పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని అల్లిమిల్లి గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు సోమవారం ఆకస్మిక దాడి చేశారు.
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని అల్లిమిల్లి గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు సోమవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 20 కోడి పుంజులు, రూ.1.5 లక్షల నగదు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. కాగా పలువురు పోలీసులకు చిక్కకుండా పరారయ్యారు. ప్రతిరోజూ ఇక్కడ కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.