పెళ్లైన మూడు రోజులకే.. | The New Bride dies in Krishna River | Sakshi
Sakshi News home page

పెళ్లైన మూడు రోజులకే..

May 21 2017 3:22 PM | Updated on Apr 3 2019 8:07 PM

పెళ్లైన మూడు రోజులకే.. - Sakshi

పెళ్లైన మూడు రోజులకే..

కృష్ణా నదిలో స్నానానికి దిగిన నవ వధువు ప్రమాదవశాత్తూ మృతిచెందింది.

మఠంపల్లి(సూర్యాపేట): వివాహాం తరువాత మండలంలోని మట్టపల్లి వద్దనున్న శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శంచుకునేందుకు నవ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. కృష్ణా నదిలో స్నానానికి దిగిన నవ వధువు ప్రమాదవశాత్తూ మృతిచెందింది.  హుజూర్‌నగర్‌ మండలం నేరేడుచర్లకు చెందిన దీపిక(23)కు మిర్యాలగూడ మండలం ఆలగడపకు చెందిన సాయి అనే యువకుడితో మూడు రోజుల క్రితం వివాహాం జరిగింది.

కుటుంబసభ్యులతో కలిసి నర్సింహస్వామిని దర్శించుకుని నదిలోకి దంపతులు స్నానానికి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నవ వధువు మునిగిపోయింది. బంధువులు వెంటనే ఆప్రమతమై వెలికి తీశారు. కొన ఊపిరితో ఉన్న దీపికను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. పెళ్లికుతురు దీపిక మరణించడంతో నేరేడుచర్ల, ఆలగడప గ్రామాల్లో విషాదం నెలకొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement