రాజకీయ ప్రయోజం కోసమే సోనియా జోక్యం | UP minister says Sonia supports Nagpal for 'political gain' | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రయోజం కోసమే సోనియా జోక్యం

Aug 10 2013 10:25 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా గాంధీ రాజకీయ ప్రయోజం కోసమే దుర్గాశక్తి అంశంలో జోక్యం చేసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాం ఖాన్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ ప్రయోజం కోసమే ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్పాల్ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ పట్టాణాభివృద్ది శాఖ మంత్రి అజాం ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉనికిని కొల్పోయిన ఆ పార్టీ తన ప్రభావాన్ని తిరిగి పొందే క్రమంలో రాజకీయ క్రీడలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. తన సొంత నియోజకవర్గమైన రాంపూర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి విషయంలో సోనియా గాంధీ ప్రధాని మన్మోహాన్ సింగ్కు లేఖ రాయాడాన్ని ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలతోపాటు విదేశీయురాలు సోనియా నేతృత్వంలో నడుస్తుందన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అతి సున్నితమైన వ్యక్తి అని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన దుర్గాశక్తి సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. అయితే సోనియాగాంధీపై అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి ఖండించారు. ఆ పార్టీ నేతలతో చెప్పించుకునే పరిస్థితి సోనియాకు లేదని రీటా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement