కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు | Srinivas kuchibhotla murder case: accused Purington present in Court | Sakshi
Sakshi News home page

కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు

Mar 10 2017 11:00 PM | Updated on Oct 4 2018 8:38 PM

కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు - Sakshi

కూచిభొట్ల హత్య కేసు: కోర్టుకు నిందితుడు

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చిచంపిన నౌకాదళ విభాగం మాజీ ఉద్యోగి ఆడం పూరింటన్‌ గురువారం స్థానిక న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు.

విచారణ మే 9కి వాయిదా
హూస్టన్‌:
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాల్చిచంపిన నౌకాదళ విభాగం మాజీ ఉద్యోగి ఆడం పూరింటన్‌ గురువారం స్థానిక న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. నారింజ రంగుతో కూడిన జంప్‌సూట్‌ ధరించిన పూరింటన్‌ విచారవదనంతో కనిపించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉన్నందువల్ల మరికొంత సమయం కావాలని హంతకుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ కేçసు తదుపరి విచారణను కోర్టు మే నెల తొమ్మిదో తేదీకి వాయిదావేసింది.

శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్‌.ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు పూరింటన్‌ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్‌ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్‌ చనిపోవడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement