కాశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం | Two militants killed in Kashmir | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో ఇద్దరు తీవ్రవాదులు హతం

Oct 4 2013 10:53 AM | Updated on Sep 1 2017 11:20 PM

కాశ్మీర్లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్లోకి అక్రమంగా చోరబాడుతున్న ఇద్దరు తీవ్రవాదులను భారత్ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.

కాశ్మీర్లోని కుప్వారా జిల్లా సమీపంలో భారత్లోకి అక్రమంగా చోరబాడుతున్న ఇద్దరు తీవ్రవాదులను భారత్ ఆర్మీ దళాలు కాల్చి చంపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. కెరన్ సెక్టర్ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు తీవ్రవాదులు అక్రమంగా భారత్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయని వివరించారు.

 

గత 10 రోజుల నుంచి దాదాపు 40 మంది చోరబాటు దారులు కెరన్ సెక్టర్ ద్వారా భారత్లో ప్రవేశించారని చెప్పారు. వారిలో15 మందిని ఇప్పటి వరకు భద్రత దళాలు కాల్చి చంపాయన్నారు. అయితే నియంత్రణ రేఖ దాటి ఎవరు భారత్లో ప్రవేశించకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement