breaking news
Astronomer
-
సీఈవోతో సరసాల ఎపిసోడ్లో కీలక మలుపు
వాషింగ్టన్: ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఎపిసోడ్లో మరో కీలక మలుపు తిరిగింది. కంపెనీ మాజీ సీఈవో ఆండీ బైరాన్ను కౌగిలించుకున్నందుకు అమెరికా టెక్ సంస్థ ఆస్ట్రానమర్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్ను సైతం సంస్థ బయటకు సాగనంపింది. సంస్థ పరువు తీశారంటూ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ క్రమంలో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ కాబోట్ ఇప్పుడు తమ కంపెనీలో లేరని, రాజీనామా చేశారంటూ ఆస్ట్రానమర్ ఓ ప్రకటనలో తెలిపింది. గత బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్లో ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బిరాన్,హెచ్ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్లు హాజరయ్యారు. అయితే,కాన్సర్ట్ జరిగే సమయంలో ఆండీ, క్రిస్టెన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారిపై స్పాట్ లైట్ పడడం, ఆ దృశ్యం పెద్దస్క్రీన్లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. సీఈవో వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్లు చురకలు వేయగా... విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది.సంస్థ ఆస్ట్రానమర్ ఆండీని పదవి నుంచి బలవంతంగా తొలగించింది. సీఈవో బాధ్యతల్ని మరొకరికి అప్పగించింది. అవమానం భారం తట్టుకోలేని ఆండీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ హెడ్ క్రిస్టెన్ కబోట్ సైతం సంస్థకు రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025 -
CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..
-
కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్ప్లే
ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఆ కంపెనీ సీఈవో కొంపముంచింది. తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు.. నాలుగు రోజుల తర్వాత కూడా ఆ వీడియో విపరీతంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం తమ ప్రచారాలకు ఆ వీడియోను వాడేసుకుంటున్నాయి. ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కంపెనీ వీడుతున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్ను కౌగలించుకుని.. ముద్దాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్లో వీళ్లిద్దరి ఇలా కెమెరా కంటపడ్డారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్ప్లే క్రిస్ మార్టిన్ ‘‘వారు అఫైర్లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్ చేయడంతో అది మరింత వైరల్ అయ్యింది. మరోవైపు.. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. After a video of him with his company’s HR head at a Coldplay concert went viral, Andrew Byron, the CEO of U.S. tech company Astronomer, has resigned from his position. The New York-based company shared this information on LinkedIn.#Coldplay #AndrewByron pic.twitter.com/QA6iTGDxqq— Bipin Singh (@bipinsinghreal) July 20, 2025‘‘మా కంపెనీ లీడర్లు నడవడిక, బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. దీనిని బోర్డ్ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ.క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. -
లైవ్లో అడ్డంగా బుక్కై.. సీఈవో చిలక్కొట్టుడుపై జోకులు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన కంపెనీలో పని చేసే ఓ ఉద్యోగితో చిలక్కొట్టుడు యవ్వారానికి దిగాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఓ మ్యూజికల్ నైట్కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా ఉన్న టైంలో అనుకోకుండా కెమెరా వాళ్లవైపు తిరిగింది. అంతే సోషల్ మీడియా ఆ జంట గురించి కోడై కూస్తోంది.కోల్డ్ప్లే క్రిస్మార్టిన్ బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని జిల్లెట్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. ప్రదర్శన కొనసాగుతున్న టైంలో.. కెమెరా హఠాత్తుగా ఓ జంట వైపు తిరిగాయి. అప్పటిదాకా ఒకరినొకరు వాటేసుకున్న ఆ ఇద్దరూ.. కెమెరా ఫోకస్ తమ మీద పడే సరికి సిగ్గుతో ముడుచుకుపోయారు. ఆపై ముఖాలు దాచేసుకుంటూ కనిపించారు. అయితే.. అందులో ఉంది ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ. అయితే ఆయనతో ఆ వీడియోలో ఉన్నది ఆయన భార్య కాదు. ఆ కంపెనీలోనే చీఫ్ పీపుల్ ఆఫీసర్గా పని చేస్తున్న క్రిస్ట్రిన్ క్యాబెట్. ఈ వీడియోతో ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం తీవ్రతరమైంది. మరికొందరు పబ్లిక్ ఈ ఇద్దరు ఇలా పట్టుబడడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అంతెందుకు.. Coldplay Drops the Beat And a Secret Office Romance!At a recent concert, @coldplay inadvertently revealed an alleged affair between @astronomer_zero CEO #AndyByron and his colleague Kristin Cabot, proving the band really knows how to bring secrets into the spotlight!… pic.twitter.com/LMAs9tnz2r— Photo News (@PhotoNewsPk) July 17, 2025క్రిస్మార్టిన్ సైతం ఈ వ్యవహారంపై సరదాగా స్పందించాడు. ఈ ఇద్దరినీ చూడండి.. బహుశా వీళ్ల మధ్య సంబంధం ఉందేమో లేకుంటే మాములుగానే సిగ్గుపడుతున్నారేమో అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు టిక్టాక్, రెడ్డిట్, ట్విటర్, ఇన్స్ట్రాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. Damnit, Coldplay…#AndyByron pic.twitter.com/byy2RfqkNB— Coach Drew (@andy_stawicki2) July 17, 2025 CEO of Astronomer, Andy Byron (married with 2 kids) caught in 4K with the CPO of Astronomer, Kristin Cabot (also married) on the Jumbotron at Coldplay concert in Boston last night #astronomer #andybyron #kristincabot #astronomerceo #astronomercpo #coldplay #coldplayconcert pic.twitter.com/KjybeWVHVW— Meme Corp (@memecorpfail) July 17, 2025 lol 🤪 if they’d have just stuck it out and smiled for the #camera this would never have surfaced as virally as it did 😂 #Coldplay #Astronomer #AndyByron #kisscam #KristinCabot pic.twitter.com/6B8edsZBvU— Marie ☘️ (@7eights2nine10) July 17, 2025 Between Astronomer CEO Andy Byron Wife Megan Kerrigan and His CPO Kristin Cabot, who is more beautiful. Hi there Megan Kerrigan, you dont deserve that cheating dude. I can be all yours DM me. #ColdplayBoston #Coldplay #AstronomerCEO #andybyron pic.twitter.com/oe8ToIpc55— Derrick Groves (@DerricGroves) July 17, 2025 Me liking every tweet about the CEO and head of HR affair pic.twitter.com/0UsOrO4726— Ramp Capital (@RampCapitalLLC) July 18, 2025My low effort, painting for today pic.twitter.com/DHBjpLonUz— Travis Chapman (@Travispaints) July 17, 2025the wife watching this at home https://t.co/Sr0BhgCJAZ pic.twitter.com/ttHRRcqstL— Shreemi Verma (@shreemiverma19) July 17, 2025 ఇదిలా ఉంటే.. క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. మరోవైపు ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. తాజా వీడియో వైరల్ నేపథ్యంలో ఆండీ బైరోన్ పేరిట ఓ ప్రకటన వెలువడింది. అయితే అది వ్యంగ్యంగా ఉండడం గమనార్హం. ఫ్యాక్ట్చెక్లో అదొక పేరడీ పేజీ నుంచి సర్క్యులేట్ అయ్యిందని తేలింది. అధికారికంగా బైరోన్ దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వేలదు. అయితే.. భర్తకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యాక.. ఆమె తన పేరులోని బైరోన్ను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించారు. అంతేకాదు.. ఆ అకౌంట్లనూ డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకులు ఖాయమనే చర్చ మొదలైంది. -
మరుగుజ్జు గెలాక్సీల్లోనూ భారీగా బ్లాక్హోల్స్!
తెనాలి: అమెరికాలోని సాల్ట్లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చా బ్లాక్హోల్స్కు సంబంధించిన అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరించారు. దాదాపు అన్ని భారీ గెలాక్సీల కేంద్రాల్లోనూ సూపర్ మాసివ్ బ్లాక్హోల్స్ ఉన్నట్టు ఇప్పటికే కనుగొనడం జరిగింది. అయితే మరుగుజ్జు గెలాక్సీల్లోనూ పెద్దసంఖ్యలో 2,500 బ్లాక్హోల్స్ను కనుగొని, వాటిల్లోనూ బ్లాక్హోల్స్ సర్వసాధారణమని రాగదీపిక తేల్చారు. ‘గెలాక్సీలు ముందా? బ్లాక్హోల్స్ ముందా?’ అనే శాస్త్ర ప్రపంచం ఎదుట ఉన్న పెద్ద పజిల్ అన్వేషణలో ఇదో పెద్ద ముందడుగని రాగదీపిక చెప్పారు. తన పరిశోధన అంశాలను ఇటీవల అమెరికాలో విడుదల చేసిన ఆమె, ఈ సందర్భంగా ఆయా వివరాలను ‘సాక్షి’కి పంపారు. కొన్ని వివరాలను పరిశీలిస్తే..» ఆరిజోనా, మాయల్ టెలిస్కోపీలోని ‘డార్క్ ఎనర్జీ స్పె్రక్టాస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్’ (దేశీ) ప్రాజెక్టు 30 మిలియన్ గెలాక్సీలను పరిశీలిస్తోంది. » ఈ క్రమంలో ఎప్పటికప్పుడు డేటాను భద్రపరుస్తోంది. » ‘మరుగుజ్జు గెలాక్సీలు’ వ్యవస్థల్లో బ్లాక్హోల్స్ (కృష్ణబిలాలు) అన్వేషణలో ఉన్న డాక్టర్ రాగదీపిక నేతృత్వంలోని బృందం ‘దేశీ’ సేకరణలోని అంశాలను పరిశోధించింది. » ఆ అధ్యయనంలో భాగంగా దాదాపు 1,15,000 మరుగుజ్జు గెలాక్సీల్లో దాదాపు రెండు శాతం క్రియాశీల బ్లాక్హోల్స్ను కనుగొంది. » భారతదేశానికి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ఎస్.చంద్రశేఖర్ 50 ఏళ్ల క్రితం తొలిసారి బ్లాక్హోల్స్ సమాచారాన్ని అందించారు. దేశం తరఫున ఏకైక తెలుగమ్మాయి... మరుగుజ్జు నక్షత్ర మండలాల (డ్వార్ఫ్ గెలాక్సీస్)పై భారతదేశం నుంచి పరిశోధన చేస్తున్న ఏకైక తెలుగమ్మాయి రాగదీపిక పుచ్చా. సొంతూరు తెనాలి. తండ్రి రాజగోపాల్ కేంద్ర సర్వీసులో విశ్రాంత సివిల్ ఇంజినీరు. తల్లి కనకదుర్గ శాస్త్రీయ సంగీతం (వీణ) గురువు. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్ విశ్వవిద్యాలయం విశ్వభారతిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్లో టాపర్గా నిలిచారు రాగదీపిక. అహ్మదాబాద్, నైనిటాల్, ముంబైలోని ప్రసిద్ధ పరిశోధన సంస్థల్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేసి, చివరి ఏడాది బెంగళూరులోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్’లో ‘సూర్యుడి మచ్చలు’పై థీసిస్ చేశారు. జర్మనీలోని ‘మాక్స్ ఫ్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రీసెర్చ్’లో గెస్ట్ సైంటిస్ట్గా సూర్యుడిపై పరిశోధనలు కొనసాగించారు. యూనివర్శిటీ ఆఫ్ ఆరిజోనాలో ‘ఆ్రస్టానమి అండ్ ఆస్ట్రో ఫిజిక్స్’లో ఎంఎస్ చేశారు. 2023లో అదే యూనివర్శిటీ నుంచి ‘మరుగుజ్జు గెలాక్సీలు–బ్లాక్హోల్స్’పై డాక్టర్ స్టెఫానీ జునో, డాక్టర్ అర్జున్ డే మార్గదర్శకత్వంలో సమర్పించిన థీసిస్కు పీహెచ్డీ స్వీకరించారు. శాస్త్ర ప్రపంచంలో ఇదే తొలిసారి మరుగుజ్జు గెలాక్సీల్లో బ్లాక్హోల్స్ను ఇంత భారీ సంఖ్యలో కనుగొనటం శాస్త్ర ప్రపంచంలో ఇదే ప్రథమం. మా బృందం నాలుగు వేలకన్నా ఎక్కువ గెలాక్సీల్లోని బ్లాక్హోల్స్ ద్రవ్యరాశిని కూడా నిర్ణయించింది. సూర్యుడి కంటే దాదాపు 1,000 నుంచి మిలియన్ రెట్ల ద్రవ్యరాశి కలిగిన ఇంటర్మీడియట్ బ్లాక్హోల్స్నూ శోధించింది. ‘దేశీ’ డేటాతో మా బృందం దాదాపు 300 డిటెన్షన్లను ఆవిష్కరించింది. దీని ఫలితంగా విశ్వంలో మొదటి బ్లాక్çహోల్స్ సాపేక్షికంగా తేలికైనవని తెలుస్తోంది. ‘దేశీ’తో ఇప్పటివరకు గెలాక్సీలలో అతి తక్కువ ద్రవ్యరాశి గల 2,500 బ్లాక్హోల్స్ను మేం కనుగొన్నాం. ఇది ఉత్తేజకరమైన ఫలితం. గెలాక్సీలు...బ్లాక్హోల్...వీటిలో ఏది ముందు? అనేది శాస్త్ర ప్రపంచానికి పెద్ద ప్రశ్న. గెలాక్సీలు, బ్లాక్హోల్స్ పరిణామ క్రమాన్ని విశ్లేషించటానికి, విశ్వంలో తొలి బ్లాక్హోల్స్ ఎలా ఏర్పడ్డాయనేది తెలుసుకునేందుకు మా అధ్యయనం ఉపకరిస్తుంది. బ్లాక్హోల్స్ను విడిగా కాకుండా ఒక సమూహంగా అధ్యయనం చేయడాన్ని ఇక ప్రారంభించవచ్చు. – డాక్టర్ రాగదీపిక పుచ్చా, ఖగోళ శాస్త్రవేత్త -
ఖగోళ రహస్యాలను చేధించిన ఎడ్విన్ హబుల్.. టెలిస్కోప్తో ఎన్నో ఆవిష్కరణలు
ఖగోళ వింతలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? టెలిస్కోప్ ఆవిష్కణలతో ఆకాశ వింతల్ని దగ్గరన్నుంచి చూసి విశ్వం రసహ్యాలను తెలుసుకోవచన్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా టెలిస్కోప్లు ఉన్నాయి. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఒకటి హబుల్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచడంతో పాటు అంతరిక్షంలో బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. . ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం హబుల్ స్పేస్ టెలిస్కోప్కు ఆ పేరు పెట్టారు. ఇవాళ(సోమవారం)ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ నవంబర్ 20, 1889లో మిస్సౌరీలోని మార్ష్ఫీల్డ్లో జన్మించాడు. 1910లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేశాడు.ఖగోళ శాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసి విశేష గుర్తింపు పొందాడు. గెలాక్సీలను అధ్యయనం చేయడంలో హబుల్ ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1923లో నెబ్యులాలో సెఫీడ్ వేరియబుల్స్ అని పిలువబడే ఒక రకమైన నక్షత్రాన్ని కనుగొన్నాడు, నెబ్యులా అనేక వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని (పాలపుంత గెలాక్సీ వెలుపల) ఇది మరొక గెలాక్సీ అని హబుల్ నిర్ధారించాడు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయని తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. గెలాక్సీల రెడ్షిఫ్ట్, దూరం మధ్య స్థిరమైన సంబంధాన్ని కనుగొనడం ద్వారా విశ్వం విస్తరిస్తోంది అని నిరూపించాడు. ఇక హబుల్ పేరుమీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్..ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్. 1990లో దీన్ని ప్రయోగించారు. ఎడ్విన్ హబుల్ గౌరవార్థం టెలిస్కోప్కు ఆ పేరు పెట్టారు. విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని,నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటివెన్నో విషయాలను అంచనా వేయడానికి హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో కూడా ఫోటోలు తీసి పంపించింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ టెలిస్కోప్ ద్వారానే. -
‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది?
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 800 కోట్ల క్రితం విశ్వంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాన్ని గుర్తించింది. ఈ విస్ఫోటనం ఇన్ని వందల కోట్ల ఏళ్లకు భూమికి చేరుకుందని వారు తెలిపారు. ఈ పేలుడును ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ (ఎఫ్ఆర్బీ) అని అంటారు. కొత్తగా గుర్తించిన ఈ విస్ఫోటనానికి ఎఫ్ఆర్బీ-20220610ఏ అని పేరు పెట్టారు. గత ఏడాది జూన్ 10న రేడియో టెలిస్కోప్ సాయంతో దీనిని గుర్తించారు. ఈ విస్ఫోటనం ఎక్కడ నుండి ఉద్భవించిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ, వెరీ లార్జ్ టెలిస్కోప్ను ఉపయోగించారు. ఈ ఎఫ్ఆర్బీ ఇప్పటివరకూ కనుగొన్న అన్ని ఎఫ్ఆర్బీల కంటే పురాతనమైనదని, అత్యంత దూరం కలిగినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’లనేవి రేడియో తరంగాల ప్రకాశవంతమైన పేలుళ్లు. వీటి వ్యవధి మిల్లీసెకండ్ స్కేల్లో ఉంటుంది. ఈ కారణంగానే వాటి మూలాన్ని గుర్తించడం, అంతరిక్షంలో వాటి స్థానాన్ని కనుగొనడం అత్యంత కష్టమైన పని. ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ను మొదటిసారిగా 2007 సంవత్సరంలో కనుగొన్నారు. నాటి నుండి శాస్త్రవేత్తలు దాని మూలాన్ని కనుగొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసేంత శక్తిని ఈ పేలుళ్లు సెకనులో వెయ్యి వంతులో ఉత్పత్తి చేస్తాయి. ఎఫ్ఆర్బీ పేలుళ్లు ఎందుకు సంభవిస్తాయో శాస్త్రవేత్తలు నేటికీ గుర్తించలేకపోయారు. అయితే ఎఫ్ఆర్బీలు విశ్వంలో జరిగే సాధారణ దృగ్విషయం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఈ దృగ్విషయాలను అధ్యయనం చేయడం వలన విశ్వం ఎలా ఏర్పడిందనేది తెలుసుకునేందుకు సహాయపడుతుంది. అత్యంత వేగవంతమైన ఈ రేడియో పేలుళ్లు అనూహ్యంగా ఉంటాయి. వాటిని గమనించడం కష్టం. కెనడాలోని డొమినియన్ రేడియో ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ ఎఫ్ఆర్బీలను ట్రాక్ చేసే అబ్జర్వేటరీలలో ఒకటి. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఎఫ్ఆర్బీలపై మరింత అవగాహన కలిగేందుకు దోహదపడనుంది. కాగా ఈ అధ్యయనం వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: యూదుడైన్ ఐన్స్టీన్ హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? -
Nicole Oliveira: ఎనిమిదేళ్ల స్పేస్ సైంటిస్ట్.. నాసాతో కలిసి పనిచేస్తోంది
నికోల్ ఒలివెరా.. వయసు ఎనిమిదేళ్లు.. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే వయసు.. కానీ ఆమె ఏం చేస్తోందో తెలుసా..? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది. ఇది నిజమే.. అంతరిక్షంలో గ్రహశకలాల (ఆస్టరాయిడ్ల)ను గుర్తించే ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్’ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 18 ఖగోళ వస్తువుల (స్పేస్ ఆబ్జెక్ట్స్)ను గుర్తించింది కూడా. ప్రస్తుతం ప్రపంచంలోనే చిన్న వయసు ఆస్ట్రోనమర్గా నికోల్ నిలిచింది. బ్రెజిల్లోని ఫోర్టాలెజా ప్రాంతానికి చెందిన నికోల్ ఒలివెరాకు చిన్నప్పటి నుంచే అంతరిక్షం అంటే ఇష్టమట. నడక నేర్చుకునే వయసులోనే ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు అంటూ పాఠాలు నేర్చుకుందట. నాసా స్పెషల్ ప్రాజెక్టుతో.. పిల్లలు, టీనేజీ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడం, వారే సొంతంగా కొత్త అంశాలను గుర్తించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా కొన్నేళ్ల కింద నాసా ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసి అందులో భాగస్వామ్యం చేసింది. దీనిలో నికోల్ ఒలివెరా ‘ఆస్టరాయిడ్ హంటర్’ బాధ్యతలకు ఎంపికైంది. రెండు పెద్ద స్క్రీన్లు ఉన్న కంప్యూటర్పై నాసా ఇచ్చే స్పేస్ మ్యాప్లను పరిశీలిస్తూ.. టెలిస్కోప్తో అంతరిక్షాన్ని జల్లెడపడుతూ.. 18 స్పేస్ ఆబ్జెక్ట్స్ను గుర్తించింది. నాసా శాస్త్రవేత్తలు మరోసారి వాటిని పరిశీలించి, ఆస్టరాయిడ్లుగా సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆ ఆస్టరాయిడ్లకు బ్రెజిల్ శాస్త్రవేత్తల పేర్లు పెడతానని నికోల్ చెప్తోంది. అంతేకాదు.. పెద్దయ్యాక ఏరోస్పేస్ ఇంజనీర్ అయి రాకెట్లను తయారు చేయాలని ఉందని పేర్కొంది. -
రాకెట్ ప్రమాదంలో ‘మ్యాడ్ మైక్’ దుర్మరణం
లాస్ఏంజెలెస్ : భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని చెప్పిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మైఖేల్ ‘మ్యాడ్ మైక్’హ్యూస్.. ఈ నెల 22న ఓ రాకెట్ ప్రమాదంలో మరణించారు. తాను సొంతంగా తయారు చేసుకున్న రాకెట్ను పరీక్షించే ప్రయోగం విఫలం చెందడంతో మరణించారు. భూమి గుండ్రంగా లేదని నిరూపించేందుకు తన స్టీమ్ రాకెట్తో అంతరిక్షంలోకి వెళ్లారు. ప్రయోగించిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విఫలమైంది. దాదాపు భూమికి 1,500 మీటర్ల ఎత్తుకు వెళ్లాలన్నది తన కోరిక అని చెప్పారు. అక్కడికి వెళ్లి భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా, గుండ్రటి డిస్క్ మాదిరిగా ఉంటుందని నిరూపిస్తానని పేర్కొన్నారు. కానీ కిందకు దిగకుండానే ఆయన ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. -
భారతీయుడి నమ్మకమే ‘పార్కర్కు’ పునాది
న్యూఢిల్లీ: 60 ఏళ్ల క్రితం సౌర గాలులు ఉన్నాయంటూ పార్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ గుర్తించకుం టే తాజా ప్రయోగం సాకారమయ్యేదే కాదు. సూర్యుడి నుంచి ఆవేశపూరిత కణాలు నిరంతరం అంతరిక్షంలోకి ప్రసారమవుతూ.. అక్కడి ప్రాంతాన్ని నింపుతున్నాయని 1958లో పార్కర్ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలతో కూడిన థియరీ పేపర్ను ఆస్ట్రోఫిజికల్ జర్నల్కు సమర్పించారు. అయితే, ఇద్దరు పరిశోధకులు దీనిని తిరస్కరించారు. దీనికి కారణం అంతరిక్షాన్ని కేవలం శూన్య ప్రదేశంగా భావించే రోజులవి. అయితే ఆ సమయంలో జర్నల్కు సీనియర్ ఎడిటర్గా ఉన్న చంద్రశేఖర్.. పార్కర్ సిద్ధాంతాన్ని పబ్లిష్ చేయాలని నిర్ణయించారు. చంద్రశేఖర్ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ ప్రయోగం జరిగేది కాదని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ సోలార్ స్టెల్లార్ ఎన్విరాన్మెంట్కు చైర్మన్గా పనిచేస్తున్న నంది వెల్లడించారు. నక్షత్రాల నిర్మాణ, పరిమాణ క్రమంలో భౌతిక ప్రక్రియల ప్రాముఖ్యతపై చేసిన పరిశోధనలకు గాను 1983లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని విలియమ్ ఏ ఫోలర్తో కలసి సంయుక్తంగా ఆయన అందుకున్నారు. అలాగే చంద్రశేఖర్ సేవలకు గుర్తుగా 1999లో చంద్రశేఖర్ పేరుతోనే ‘చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ’అనే అంతరిక్ష ప్రయోగాన్ని నాసా చేపట్టింది. -
ప్రజా సందర్శనకు హాకింగ్ కుర్చీ, కంప్యూటర్
లండన్: ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్కు చెందిన చక్రాల కుర్చీని, ఆయన సంభాషించేందుకు వాడిన ప్రత్యేక కంప్యూటర్ను ప్రజా సందర్శనకు ఉంచే అవకాశముందని బ్రిటన్కు చెందిన ‘ది సండే టైమ్స్’ పత్రిక తెలిపింది. హాకింగ్ స్మృతుల్ని సజీవంగా ఉంచేందుకు వీలుగా ఈ రెండింటిని ఏదైనా మ్యూజియానికి ఇచ్చే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారని వెల్లడించింది. లండన్లోని సైన్స్ మ్యూజియంలో హాకింగ్ జీవితచరిత్ర, ఉపన్యాసాల వీడియోలతో పాటు చక్రాల కుర్చీ, కంప్యూటర్ను ప్రదర్శనకు ఉంచే అవకాశముందని పేర్కొంది. హాకింగ్ వాడిన చక్రాల కుర్చీ స్వీడన్లో తయారైందనీ, ఓసారి చార్జింగ్ పెడితే ఇది గంటకు 13 కి.మీ వేగంతో 32 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. -
ఆరిపోతూ.. వెలుగునిచ్చింది!
అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలుకన్న ప్రియాంక శ్రీహరికోటకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదం బ్రెయిన్డెడ్గా ప్రకటించిన వైద్యులు జీవన్దాన్ సహకారంతో చెన్నై ఫోర్టిస్కు గుండె తరలింపు ‘యశోద’కు కాలేయం, ఒక కిడ్నీ.. నిమ్స్కు రెండో కిడ్నీ తరలింపు సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనేది ఆ బాలిక కల. దానిని నిజం చేసుకునేందుకు చిన్నతనం నుంచే ఎంతో శ్రమించింది. అంతరిక్షం గురించి ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ తన ఆశయ సాధన దిశగా ముందుకు సాగింది. అంతరిక్ష ప్రయోగాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ నెల 17న తోటి విద్యార్థులతో కలసి శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సందర్శనకు వెళ్లింది. అయితే అంతలోనే విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను వెంటాడింది. వైద్యులు బ్రెయిన్డెడ్గా ప్రకటించడంతో.. తను కన్నుమూస్తూ మరో నలుగురి జీవితాల్లో అవయవదానంతో వెలుగులు నింపింది. స్టడీ టూర్కు వెళ్లి వస్తూ.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిగూడెం పరిధిలోని అస్లా తండాకు చెందిన భీమా, మంగమ్మ దంపతుల కుమార్తె ప్రియాంక(15) సూర్యాపేటలోని సాహితి హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి ప్రియాంక చాలా చురుగ్గా ఉండేది. చదువులోనూ అందరికంటే ముందుండేది. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని కలలు కనేది. తరగతి గదిలో చదువుకున్న అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, పరిశోధనలకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకోవాలని భావించింది. ఈ నెల 17న స్టడీ టూర్లో భాగంగా తోటి విద్యార్థులతో కలసి శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్ను సందర్శించింది. మరుసటి రోజు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలోని దామరచర్ల వద్ద రాత్రి 10.30 గంటలకు డిన్నర్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, తోటి విద్యార్థిని ప్రాణేశ్వరితో కలసి ప్రియాంక బస్సు దిగింది. హోటల్కు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ వాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ శాంత, సహ విద్యార్థిని ప్రాణేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రియాంకను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక విమానంలో చెన్నైకి గుండె.. ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం అదే రోజు మలక్పేటలోని యశోద ఆస్పత్రికి ప్రియాంకను తరలించారు. చికిత్సకు ఆమె స్పందించక పోవడంతో గురువారం రాత్రి బ్రెయిన్డెడ్గా డిక్లేర్ చేశారు. అవయవ దానం గురించి ప్రియాంక తల్లిదండ్రులకు వివరించగా.. కుమార్తె అవయవాలను దానం చేసేందుకు వారు అంగీకరించడంతో జీవన్దాన్కు సమాచారం ఇచ్చారు. ఆమె నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలు సేకరించారు. జీవన్దాన్ సహకారంతో చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ హృద్రోగికి గుండెను అందించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో గుండెను శంషాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లారు. గ్రీన్ చానల్ సహాయంతో 20 నిమిషాల్లోనే గుండెను ఆస్పత్రి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించారు. కాగా, కాలేయం దెబ్బతిని కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడికి కాలేయాన్ని, మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి ఓ కిడ్నీని దానం చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న మరో బాధితుడికి రెండో కిడ్నీని ఇచ్చారు. రెండు కార్నియాలను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు అందజేశారు. -
మానవాళి మనుగడ వెయ్యేళ్లే!
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జోస్యం లండన్: జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవజీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ‘భౌతికశాస్త్రంలో పరిశోధనలకు ఈ ఏడాది అత్యంత యోగ్యమైన సంవత్సరం. పరిశోధనా కోణంలో విశ్వముఖచిత్రం50ఏళ్లలో చాలా మారింది. ఇందులో నా పాత్రా ఉన్నందుకు ఆనందంగా ఉంది. ప్రకృతి సూత్రాలను అర్ధంచేసుకోగలిగితే విశ్వ రహస్యాలను ఛేదించడంలో విజయం సాధిస్తాం’ అని శాస్త్రపరిశోధనల చర్చావేదిక అరుున ‘ఆక్స్ఫర్డ్ యూనియన్’లో సోమవారం వ్యాఖ్యానించినట్లు ‘ది ఇండిపెండెంట్’ వెల్లడించింది. -
నక్షత్రం నుంచి ఎగసిపడుతున్న ఫిరంగి జ్వాలలు
వాషింగ్టన్: దాదాపు అంగారక గ్రహం సైజులో ఓ గుర్తుతెలియని నక్షత్రం నుంచి ఫిరంగి గుండ్ల మాదిరి జ్వాలలు ఎగసిపడుతున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. మరణిస్తున్న ఆ నక్షత్రం నుంచి అతి వేగంగా జ్వాలలు వెలువడుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్లాస్మా బంతుల రూపంలో వెలువడుతున్న ఇవి ఎంత వేగంగా శూన్యం గుండా ప్రయాణిస్తున్నాయంటే.. భూమి నుంచి చంద్రుడి వరకు ఉన్న దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో వెళ్లగలుగుతాయి. దాదాపు 400 సంవత్సరాల నుంచి ప్రతి ఎనిమిదిన్నర ఏళ్లకోసారి ఇలాంటి జ్వాలలు ఎగసిపడుతాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ ఫిరంగుల వంటి మంటల విషయం ఇప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు. ఈ నక్షత్రం ఎర్రని రంగులో ఉబ్బినట్లుగా ఉండి, దాదాపు 1200ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరణిస్తున్న సమయంలో నక్షత్రాలు వాటిలోని దాదాపు సగం ద్రవ్యరాశి పదార్థాలను అంతరిక్షంలోకి వెదజల్లుతాయని గుర్తించారు. -
మొరటు మాటల మొగుళ్లూ... అందుకే ఈ విరుగుళ్లూ!
ఉత్త(మ)పురుష ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త కోపర్నికస్సు కస్సూబుస్సూమంటూ కోపంతో ఎప్పుడూ ఆకాశంలోకి చూస్తూ ఉండేవాడంటారు మా శ్రీవారు. ఆయన నమ్మకం ఏమిటంటే... అలనాడు పెళ్లాం మీద అలిగినప్పుడల్లా కోపర్నికస్సు... తన ఖర్మకొద్దీ ఇలా జరుగుతోందంటూ అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేవాడట. అలా చూస్తూ చూస్తూ ఉండే క్రమంలో అలా టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్న ఆలోచన ఆయనలో బయల్దేరిందట. తన బతుకూ ఆకాశం లాగే శూన్యమైపోయింది కాబట్టి, తన జీవితంలో ఆనందం గగనమైపోయిందట. కాబట్టి ఆ గగనంలోనే ఆయన ఏదో వెతుక్కునే క్రమంలో సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదనీ, భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని కనిపెట్టాడన్నది మా ఆయన ఉవాచ. పైగా ఇందులో కాస్త పురుషాధిపత్యం కూడా ఉంది. సూర్యుడు పుంలింగం. భూమి స్త్రీలింగం. అలాంటప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి గానీ... భూమి చుట్టూ సూర్యుడు తిరగడమేమిటి నాన్సెన్స్ అన్న భావనే ఇందులో ఉంది, ఆ తర్వాత యాదృచ్ఛికంగానూ, కోపర్నికస్సు అదృష్టం కొద్దీనూ సైన్సు ప్రకారం కూడా అదే నిజమని ఆ తర్వాత తేలిందన్నది ఆయన వాదన. భార్యల మీద కోపం కొద్దీ ఇలాంటి పిచ్చివాదనలు చాలా చేస్తుంటారాయన. నా మీద అలిగి, తానూ శూన్యంలోకి చూస్తూ, చుక్కలు లెక్కిస్తూ కోపర్నికస్సును గుర్తు తెచ్చుకున్నారు మా శ్రీవారు. ఈసారి తన కోపానికి కారణం మా తరఫు బంధువులట. భార్యలనూ, ఆమె తరఫు చుట్టాలనూ ఇలా ఆడిపోసుకోవడం చాలామంది భర్తలకు మామూలే కదా. ఈ క్రమంలో ఆ రోజున మా పేరెంట్స్ కూడా ఆయన బారిన పడ్డారు. మాది మాటమీద నిలబడే వంశం కాదట. మావాళ్లంతా మాట తప్పారట. అనుకున్నట్టుగా లాంఛనాలేమీ పెట్టలేదనీ, పెళ్లికి అనుకున్నవన్నీ ఇవ్వలేదనీ అన్నారాయన. ఈ జాడ్యం చాలా మంది మొగుళ్లకూ ఉంటుంది. కానీ మావారి విషయంలో ఈ మధ్య ఇది మరీ పెచ్చుమీరి పోయింది. ఇక ఓ హద్దు వరకూ సహించి, ఆ తర్వాత ఊరుకోలేక నేనూ ఓ మాట అన్నా. మీరు అనుకున్నట్టు మాదీ, మా పేరెంట్స్దీ మాట తప్పే వంశం కాదు. మాట మీద నిలబడే వంశం. మీకో విషయం తెలుసా? నాకు ఐదేళ్లున్నప్పుడు ఇచ్చిన మాటను మా అమ్మ సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత గుర్తుపెట్టుకుని నిలబెట్టుకుంది తెలుసా?’’ అన్నాను. ‘‘ఏమిటా మాట’’ అడిగారు ఆయన ఆసక్తిగా. ‘‘అప్పట్లో నేను చిన్నదాన్ని. తెగ అల్లరి చేసేదాన్నట. అలా బువ్వ తిననంటూ నేను తెగ మారాం చేస్తూ ఉంటే, నా అల్లరి భరించలేక మా అమ్మ నాకో హెచ్చరిక లాంటి వాగ్దానం చేసింది. ఆ తర్వాత అది పట్టుబట్టి నెరవేర్చింది.’’ ‘‘ఊరించకు. తొందరగా చెప్పు’’ అన్నారాయన. ‘‘అప్పుడూ... ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే బూచోడికి పట్టిస్తా అంది. నాకు మీతో పెళ్లి చేసి తన మాట నిలబెట్టుకుంది’’ అన్నాన్నేను. అంతే... అప్పట్నుంచి మాది ఆడి తప్పే వంశమని మా శ్రీవారు మళ్లీ అంటే ఒట్టు! - యాసీన్ -
నేలకు చేరువగా నెలరాజు.. 31న కనిపించనున్న దృశ్యం
31న కనిపించనున్న దృశ్యం ఈ నెలలో ఇది రెండోసారి బెంగళూరు: నేలకు చేరువగా శుక్రవారం రాత్రి నెలరాజు కనువిందు చేయనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి చేరువగా వచ్చే సమయంలో అరుదుగా ఇలా కనిపిస్తాడు. అయితే, జనవరి నెలలోనే వరుసగా రెండోసారి ఇలా కనిపించనుండటం విశేషం. జనవరి 1న కూడా చందమామ భూమికి చేరువగా కనువిందు చేశాడు. ఈ ఏడాది మరో మూడుసార్లు... జూలై 12, ఆగస్టు 10, సెప్టెంబర్ 9 తేదీల్లో చంద్రుడు భూమికి చేరువగా కనిపించనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి చేరువగా వచ్చే సమయంలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ పెద్దగా, 30 శాతం ఎక్కువ వెలుగుతో కనిపిస్తాడని స్పేస్ ఫౌండేషన్ అధ్యక్షుడు సీబీ దేవ్గణ్ చెప్పారు. ఇలా కనిపించే చంద్రుడికి 1979లో ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోలే ‘సూపర్మూన్’గా నామకరణం చేసినట్లు వివరించారు.