనే పందెం అయిపోతుందని, లేకపోతేనే ఎక్కువ సేపు సాగి అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని కూడా అంటున్నారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో, తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలోనూ కోడిపందేల, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు రాకపోవడంతో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగుళ్లో మునిగి తేలుతున్నరు. కాకినాడ రూరల్లో కోడిపందేలపై పోలీసులు దాడులు జరిపారు. కొవ్వాడలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందేలపై ఇంద్రపాలెం పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లు, కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కోడిపందేల అనుమతుల విషయమై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ నేత కనుమూరి రామకృష్ణంరాజు భీమవరంలో లాంఛనంగా కోడిపందేలను ప్రారంభించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా కోళ్లను చేతబట్టుకొని పందేలకు సై అనిపించారు. -
'సుప్రీంకోర్టు తీర్పు కోడిపందాలకు అనుకూలం కాదు'
ఏలూరు(ప.గో): సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు కోడి పందాలకు అనుకూలం కాదని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీం తీర్పులో యథాస్థితిని కొనసాగించడమంటే చట్టాలను అమలు చేయడమేనని పేర్కొన్నారు. ఈ కేసును హైకోర్టు పునర్విచారణ చేసిన అనంతరం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామన్నారు. కోడి పందాల సమస్యను పరిష్కరించాలని హైకోర్టును దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. కోడి పందాలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడమే కాకుండా.. ఆ సమస్యను పరిష్కారించాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. -
కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
న్యూఢిల్లీ : ఉత్కంఠకు తెరపడింది. కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోడి పందాలు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ...సమస్యను పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కోడిపందాలకు అనుమతి ఇవ్వటంతో పందెంరాయుళ్లు హర్షం వ్యక్తం చేశారు. -
కోడి పందాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
కోడి పందాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ : కోడి పందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోడి పందాలను నిషేధించడంపై దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తమను చేర్చుకోవాలన్న సొసైటీ ఫర్ యానిమల్స్ సంస్థకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సంస్కృతి సంప్రదాయాల్లో కోడి పందాలు భాగమని, వాటిని నిషేధించడం తగదని చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జంతువులను హింసించడం తగదని భావించిన హైదరాబాద్ హైకోర్టు... ఈ మధ్యే కోడిపందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. దాంతో హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనుగడ కోసం ఒక ప్రాణి మరో ప్రాణిని చంపడం సృష్టి ధర్మమని, దాన్ని హింసగా భావించడం సబబు కాదని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కోడి పందాలు సంప్రదాయ ఆటని... దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కోర్టుకు తెలిపారు. పాశ్చత్య పోకడలకు మొగ్గు చూపుతున్న యువతకు మన సంప్రదాయ ఆటల గురించి చెప్పడం తప్పెలావుతుందని వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రితో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు గురువారమే విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ను పరిశీలించేందుకు న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది లేకపోవడంతో... పిటిషన్పై విచారణను నేటికి వాయిదా వేసింది. తాజాగా విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
చినబాబు వాకిట్లో పందెం కో‘ఢీ’
లోకేష్ ఎదుట టీడీపీ నేతల పంచాయితీ పోలీస్ పవర్పై ఫిర్యాదు సంక్రాంతిలోపే ఎస్పీ బదిలీ కోసం పట్టు సాక్షి ప్రతినిధి, ఏలూరు : సంక్రాంతి రోజులు దగ్గర పడే కొద్దీ కోడి పందాల రాజకీయం వేడెక్కుతోంది. సంప్రదాయాల ముసుగులో విష సంస్కృతికి బీజం వేస్తున్న కోడి పందాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై స్పం దించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయ డం.. గోదావరి జిల్లాల సంప్రదాయాలకు ప్రతీక అయిన కోడి పందాలకు అనుమతివ్వాలంటూ సుప్రీం కోర్టులో నేతలు పిటిషన్ వేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పందాలపై ఉత్కంఠ నెలకొంది. ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా పందాల రాయుళ్లు మాత్రం బరులు సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ నేతలపై భారం పెట్టి పండగకు ముందునుంచే జోరుగా పందాలు, వాటి మాటున జూదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలకు అనుమతుల భారాన్ని నెత్తికెత్తుకున్న టీడీపీ నాయకుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందాన తయారైంది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జిల్లా పోలీసులు చూసీచూడనట్టు ఉంటే చాలని టీడీపీ నేతలు ఆశించారు. హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తామని జిల్లా పోలీసు అధికారులు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో జనవరి 1న జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి పందాలకు అనధికారిక అనుమతులు సాధించాలని అధికార పార్టీ నేతలు భావించారు. కానీ హైకోర్టు ఆదేశాల నడుమ వివాదాస్పద పందెం కోళ్ల వ్యవహారంపై చంద్రబాబు జిల్లా పర్యటనలో ఆ ప్రస్తావన తేలేదు. సీఎం పర్యటనతో పందెం కోళ్లకు అనధికారిక అనుమతులు వచ్చేస్తాయని, పోలీసు అధికారులకు అక్షిం తలు పడతాయని ఆశించిన వారిని ఆ రోజు చంద్రబాబు తీరు నిరాశపరచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో లాభం లేదనుకున్న జిల్లా టీడీపీ నేతలు తాజాగా ఆయన కుమారుడు లోకేష్ వద్దకు వెళ్లి పందెం కోళ్ల వ్యవహారంపై సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు రెండురోజుల క్రితమే లోకేష్ను కలిసి కోడి పందాలు జరగకుంటే జిల్లాలో తలెత్తుకోలేమని గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. జిల్లా ఎస్పీని బదిలీ చేయిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని సదరు టీడీపీ నేతలు లోకేష్ను అభ్యర్థించినట్టు భోగట్టా. ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం జోరుగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతల కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడ డీసీపీగా ఎస్పీ బదిలీ? హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను అమలు చేస్తూ ముక్కుసూటిగా వెళ్తున్న ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామ్రెడ్డిపై బదిలీ వేటు వేయూలని కొందరు టీడీపీ నేతల మంకుపట్టు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను విజయవాడకు బదిలీ చేయొచ్చన్న ఊహా గానాలు వినిపిస్తున్నారుు. విజయవాడ ప్రస్తుత డీసీపీ ఇక్బాల్ను తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో ఆ స్థానానికి రఘురామ్రెడ్డిని బదిలీ చేయొ చ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా బుధవారం ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఆ తర్వాత ఐపీఎస్ల బదిలీలు ఉంటాయని, ఆ క్రమంలోనే ఎస్పీని ఇక్కడి నుంచి పంపిం చాలని పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు హోంమంత్రి చినరాజప్పపై కూడా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే టీడీపీలోని మరో వర్గం, బీజేపీ నాయకత్వం మాత్రం నిజాయితీగా పనిచేస్తున్న ఎస్పీని ఇక్కడే కొనసాగించేందుకు అవసరమైతే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. కేవలం కోడి పం దాల కోసం ఒక ఐపీఎస్పై చంద్రబాబు బదిలీ వేటు వేస్తారా లేక ఎస్పీకి వెన్నుదన్నుగా నిలిచి నిజాయితీగా ముందుకు వెళ్లమంటారా అన్నది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోనుంది. ‘కోట్లా’టపై ఉత్కంఠ నేడు సుప్రీం కోర్టులో విచారణ భీమవరం : కోడి పందాలపై తీవ్ర ఉత్కంఠ నెల కొంది. పందాల రాయుళ్లు పంతం నెగ్గించుకుం టారా లేక పోలీసులు పైచేయి సాధిస్తారా అన్నవిషయంపై జిల్లావ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కోడి పందాలకు అనుమతించాలంటూ జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. సుప్రీం కోర్టు నిర్ణయంపైనే పందాల రాయుళ్లతోపాటు నిర్వాహకులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను పందాలు జరుగుతాయంటూ పలుచోట్ల బరులు సిద్ధం చేస్తున్నారు. -
కోడి పందాలు మా సంప్రదాయం.. కొనసాగిస్తాం!
-
కోడి పందాలు మా సంప్రదాయం.. కొనసాగిస్తాం!
కోడిపందాలు ఏనాటినుంచో వస్తున్న సంప్రదాయమని, వాటిని కొనసాగించి తీరుతామని ఉండి ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లయినా సరే కోడిపందాలు ఆడి తీరుతామన్నారు. తమ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఆడటంపై కోర్టు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇందుకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మలికిపురం మండలంలోని చింతలమోరి, రామరాజులంక ప్రాంతాల్లో బరులు ఏర్పాటుచేస్తున్నారు. -
తమిళనాడు నుంచి గుంటూరుకు పందెంకోళ్లు
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందేలకు వెళుతున్న పందెంరాయుళ్లను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ పందెం రాయుళ్లు పందేలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. పందాలను జరగనిచ్చేది లేదంటూ పోలీసులు ఇప్పటికే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ వాటిని పందెంరాయుళ్లు బేఖాతరు చేస్తున్నారు. కాగా తమిళనాడు నుంచి గుంటూరు జిల్లాలకు కోడి పందెలకు వస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళగిరి మండలం నూతక్కి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు చెక్పోస్ట్ వద్ద ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక కృష్ణాజిల్లా కైకలూరులో కోడి పందెలా శిబిరాలపై జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 23మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారివద్ద నుంచి 4.3 లక్షలు సీజ్ చేశారు. కాగా పోలీసుల రాకతో పలువురు పందెం రాయుళ్లు కాళ్లకు పని చెప్పారు. దాంతో వారి కోసం గాలిస్తున్నారు.