బరిలో కో‘ఢీ’ | TDP leaders disobeyed restrictions of court orders | Sakshi
Sakshi News home page

బరిలో కో‘ఢీ’

Jan 14 2018 2:01 AM | Updated on Aug 10 2018 8:34 PM

TDP leaders disobeyed restrictions of court orders - Sakshi

గొడవర్రులో కోడిపందేలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌

ఏలూరు టౌన్, అమలాపురం, కంకిపాడు(పెనమలూరు): పోటీలకు పందెం కోడి కత్తులు దూస్తోంది! పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. న్యాయస్థానం ఆదేశాలు, పోలీస్‌ ఆంక్షలను ధిక్కరిస్తూ కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పండుగకు ఒకరోజు ముందే కోడి పందేలకు అంకురార్పణ చేశారు. భారీగా డబ్బులు చేతులు మారటంతో బరులు పందెంరా యుళ్లతో నిండిపోయాయి.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజక వర్గంలోనూ కోడి పందేలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ బరికి సన్నద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement