'నష్ట పోయిన రైతులను ఆదుకోండి'


ఢిల్లీ: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పంటల భీమా పథకం ద్వారా నష్టపోయిన రైతులను మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు.


 


అంతకుముందు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని వివరించారు. అ తుపాను బాధితులకు కేంద్ర సాయాన్ని కోరారు. పెను తుపాను కారణంగా నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించాలని జైట్లీకి తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top