తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం.
తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి.
తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయన్నారు కల్వకుంట్ల కవిత.
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్టు శనివారం కవిత ప్రకటించారు.
పార్టీ ఆవిర్భావ సభలో కవిత మాట్లాడుతూ.. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదని, మర మనిషిగా మారిపోయారని అన్నారు.
పార్టీ ఆవిర్భావ సభకు వచ్చే ముందు గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు కవిత.
పార్టీ ఆవిర్భావ సభలో మద్దతుదారులకు అభివాదం చేస్తున్న కవిత
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) ఆవిర్భావ ప్రకటన
పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న కవిత


