
ప్రముఖ హిందీ నటి సైరా భాను మనవరాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది సాయేషా సైగల్

1997 ఆగస్టు 12న పుట్టిన ఈమె.. అక్కినేని అఖిల్ తొలి సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది

కానీ ఇది ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్లో మరో ఛాన్స్ లేకుండా పోయింది

పాగా తమిళ ఇండస్ట్రీకి మార్చింది. పలు తమిళ సినిమాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది

అలా తమిళంలో నటిస్తున్న టైంలో హీరో ఆర్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది

వీళ్లిద్దరి మధ్య దాదాపు 16 ఏళ్ల వయసు గ్యాప్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడం విశేషం

ప్రస్తుతానికైతే సినిమాలేం చేయట్లేదు. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమైపోయింది

అంత పెద్ద నటికి మనవరాలు అయినప్పటికీ ఎందుకనో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది







