నటి, యాంకర్ సమీరా షెరీఫ్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను మరోసారి తల్లి కాబోతున్నానని చెప్పింది.
తన కుమారుడు అర్హాన్తో ఆడుకునేందుకు మరో బుజ్జాయి ఇంట్లోకి రాబోతుందని పేర్కొంది.
జూలై 4న డెలివరీ డేట్ ఇచ్చారని వెల్లడించింది. అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం, ఆడపిల్ల సీరియల్స్లో నటించిన సమీరా అదిరింది షోకి యాంకర్గానూ పని చేసింది.
2019లో అన్వర్ జాన్ను పెళ్లి చేసుకుంది. 2020లో ప్రెగ్నెంట్ అయింది కానీ షూటింగ్లోనే రక్తస్రావమైంది.
దీంతో కడుపులో బిడ్డను తీసేశారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు అర్హాన్ పుట్టాడు.
2023లో మూడోసారి గర్భం దాల్చింది. అంతా బాగుందనుకున్న సమయంలో బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది.
ఎనిమిదోవారంలో బిడ్డ ఎదుగుదల ఆగిపోగా ఆ విషయం పన్నెండోవారం స్కానింగ్లో బయటపడింది. దీంతో ఎంతగానో కుంగిపోయింది.
ఇప్పుడు నాలుగోసారి ప్రెగ్నెంట్ అయింది.
ఈసారి అంతా మంచే జరుగుతుందని, అర్హాన్తో ఆడుకునేందుకు పాప పుడుతుందంటూ అభిమానులు సమీరాకు ధైర్యం చెప్తున్నారు.


