-
పోరాడి ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీ
షెన్జెన్ (చైనా): ఈ ఏడాది ఆరో టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్గా నిలిచింది. 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 19–21, 21–18, 19–21తో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. విజేతగా నిలిచిన లియాంగ్–వాంగ్ చాంగ్లకు 85,100 డాలర్ల (రూ.70 లక్షల 92 వేలు) ప్రైజ్మనీ, 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సాత్విక్–చిరాగ్లకు 40,250 డాలర్ల (రూ. 33 లక్షల 54 వేలు) ప్రైజ్మనీ, 9350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్లలో టైటిల్స్ సాధించడంతోపాటు ఆసియా చాంపియన్íÙప్లో, హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్లో ప్రణయ్
షెన్జెన్: చైనా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 22–20తో ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. ఈ ఏడాది వీరిద్దరు నాలుగుసార్లు ముఖాముఖిగా తలపడగా... రెండు సార్లు ప్రణయ్, రెండుసార్లు చౌ తియెన్ గెలిచారు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్ (భారత్) 12–21, 14–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–10తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జంటపై గెలిచింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో శ్రీకాంత్; షి యు కి (చైనా)తో లక్ష్య సేన్; కెంటా నిషిమోటో (జపాన్)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
ముగిసిన భారత్ పోరు
జియాంగ్సు (చైనా):చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరు ముగిసింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 19-21 తేడాతో బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 38 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో ఆదిలో సింధు 4-1 తో ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తరువాత థాయ్ లాండ్ క్రీడాకారిణి స్కోరును 4-4 తో సమం చేసింది. ఆపై సింధు 7-4, 13-10 తో మరోసారి ముందుకు దూసుకెళ్లింది. కాగా, తొలి గేమ్ స్కోరు 16-16తో ఇరువురి క్రీడాకారిణులు సమంగా ఉన్న సమయంలో బురానాప్రాసెర్ట్సుక్ వరుస పాయింట్లను సాధించి గేమ్ ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్ లో సింధు 11-8తేడాతో పైచేయి సాధించినా మధ్యలో చతికిలబడి వరుస పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగినా చివరకు బురానాప్రాసెర్ట్సుక్నే విజయం వరించింది. ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారుడు హెచ్ ఎస్ ప్రణయ్ 10-21, 15-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్(చైనా)చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ ఆకట్టుకోని ప్రణయ్ ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. మహిళల డబుల్స్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్ప జోడి 11-21, 14-21 తేడాతో లూ యింగ్-వూ యూ(చైనా) చేతిలో పరాజయం చెందారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement