గుడికి వెళ్తున్నానని చెప్పి... | Young girl go missing | Sakshi
Sakshi News home page

గుడికి వెళ్తున్నానని చెప్పి...

Oct 18 2015 11:28 PM | Updated on Sep 18 2019 3:26 PM

గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

జీడిమెట్ల: గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లింగ్యా నాయక్ వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ కు చెందిన రమేష్ కుమార్తె ప్రియాంక (22) ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం ఉదయం గుడికి వెళ్లొస్తానని బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు.

దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. యువతి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement