సుజుకీతో ఒప్పందానికి మారుతీ బోర్డు ఆమోదం | Suzuki Maruti board approved the deal | Sakshi
Sakshi News home page

సుజుకీతో ఒప్పందానికి మారుతీ బోర్డు ఆమోదం

Oct 4 2015 2:06 AM | Updated on Sep 3 2017 10:23 AM

గుజరాత్‌లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 30 ఏళ్ల దాకా వాహనాల ....

న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 30 ఏళ్ల దాకా వాహనాల తయారీకి సంబంధించి సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్‌ఎంజీ)తో ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనను మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) బోర్డు ఆమోదించింది. దీనికి నియంత్రణ సంస్థలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంటుంది.

పలు మార్పులకు లోనైన తర్వాత రూపుదిద్దుకున్న ఈ కొత్త ఒప్పందం ప్రకారం ఎస్‌ఎంజీ.. లాభనష్టాలు లేని ప్రాతిపదికన వాహనాలను తయారు చేసి, ఎంఎస్‌ఐకి అందిస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement