మలేషియాలో అనిరుధ్ షో వాయిదా | The concert in Malaysia on the 29th is postponed, says Anirudh Ravichander | Sakshi
Sakshi News home page

మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

Mar 22 2014 1:10 PM | Updated on Sep 2 2017 5:01 AM

మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

మలేషియాలో అనిరుధ్ షో వాయిదా

వై దిస్ కోలవెర్రి... అంటూ పాట పాడి సంగీత అభిమానులను కిక్కెక్కించిన అనిరుధ్ మలేషియాలో నిర్వహించాల్సిన షో వాయిదా వేసినట్లు ప్రకటించారు.

వై దిస్ కోలవెర్రి పాటకు సంగీతం అందించి సంగీత అభిమానులను మైమరిపించిన అనిరుధ్ మలేషియాలో నిర్వహించాల్సిన షో వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆ షో మరల ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామన్నారు. విమానం గల్లంతు పట్ల సంతాప సూచికంగా షోను వాయిదావేసినట్లు శనివారం అనిరుధ్ ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు.


మలేషియా విమానం అదృశ్యమై రెండు వారాలు గడిచిన ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో దేశ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఆ విమానంలోని ప్రయాణిస్తున్న తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని వారి బంధువులు ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో షో వాయిదా వేసినట్లు చెప్పారు. అసలు అయితే ఈ నెల 29న అనిరుధ్ సంగీత విభావరి నిర్వహించవలసి ఉంది.


మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు అదృశ్యమైంది. ఆ విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయారు. దాంతో మలేషియాతోపాటు దాదాపు 26 దేశాలు విమానం ఆచూకీ కోసం గాలింపులు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితం కనిపించకపోవడంతో ఆ విమాన ప్రయాణికులు బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేషియా అంతట విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement