కోర్టులో ఆగంతకులు కాల్పులు: ముగ్గురు మృతి | Three killed in Pakistan court firing | Sakshi
Sakshi News home page

కోర్టులో ఆగంతకులు కాల్పులు: ముగ్గురు మృతి

Apr 11 2014 1:21 PM | Updated on Mar 23 2019 8:23 PM

పాకిస్థాన్ కోర్టు తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. ఆ కాల్పులలో పోలీసు, ఖైదీతోపాటు ఓ పౌరుడు మృతి చెందారు.

పాకిస్థాన్ కోర్టు తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. ఆ కాల్పులలో పోలీసు, ఖైదీతోపాటు ఓ పౌరుడు మృతి చెందారు. ఆ ఘటన రావల్పిండిలోని స్థానిక కోర్టులో శుక్రవారం చోటు చేసుకుందని డాన్ పత్రిక వెల్లడించింది. స్థానిక కోర్టులో ఈ రోజు ప్రశాంతంగా ఓ కేసు విచారణ కొనసాగుతుంది. అయితే అప్పటికే కోర్టు హాల్లోకి ప్రవేశించిన ఆగంతకులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.

దాంతో కోర్టులోని వారంత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి....నలుగురు నిందితలను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించ లేదని డాన్ పేర్కొంది. ఆ సంఘటనలో గాయపడిన వారు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement