కామవరపుకోట : హత్య కేసులో ఇద్దరు యువకులను గురువారం అరెస్ట్ చేసినట్లు తడికలపూడి ఏఎస్సై డి.ఎ.దీక్షితులు తెలిపారు.
హత్యకేసులో ఇద్దరి అరెస్ట్
Sep 16 2016 1:56 AM | Updated on Aug 20 2018 4:37 PM
కామవరపుకోట : హత్య కేసులో ఇద్దరు యువకులను గురువారం అరెస్ట్ చేసినట్లు తడికలపూడి ఏఎస్సై డి.ఎ.దీక్షితులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వీరవల్లి వీరాస్వాములుకు, మరికొందరికి గత మంగళవారం కోడిపందేల సందర్భంగా ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వీరాస్వాములు హత్యకు గురయ్యాడు. దీంతో కామవరపు కోట పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెంకు చెందిన జోడాల గిరిబాబు, కొండగూడెంకు చెందిన బిరుదుగడ్డ మోహనరావు అనే ఇద్దరు యువకులను కామవరపు కోట బస్స్టాండ్ వద్ద చింతలపూడి సీఐ జి.దాసు.అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement