breaking news
12A Railway Colony Movie
-
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ హారర్ థ్రిల్లర్
తెలుగు హీరోల్లో అల్లరి నరేశ్ ఒకడు. అప్పట్లో కామెడీ సినిమాలు చేసి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అన్ని రకాల జానర్స్ ప్రయత్నిస్తున్నాడు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కావట్లేదు. దీంతో రీసెంట్గా హారర్ క్రైమ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడా చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.'పొలిమేర' రెండు సినిమాలతో మెప్పించిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. షో రన్నర్గా వ్యవహరించిన సినిమా '12ఏ రైల్వే కాలనీ'. అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. గత నెల 21న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'12ఏ రైల్వే కాలనీ' విషయానికొస్తే.. కార్తీక్ (అల్లరి నరేశ్) అనాథ. వరంగల్లోని రైల్వే కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి బతుకుతుంటాడు. లోకల్ రాజకీయ నాయకుడు టిల్లు(జీవన్)కి నమ్మిన బంటు. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన టిల్లు.. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్మే కావాలని అనుకుంటూ ఉంటాడు. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఓ బాధ్యతని కార్తీక్కి అప్పజెబుతాడు. దానిలో భాగంగా యువతను ఆకర్షించేందుకు కార్తీక్ ఓ ఆటల పోటీ నిర్వహిస్తాడు. ఆ పోటీల్లోనే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి మనసు పారేసుకుంటాడు.ఓరోజు కార్తీక్కి టిల్లు ఓ పార్సిల్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్తాడు. దీంతో దాన్ని దాచేందుకు దొంగతనంగా ఆరాధన ఇంటికి వెళ్లగా.. అక్కడ తనకు ఊహించని పరిణామం ఎదురవుతుంది. అప్పటిదాక కింద గదిలో తనతో మాట్లాడిన తన ప్రేయసి.. తల్లితో సహా పైగదిలో హత్యకు గురవడం కార్తీక్ని షాక్కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? అసలు ఆరాధన ఎవరు? ఈ హత్యలకు కారణమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి) -
టాలీవుడ్ నవంబర్ రివ్యూ.. 35లో మూడు మాత్రమేనా?
టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్ నెల గడిచిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్ హీరోల హిట్ చిత్రాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.సెంటిమెంట్ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్ కూడా భారీ ఫ్లాప్తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్ 1న విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడలేదు.ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్ఫ్రెండ్, జటాధర, ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశాయి.ఇక రెండోవారం(నవంబర్ 14) కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంది.ఇక నవంబర్ 21న అల్లరి నరేశ్ ‘12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, పాంచ్ మినార్తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్ అయింది. ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక నవంబర్ చివరివారంలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలుకా’తో, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్ తాలుకా చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టుకోలేకపోయింది. రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్ రీటా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో ‘ది గర్ల్ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్లో అయిన టాలీవుడ్కి బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందో చూడాలి. -
21న థియేటర్లలో 21 సినిమాలు రిలీజ్.. ఏది హిట్? ఏది ఫట్?
'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు'.. టాలీవుడ్ నిర్మాతలు పదేపదే చెప్పే మాట. ప్రతిదానికి ప్రేక్షకుడినే నిందిస్తుంటారు తప్పితే తప్పు ఎక్కడ జరుగుతుందో చూసుకోరు. ఎందుకంటే ప్రేక్షకుడు అంటే అంత అలుసు. ఈ వారమే తీసుకుందాం. ఏకంగా 21 సినిమాలు థియేటర్లలో రిలీజైతే వీటిలో తెలుగు చిత్రాలు 16 ఉన్నాయి. పోనీ వీటిలో ఏమైనా బాగున్నాయా అంటే లేదు! ఉన్నంతలో ఒక్కదానికే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి మిగతా వాటి సంగతేంటి? వాటి గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే వందలాది మంది కష్టపడాలి. కష్టపడితే సరిపోదు దాన్ని ప్రేక్షకుడి వరకు చేరేలా చూడాలి. కానీ టాలీవుడ్లో కొందరి తీరు చూస్తుంటే జాలేస్తుంది. ఈ వారమే తీసుకోండి. 20కి పైగా మూవీస్ థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో తెలుగువి కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు రెండు మూడింటివి తప్పితే మిగతా వాటి పేర్లు కూడా తెలీదు. కనీసం తెలిసేలా చేయనప్పుడు రిలీజ్ చేయడం ఎందుకనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న.ఈ వారం వచ్చిన వాటిలో కాస్తోకూస్తో పబ్లిసిటీతో వచ్చినవి మూడో నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 'రాజు వెడ్స్ రాంబాయి'కి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉన్నంతలో దీన్ని చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా వాటి విషయానికొస్తే అల్లరి నరేశ్ హీరోగా చేసిన '12ఏ రైల్వే కాలనీ' మూవీని థ్రిల్లర్ జానర్లో తీశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయేలా కనిపిస్తుంది. ప్రియదర్శి 'ప్రేమంటే' కూడా రిలీజ్కి ముందు ఇదో ప్రేమకథ అన్నట్లు ప్రచారం చేశారు. తీరాచూస్తే ఇదో దొంగలైన భార్యభర్త కథ. దీని కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇది కూడా నిలబడటం కష్టమే.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)ఈ మూడు కాకుండా రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ఓ కామెడీ మూవీ. అసలు ఇదొకటి వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. వీటితో పాటు కలివనం, శ్రీమతి 21 ఎఫ్, జనతా బార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాధ, మఫ్టీ పోలీస్, హ్యాపీ జర్నీ, ఫేస్ టూ ఫియర్ లెస్, ప్రేమలో రెండోసారి, డ్యూయల్, కొదమ సింహం రీ రిలీజ్, ఆవారా రీ రిలీజ్.. ఇలా బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కటైనా హిట్ అయిందా అంటే లేదు. అసలు ఇవి రిలీజ్ అయ్యాయనే సంగతి కూడా ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయారు.చిన్నదా పెద్దదా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతా కష్టపడి ఓ సినిమా తీసి, దాన్ని పోటీలో రిలీజ్ చేయడం అవసరమా? లేదంటే ఖాళీగా ఉండే వారంలో విడుదల చేయడం మంచిదా అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. అలా చేస్తే ఒకరో ఇద్దరో ప్రేక్షకులైనా మీ చిత్రాలకు వస్తారు. చిన్న చిత్రాలు తీసే నిర్మాతలందరూ ఈ విషయంలో కాస్త దృష్టి పెట్టాలి. ఏదో తీశామా, థియేటర్లలో రిలీజ్ చేశామా అని వదిలేయకుండా కాస్త కంటెంట్పై కూడా దృష్టి పెడితే మంచిది. అలానే సరైన తేదీన రిలీజ్ కూడా ముఖ్యమే. ఇలాంటివేం చేయకుండా ప్రేక్షకుల్ని నిందించడం మాత్రం సరికాదు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!) -
‘12 ఏ రైల్వే కాలనీ’ మూవీ రివ్యూ
టైటిల్: 12 ఏ రైల్వే కాలనీనటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణికథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డనిర్మాణ సంస్థ:శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరిసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: నవంబర్ 21, 2025అల్లరి నరేశ్ ఖాతాలో హిట్ పడి చాలా రోజులవుతుంది. కామెడీ వదిలి సీరియస్ సబ్జెక్టులతో చ్చినా.. సరైన విజయం అందడం లేదు. దీంతో ఈ సారి థ్రిల్లర్ జానర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘12 ఏ రైల్వే కాలనీ’. పోలిమేర సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా పని చేసిన ఈ చిత్రం నేడు(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వరంగల్లోని రైల్వే కాలనీకి చెందిన కార్తిక్(నరేశ్) ఓ అనాథ. స్నేహితులతో(హర్ష, గెటప్ శ్రీను, సద్దాం) కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వరంగల్ టిల్లు(జీవన్ కుమార్) దగ్గర పని చేస్తుంటారు. అదే కాలనీలో ఉంటున్న ఆరాధన(కామాక్షి భాస్కర్ల)తో ప్రేమలో పడతాడు. ఆరాధన మాత్రం కార్తిక్ని పట్టించుకోదు. ఎలెక్షన్స్కి మూడు రోజుల ముందు టిల్లు..కార్తిక్ని పిలిచి ఓ కవర్ ఇస్తాడు. అది ఓపెన్ చేయొద్దని..ఎవరికి తెలియకుండా దాచాలని చెబుతాడు. ఆ కవర్ని తన ఇంట్లో దాచుదామని తీసుకెళ్తుండగా..పోలీసులు రైడింగ్కు వస్తున్నారనే విషయం తెలుస్తుంది. దీంతో రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో అది దాచాలనుకుంటాడు. దొంగచాటుగా ఆ ఇంట్లోకి వెళ్లిన కార్తిక్కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. మూడు రోజుల క్రితమే ఆరాధన, ఆమె తల్లిని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఆ హత్య చేసిందెవరు? వారి లక్ష్యం ఏంటి? అసలు ఆరాధన ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ముంబైలో ఉన్న డాక్టర్ షిండే(అనీష్ కురువిల్లా)కి ఆరాధనకు ఉన్న సంబంధం ఏంటి? చనిపోయిన ఆరాధన..కార్తిక్కి మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.విశ్లేషణ'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' లాంటి సినిమాలు విజయం సాధించడంలో స్క్రీన్ప్లే కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అలాంటి సినిమాలు అందించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మాటలు, స్క్రీన్ప్లే అందించిన చిత్రం కావడంతో ‘12 ఏ రైల్వే కాలనీ’పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. స్క్రీన్ప్లేతో ఏదో మ్యాజిక్ చేస్తాడులే అనుకున్నారు. కానీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంతో ఈ చిత్రం ఘోరంగా విఫలం అయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయలేదు. పైగా ఈ చిత్రానికి అసలు 12ఏ రైల్వే కాలనీ అని టైటిల్ ఎందుకు పెట్టారో.. తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడించారో అర్థమే కాదు. పోనీ.. ఆ యాసనైనా సరిగా వర్కౌట్ అయిందా అంటే అదీ లేదు. ఏదో అరువు తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక కథ విషయానికొస్తే.. అసలు దర్శకుడు ఏం చెప్పి నరేశ్ని ఒప్పించాడో అర్థమే కాదు. ఒకటి రెండు ట్విస్టులతో స్టోరీ చెప్పేస్తే.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా? క్లైమాక్స్ ఒకటి బాగుంటే.. సినిమా హిట్ అవుతుందా? లాజిక్కుల గురించి ఇక్కడ ప్రస్తావించకపోవడమే మంచింది. ఇంటర్వెల్ సీన్ మినహా ఫస్టాఫ్ మొత్తం బోరింగే అని చెప్పాలి. కొన్ని సీన్లను ఎందుకు పెట్టారో కూడా అర్థమే కాదు. ఏదో సంబంధం ఉన్నట్లుగా సెకండాఫ్లో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ..అక్కడ కూడా లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఉన్నంతతో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూనే కథనం సాగుతుంది. స్క్రీన్ప్లే గందరగోళంగానే ఉంటుంది తప్ప..ఎక్కడ ఆకట్టుకోలేదు. క్లైమాక్స్లో ఓ పాత్ర ఇచ్చే ట్విస్టు బాగుంటుంది. అయితే అప్పటికే ప్రేక్షకుడి సహనం నశించిపోవడంతో.. అది కూడా అంత థ్రిల్లింగ్గా అనిపించదు.నటీనటుల విషయానికొస్తే.. అల్లరి నరేశ్ ఉన్నంతలో బాగానే చేశాడు కానీ కథలో దమ్ములేనప్పుడు ఎంత మంచి నటుడైనా ఏం చేయగలడు? ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానమే బాగోలేదు. ఇక తెలంగాణ యాసలో మాట్లాడేందుకు బాగానే ప్రయత్నించాడు కానీ.. న్యాచులారిటీ మిస్ అయింది. కామాక్షి భాస్కర్ల పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది కానీ..ఆమెకు నటించే స్కోప్ అయితే లేదు. అభిరామి తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తంలో ఆమె నటన ఒక్కటే బాగా గుర్తుంటుంది. అనీష్, సాయికుమార్, హర్ష, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.సాకేంతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ సిసిరోలియో బీజీఎం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణవిలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
ఫుల్పాజిటివ్గా ఉన్నాం: ‘అల్లరి’ నరేశ్
‘‘ఈ రోజుల్లో ఆడియన్స్కు ఏదైనా కొత్తగా చెబితేనే థియేటర్స్కు వస్తున్నారు. నా ప్రయత్నంలో భాగంగా నేను తొలిసారిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ మూవీ చేశాను. నా ప్రతి సినిమాకూ నాకు టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాం. ఫుల్పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నాం. ఇటీవలి కాలంలో ఈ సినిమాలోని స్క్రీన్ప్లేతో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి.ఈ కథలోని మైండ్గేమ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అని ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఎ రైల్వే కాలనీ’. ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల హీరోయిన్. ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్గా ఉన్న ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ చెప్పిన విశేషాలు.⇒ ఈ చిత్రంలో లోకల్ ఎమ్మెల్యే దగ్గర పని చేసే కార్తీక్ అనేపాత్రలో నటించాను. ఈ సినిమా కోసం వర్క్షాప్స్ చేశాం. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ఇది పూర్తిగా హారర్ సినిమా కాదు.పారానార్మల్ టింజ్ ఉంటుంది. ఈ సినిమా కథను అనిల్ చెబుతున్నప్పుడు ఇంట్రవెల్ సీక్వెన్స్కు షాక్ అయ్యాను. కథలో ఎక్కడో మొదలైన సీన్కి చివర్లో మరో కనెక్షన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి.ఈ సినిమా రిలీజ్ తర్వాత స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటారు. అలాగే నేనో మంచి సినిమా చేశాననే రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుందనే నమ్మకం ఉంది. నాని సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. శ్రీనివాసగారి బేనర్లో నేను చేసిన తొలి సినిమా ‘నా సామిరంగ’ (ఇందులో నాగార్జున హీరో). రాజీ పడకుండా ‘12ఎ రైల్వే కాలనీ’ సినిమాను నిర్మించారాయన. మనం మరో సినిమా చేద్దామని ఆయన నాతో చె΄్పారు. ⇒ హాస్యనటుడిగా నేను దాదాపు యాభై సినిమాలు చేశాను. ప్రతివాళ్ళు మీ ఫలానా కామెడీ సినిమా బాగుందనే వారు. కానీ యాక్టర్గా నా గురించి మాట్లాడేవారు కాదు. అయితే నటుడికి గుర్తింపే ముఖ్యం. నేను సీరియస్ సినిమాలు, కామెడీ సినిమాలూ చేశాను. కామెడీ చేయడం చాలా కష్టం. ఇప్పటి ప్రేక్షకులు కొత్త రకం కామెడీ, ఆర్గానిక్ కామెడీని కోరుకుంటున్నారు. ∙దర్శకుడిగా సినిమా చేయాలని ఉంది.దర్శకుడిని అయితే కథలో ఇన్వాల్వ్ అవుతానని, దర్శకుడిగా బిజీ అవ్వాలనుకుంటున్నానని అనుకుని యాక్టర్గా నాకు అవకాశాలు రాకపోవచ్చు. అందుకే నాలుగైదేళ్ల తర్వాత డైరెక్షన్ చేస్తాను. ఓ మూకీ సినిమా చేయాలని ఉంది. ఒక్క డైలాగ్ లేకుండా రెండున్నర గంటలు నవ్వించడం చిన్న విషయం కాదు. ఇక రెండు కామెడీ సినిమాలు చేయబోతున్నాను. నేను నటించిన ‘ఆల్కహాల్’ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. -
‘రవితేజ ముందు ఒకలా..నరేశ్ ముందు మరోలా’ అని విమర్శించారు: భీమ్స్
‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘12ఎ రైల్వే కాలనీ’ డిఫరెంట్ జోనర్ సినిమా. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. శ్రీనివాసాగారు, నరేశ్గారు, డైరెక్టర్, రచయితలు నమ్మడం వల్లే నేను చేయగలిగాను. ఈ మూవీ ఔట్పుట్ చూశాక వారందరూ సంతోషంగా ఉన్నారు’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo ) తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’(12A Railway Colony). పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘మొదటిసారి ‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి థ్రిల్లర్ మూవీకి సంగీతం ఇవ్వడం కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి జానర్లోనూ నేను సినిమా చేయగలను అనే నమ్మకాన్ని ఈ ప్రాజెక్టు ఇచ్చింది. నరేశ్గారికి గతంలో గుర్తుండిపోయే పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ గురించి ఆలోచించను. నేను ఆ జోనర్లో లేను. నన్ను నమ్మి సినిమా ఇస్తే ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూశాను. రవితేజగారు స్టేజ్పై ఉన్నప్పుడు ఒకలా, నరేశ్గారు స్టేజ్పై ఉన్నప్పుడు మరోలా మాట్లాడానని కామెంట్లు పెట్టారు. సంగీత దర్శకుడిగా నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేశ్గారు... ఆగిపోయిన నా కెరీర్కి పునర్జన్మ ఇచ్చింది రవితేజగారు. ఇదే విషయాన్ని నేను చెప్పాను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక విమర్శలు చేశారు. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, డెకాయిట్, టైసన్ నాయుడు, భోగి, ఫంకీ’ వంటి సినిమాలకి సంగీతం అందిస్తున్నాను’’ అని చెప్పారు. -
ఆ మూడింటిలో మేం సక్సెస్ అయ్యాం
‘‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి జానర్ సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. ఇలాంటి చిత్రాలకు విజు వల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉండాలి. ఈ మూడింటిలో మేం సక్సెస్ అయ్యాం’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జంటగా నటించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్గా చేసిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకులు హరీష్ శంకర్, వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల ముఖ్య అతిథిలుగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఈ సినిమాలో కావలసినన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఇంట్రవెల్ బ్యాంగ్కి ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఆ తర్వాత కథను ఊహించలేరు’’ అని తెలిపారు అనిల్ విశ్వనాథ్. ‘‘మా నాన్నగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్.ఇలాంటి పెద్ద వేదికలపై మాట్లాడాలని ఆయన కోరిక. కానీ 2014లో చనిపోయారు. నేను దర్శకుణ్ణి కావడానికి 15 ఏళ్లు పట్టింది. మా నాన్న ఎక్కడున్నా చూస్తారని నమ్ముతున్నా. ఓ మంచి సినిమా చూశామన్న ఫీల్ని ‘12ఏ రైల్వే కాలనీ’ కలిగిస్తుంది’’ అని చెప్పారు నాని. -
ఫ్రైడే సందడి
సినిమా లవర్స్కి ఈ ఫ్రైడే జోష్ డే. ఎందుకంటే ఒకటి కాదు... రెండు కాదు... డజను సినిమాల వరకూ విడుదల కానున్నాయి. యాక్షన్ మావీస్, కామెడీ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ స్టోరీస్... ఇలా అన్ని రకాల సినిమాలూ వెండితెరపైకి రావడానికి రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం... చూసేయడానికి రెడీ అయిపోండి. ఈ లోపు శుక్రవారం విడుదల కానున్న సినిమాలపై ఓ లుక్కేయండి.గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని అందించడంతో పాటు.. అప్పుడప్పుడూ వారిని భయపెడుతుంటారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. కామాక్షీ భాస్కర్ల హీరోయిన్గా నటించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాల ఫేమ్ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షో రన్నర్గా వ్యవహరించారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘వైవా’ హర్ష, ‘గెటప్’ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి ఇతర పాత్రలు పోషించారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘‘మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయి? అందరికీ ఎందుకు కనపడవు? వంటి అంశాలతోనూ రూపొందిన ఈ చిత్రంలో తర్వాత ఏం జరగబోతుందనే ఎగ్జయిట్మెంట్ ఆడియన్స్ లో ఉంటుంది.ఈ సినిమాలో నరేశ్గారి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయనకు జోడీగా ఆరాధన అనే పాత్రలో కామాక్షీ భాస్కర్ల నటించారు. కథలో ఆమె పాత్రకి చాలాప్రాధాన్యం ఉంటుంది. భీమ్స్గారి సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది.క్రైమ్ కామెడీ లవర్బోయ్గా యూత్ ఆడియన్స్లో తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ తరుణ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాంచ్ మినార్’. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్గా నటించారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీపై మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘క్రైౖమ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పాంచ్ మినార్’.ఈ టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన వచ్చింది. ఉద్యోగం లేని ఓ కుర్రాడు కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అప్పుడు తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ప్రత్యేకించి రాజ్ తరుణ్ పాత్ర ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో నవ్వులు పూయిస్తుంది. ఈ చిత్రం క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందినప్పటికీ ఆడియన్స్ మరీ భయపడేంత వయొలెంట్గా ఉండదు. కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటారు. శేఖర్ చంద్ర సంగీతం, ఆదిత్య జవ్వాది విజువల్స్ మా సినిమాకి అదనపు బలాలు’’ అని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ యాక్షన్ కింగ్గా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మఫ్టీ పోలీస్’. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటించారు. రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా ముఖ్య పాత్రల్లో నటించారు. జియస్సార్ ఆర్ట్స్ బ్యానర్పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ‘తీయవర్ కులై నడుంగ’ సినిమా తమిళంలో విజయవంతం అయింది.ఈ సినిమాని శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై నిర్మాత ఎ.ఎన్. బాలాజీ తెలుగులో ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఒక రచయిత హత్య నేపథ్యంలో సాగే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో చిత్రం ‘మఫ్టీ పోలీస్’. ఇటీవలి కాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి (మానసిక ఎదుగుదల) గురించి కూడా మా సినిమాలో చర్చించాం. ఈ చిత్రంలో అర్జున్ యాక్షన్, పర్సనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అర్జున్, ఐశ్వర్యా రాజేష్లకు తెలుగునాట ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని తెలుగులోనూ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. శరవణన్ అభిమన్యు సంగీతం, భరత్ ఆశీనగన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. తమిళంలో విజయం సాధించినట్లే తెలుగులోనూ ‘మఫ్టీ పోలీస్’ అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎ.ఎన్. బాలాజీ తెలిపారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియదర్శి హీరోగా నటించిన మరో వినోదాత్మక చిత్రం ‘ప్రేమంటే’. ఈ సినిమా ద్వారా నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ మూవీలో ఆనంది హీరోయిన్గా నటించగా, యాంకర్ సుమ కనకాల ముఖ్యమైన పాత్ర పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ఎస్వీసీ ఎల్ఎల్పీ, స్పిరిట్ మీడియా బ్యానర్స్పై పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తోంది.‘‘రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ప్రేమంటే’. కొత్తగా పెళ్లయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలు, వినోదం, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్. కానిస్టేబుల్ క్యారెక్టర్లో సుమ కనకాల తన సిగ్నేచర్ మార్క్తో అలరిస్తారు. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.విశ్వనాథ్ రెడ్డి లైవ్లీ విజువల్స్ అందించారు. లియాన్ జేమ్స్ బ్యాగ్గ్రౌండ్ స్కోర్ ఫన్ని మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్,ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే, డైలాగ్ రైటర్స్ కార్తిక్ తుపురాణి, రాజ్కుమార్ అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు.ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్లో ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనలతో... అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ‘‘2004లో పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’.ఇది పరువు హత్యకు సంబంధించిన కథ అయినప్పటికీ ఫిక్షనల్ యాడ్ చేసి, తెరకెక్కించాం. ఈ కథలో ప్రేమికులకు ఏం జరిగింది అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయి. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులు ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారు అనేది ఈ మూవీ కథ. చాలా ఇంటెన్స్ స్టోరీ ఇది. ప్రత్యేకించి ఈ సినిమా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అఖిల్, తేజస్విని అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూశాక నిజంగా ప్రేమించుకున్న వాళ్లు తమ ప్రేమ కోసం ఎంతవరకు వెళ్తారు? అనేది ప్రేక్షకులు తెలుసుకుంటారు. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది.వృక్షో రక్షతి రక్షితః రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, నాగదుర్గ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కలివి వనం’. రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించారు. ఏఆర్ప్రొడక్షన్స్ పై మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. ‘‘వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన అరుదైన సినిమా ‘కలివి వనం’. వర్షం ఆకాశం నుంచి వస్తుందని పిల్లలకు చెబుతాం.కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవిగా మార్చిన దుష్చర్ల సత్యనారాయణగార్ల స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. ‘కలివి వనం’ పిల్లల జీవిత శైలిలో ఒక పాఠ్య భాగంలాగా, పెద్దబాల శిక్షలో ఒక పేజీలాగా వాళ్ల మైండ్లో ఉండిపోతుంది. ఇలాంటి సినిమాని పిల్లలు తప్పకుండా చూడాలి. మదీన్ ఎస్.కె. సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.యూత్ఫుల్ ఎంటర్టైనర్ త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర పాత్రలు పోషించారు. సంజీవనిప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘పూర్తిస్థాయి వినోదాత్మకంగా, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’.మా సినిమాకి కథే హీరో. ఇది ఒక తండ్రీ కొడుకుల కథ, తండ్రీ కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ సినిమా 100శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది. మా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్స్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి కుర్రాడు తమని తాము హీరో పాత్రలో ఊహించుకుంటారు. ఆర్పీ పట్నాయక్గారి సంగీతం మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. జగదీష్ చీకటివిజువల్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్.చెన్నై నేపథ్యంలో... ‘డాడా’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కెవిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్క్’. దర్శకుడు వెట్రిమారన్ మెంటార్గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘తడాఖా, సైంధవ్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆండ్రియా జెరెమియా ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించారు. రుహానీ శర్మ, చార్లీ, రమేష్ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తోంది.‘‘పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ చిత్రం ‘మాస్క్’. ఆండ్రియా తమిళంలో అటు హీరోయిన్గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించడంతో పాటు నిర్మించడం విశేషం. కెవిన్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. జి.ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం, ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఈ సినిమాని మరో ఎత్తుకు తీసుకెళతాయి. మా మూవీ టీజర్, ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.నిజ జీవిత కథతో....కేథలిక్ మత సోదరి, సామాజిక కార్యకర్త, సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన మలయాళ చిత్రం ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’. విన్సీ అలోషియస్ లీడ్ రోల్లో నటించారు. షైసన్ పి.ఔసేఫ్ దర్శకత్వం వహించారు. ట్రై లైట్ క్రియేషన్స్ పై సాండ్రా డిసౌజా రాణా నిర్మించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు.. 2024 ఆస్కార్కి నామినేట్ అయింది కూడా. ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ నెల 21న తెలుగులో విడుదల చేస్తున్నారు.‘‘సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ రూపొందిందింది. ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేశారు. అదేవిధంగా అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారామె. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను కూడా మా సినిమాలో చూపిస్తున్నాం. క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా తెలుగు వారికి కూడా నచ్చుతుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు.వినోదాల ప్రయాణం హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ జంటగా నటించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ కొండ నిర్మించారు. దువ్వాసి మోహన్, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 21న రిలీజ్ కానుంది. ‘‘వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచింపజే సేలా ఈ సినిమా ఉంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతులమీదుగా విడుదల చేసిన మా సినిమా ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఈ కథ విన్న తర్వాతనే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించాను. ఇలాంటి సినిమా చేసిన చైతన్య కొండాని అభినందిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, దానిమీద సామాజిక బాధ్యత ఉన్న డైరెక్టర్, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయం. హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఇలాంటి సినిమాలకు నేను సహకరిస్తాను’ అంటూ బండి సంజయ్గారు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. చైతన్య రాజ్ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అరుణ్ కుమార్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అంటూ దర్శక– నిర్మాతలు తెలిపారు.జనతా బార్లో... రాయ్ లక్ష్మీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. అశ్వథ్ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ పతాకపంపై రమణ మొగిలి స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ‘‘కుస్తీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జనతా బార్’. మహిళలప్రాధాన్యతను చాటి చెప్పే కథగా ఈ మూవీ ఉంటుంది.బార్ గర్ల్గా తన ప్రయాణం మొదలు పెట్టిన ఓ అమ్మాయి కుస్తీ పోటీల్లో ఎలా రాణించింది? ఈ ప్రయాణంలో సమాజం నుంచి ఆమె ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కొంది? వంటి అంశాలతో మా సినిమా సరికొత్తగా ఉండబోతోంది. అలాగే ఈ మంచి సందేశం కూడా ఉంది. హీరో శ్రీకాంత్ చేతులమీదుగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఓ రకంగా ఈ సినిమా రాయ్ లక్ష్మీకి తెలుగులో హీరోయిన్ గా రీ ఎంట్రీలాంటిది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ‘జనతా బార్’ ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు చేయకపోవడంతో విడుదల వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రేమలో రెండోసారిరమణ సాకే, వనిత గౌడ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. సత్య మార్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘జబర్దస్త్’ శ్రీను, ‘జబర్దస్త్’ ఫణి, బాబీ, రాణి ఇతర పాత్రలు పోషించారు. సాకే రామయ్య సమర్పణలో సిద్ధ క్రియేషన్ బ్యానర్లో సాకే నీరజ లక్ష్మి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ‘‘ప్రేమ నేపథ్యంలో తీసిన సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అదే నేపథ్యంలో రూపొందిన మా సినిమా కథ కూడా నేటి యువతీ యువకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుత ట్రెండ్కి తగట్టు సత్య మార్కగారు ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రేమతో పాటు భావోద్వేగాలు, సెంటిమెంట్ వంటి అంశాలు అలరిస్తాయి. మా చిత్ర సంగీతం, నేపథ్య సంగీతం మనసును హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -– డేరంగుల జగన్ మోహన్ -
అల్లరి నరేష్ '12ఎ రైల్వే కాలనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆరాధన గుర్తుండిపోతుంది: కామాక్షీ భాస్కర్ల
‘‘మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్గా రూపోందిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్గారికి జోడీగా ఆరాధన అనే పాత్ర చేశాను. నా పాత్ర ఎక్కడ నుంచి వచ్చింది? ఏం చేస్తుంది? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ చిత్రకథ లేదు. సినిమా చూసిన తర్వాత ఆరాధన అందరికీ గుర్తుండిపోతుంది’’ అని కామాక్షీ భాస్కర్ల తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పోలిమేర’ మూవీ ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షో రన్నర్గా వ్యవహరించారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కామాక్షీ భాస్కర్ల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘పోలిమేర’ తర్వాత అనిల్ విశ్వనాథ్గారు కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు. అందుకే ‘12ఏ రైల్వే కాలనీ’కి దర్శకత్వం వహించకుండా తన పర్యవేక్షణలో నానిగారితో దర్శకత్వం చేయించారు. నానిగారు అద్భుతంగా తీశారు. నేను జనరల్ ఫిజీషియన్ని. నేను పని చేస్తున్న సినిమా సెట్లో నన్ను డాక్టర్గానూ యూజ్ చేస్తుంటారు (నవ్వుతూ).ఇండియన్ సినిమాలో పారామెడికల్ కల్చర్ తక్కువ... ఈ సంస్కృతిని తెలుగు సినిమాలోనూ తీసుకురావాలనే ఆలోచన ఉంది. శ్రీవిష్ణు, సుహాస్, విజయ్ సేతుపతిగార్లు హీరోలుగా, అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. అయితే ఫీమేల్ యాక్ట్రెస్కి ఆ యాక్సెప్టెన్సీ లేదు. అలా ఎందుకు ఉండకూడదని సవాల్గా తీసుకుని హీరోయిన్గా చేస్తూనే కీలక పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నాను. ‘పోలిమేర 3’ షూటింగ్ ఆరంభం కావాలి. మరో పెద్ద సినిమా కూడా ఒప్పుకున్నాను’’ అని చెప్పారు. -
మా మూవీలో విలన్ ఎవరో ఊహించలేరు: అల్లరి నరేశ్
‘‘నేనిప్పటివరకు చాలా జానర్స్ చేశాను. కానీ ‘12ఏ రైల్వే కాలనీ’(12 A Railway Colony)లాంటి థ్రిల్లర్స్ చేయలేదు. ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల జర్క్ అవుతారు. మా మూవీలో విలన్ ఎవరు? అని ఊహించలేరు’’ అని ‘అల్లరి’ నరేశ్(Allari Naresh) చెప్పారు. ‘పొలిమేర, ΄పొలిమేర 2’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్గా వ్యవహరించారు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నటించారు. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘నవంబర్ 21 తర్వాత నాని అనే నా పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా తర్వాత నన్ను ఆరాధన అని పిలుస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కామాక్షి. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసేవారికి మా సినిమా ఓ మంచి ట్రీట్’’ అని అనిల్ విశ్వనాథ్ చెప్పారు. -
'నా కెరీర్లో ఇలా చేయడం తొలిసారి'.. అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అల్లరి నరేశ్ మాట్లాడుతూ..'ఇప్పటివరకూ కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ చేశా. మధ్యలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా ప్రయత్నించా. నా కెరీర్లో సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం ఇదే తొలిసారి. ఇదొక మల్టీ లేయర్ సబ్జెక్ట్. స్క్రీన్ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా మంది కొత్త డైరెక్టర్స్తో చేశా. కాసరగడ్డ నానికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న నాని పెళ్లి గిఫ్ట్గా ఈ సినిమా సక్సెస్ అందిస్తాం. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ రమేశ్ కేవలం 41 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఎక్కువ భాగం ఒకే ఇంట్లో షూట్ చేశాం. ఈ సినిమాలో ఎవరు విలన్ అనేది చివరి వరకు కనిపెట్టలేరు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. -
అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్లో వెళ్తున్నారు. ఈ సారి మాస్కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.


