- ప్రభుత్వ భూవ్యాపారంతో పెరుగుతున్న ఆత్మహత్యలు
- భోగాపురం ఎయిర్పోర్టు పరిధిలో ఇద్దరు ఆత్మహత్య
- గుండెపోటుతో మరో ఇద్దరు మృతి
- వీధిన పడుతున్న కుటుంబాలు
- భూసేకరణ వెనుక చంద్రబాబు స్వలాభమే ఎక్కువని విమర్శలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ భూదాహం రాష్ట్రంలో మరణమృదంగం సృష్టిస్తోంది. విమానాశ్రయాలు, పోర్టుల పేరు చెప్పి అవసరానికి మించి భారీగా భూములు లాక్కునేందుకు సర్కారు ఎత్తులు వేస్తుండటంతో పేద రైతులు భయంతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దల బలవన్మరణాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా అన్పించడం లేదు. ప్రజాసంక్షేమం లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఫక్తు రియల్ ఎస్టేట్ సంస్థలా మారి రైతుల భూములతో వ్యాపారానికి తెరలేపింది.
రాజధాని అమరావతి భూ సమీకరణ/సేకరణతో బాబు సర్కారు శ్రీకారం చుట్టిన ‘రియల్ వ్యాపారం’ ఇప్పుడు పోర్టులు, విమానాశ్రయాలకు పాకుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే భూములు లాక్కుంటూ రైతుల ఉసురు తీస్తుండటంపై అన్ని రాజకీయపక్షాలతోపాటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నా సర్కారు తీరు మార్చుకోవడంలేదు. విమానాశ్రయాలు, పోర్టుల పేరిట అవసరానికి మించి రెండు మూడు రెట్లుపైగా భూములను బలవంతంగా రైతుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టే కుట్ర వెనుక చంద్రబాబు స్వలాభమే అధికమనే విమర్శలు న్నాయి.
ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు?
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తాము సమిథలవుతున్నామనే భయంతో ఇప్పటికే నలుగురు యువ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఎయిర్పోర్టుకోసం ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుంటే ఏమి చేయాలో దిక్కుతోచక బతుకుదెరువు మార్గం తెలియక విజయనగరం జిల్లా గూడెపువలసకు చెందిన పెదకృష్ణమూర్తి (31) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
రావివలసకు చెందిన వెంపాడ రామసూరి (30) ఇదే టెన్షన్తో గుండెపోటుతో మరణించారు. ఎయిర్పోర్టుకు తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలనే మానసిక ఆందోళన, వీధిన పడాల్సి వస్తుందనే భయంతో రామచంద్రపేటకు చెందిన ముక్కాల త్రినాథ్, గూడెపువలసకు చెందిన వెంపాడ సూరి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా భోగాపురం విమనాశ్రయ భూసేకరణ ఆరంభం కాకముందే కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగు ప్రాణాలు బలిగొంది. దీంతో వీరి కుటుంబాలు వీధినపడి విలపిస్తున్నాయి. తమ కుటుంబాల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని మృతుల సంబంధీకులు శాపనార్థాలు పెడుతున్నారు.
సర్కారు భూదాహానికి రైతులు బలి
Published Fri, Oct 2 2015 2:59 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement