శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం | Palghar MLA Krushna Ghoda dies of heart attack | Sakshi
Sakshi News home page

శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం

May 24 2015 11:03 AM | Updated on Sep 3 2017 2:37 AM

శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

పాల్గార్: శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా దహాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతనిథ్యం వహిస్తున్నారు. పాల్గార్ జిల్లాలో ఓ పెళ్లికి హాజరయి తిరిగి వస్తుండగా చరోటి చెక్ పోస్టుకు సమీపంలో తెల్లావారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది.

వెంటనే వాపి ప్రాంతంలోని హరియా ఆస్పత్రికి ఆయనను తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కృశాన్ ఘోడా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రణషీత్ లో నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement