మహిళా బోగీలో ప్రయాణం:ఇద్దరు యువకుల అరెస్టు | two youngsters arrested due to travel in women's coach | Sakshi
Sakshi News home page

మహిళా బోగీలో ప్రయాణం:ఇద్దరు యువకుల అరెస్టు

Dec 8 2013 8:28 PM | Updated on Sep 2 2017 1:24 AM

లోకల్‌రైలు మహిళా బోగీలో ప్రయాణించిన ఐదుగురు యువకులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు శనివారం అరెస్టు చేశారు.

ముంబై: లోకల్‌రైలు మహిళా బోగీలో ప్రయాణించిన ఐదుగురు యువకులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు శనివారం అరెస్టు చేశారు. కింగ్స్ సర్కిల్ రైల్వే స్టేషన్ నుంచి మాిహ ం వరకు మహిళాబోగీలో ప్రయాణించిన రాజ్‌కుమార్, సిరాజ్ షేక్, మోహినుద్దీన్ షేక్, సత్య గణేష్, మరో బాలుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి వీరికి జరిమానా విధించారు. ఇదిలా వుండగా హార్బర్‌లైన్‌లో మహిళా బోగీల్లో కొందరు యువకులు తరచూ ప్రయాణిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఇలాంటి వారిని గుర్తించడానికి ఆర్పీఎఫ్ ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement