మహిళల్ని గౌరవించకపోవడం సిగ్గుచేటు: మన్మోహన్ సింగ్ | shameful that women are not respected: Manmohan Singh | Sakshi
Sakshi News home page

మహిళల్ని గౌరవించకపోవడం సిగ్గుచేటు: మన్మోహన్ సింగ్

Sep 23 2013 12:39 PM | Updated on Sep 1 2017 10:59 PM

దేశంలో మహిళలకు సముచిత గౌరవం దక్కకపోవడం సిగ్గుచేటని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడకుండా మగవాళ్లు దృక్పథం మార్చుకోవాలని సూచించారు.

 దేశంలో మహిళలకు సముచిత గౌరవం దక్కకపోవడం సిగ్గుచేటని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడకుండా మగవాళ్లు దృక్పథం మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆరంభమైన జాతీయ సమైక్య మండలి (ఎన్ఐసీ) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. మహిళలపై దౌర్జన్యాలను అరికట్టేందుకు తగిన సూచనలు రూపొందించాలని సూచించారు.

'మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగినపుడే ఏ దేశమైనా పురోగతి సాధించగలదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడకుండా అందరూ తప్పనిసరిగా వైఖరి మార్చుకోవాలి' అని ప్రధాని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. మహిళల్ని గౌరవించకుండా ఏ సమాజం కూడా అభివృద్ధి చెందలేదని చెప్పారు. మహిళల రక్షణకు కోసం ప్రభుత్వం కఠిన చట్టాల్ని రూపొందించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement