కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు | Pakistan will always support Kashmiri brothers and sisters: Nawaz Sharif | Sakshi
Sakshi News home page

కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు

Feb 5 2017 11:24 AM | Updated on Sep 5 2017 2:58 AM

కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు

కశ్మీరీలకు పాకిస్థాన్ మద్దతు

కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ పాలకులు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇ‍స్లామాబాద్: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ పాలకులు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి వేదికపైనా కశ్మీరీలకు అండగా నిలుస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ప్రకటించారు. కశ్మీర్ దినం(ఫిబ్రవరి 5) సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... ఏడు దశాబ్దాలుగా స్వయం పాలన కోసం పోరాడుతున్న కశ్మీరీలను భారత్ అణచివేస్తోందని ఆరోపించారు.

కశ్మీర్ సోదరీసోదరులకు పాకిస్థాన్ పౌరులు అండగా నిలబడతారని తెలిపారు. ఎటువంటి సమయంలోనైనా కశ్మీరీలకు దన్నుగా నిలుస్తామన్నారు. కశ్మీర్ అంశం సమసిపోని వివాదమని పేర్కొన్నారు. ఉప ఖండం విభజనలో కశ్మీర్ సమస్య అసమగ్ర అజెండగా ఉందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పౌరులకు ఎల్లప్పుడూ నైతిక, దౌత్య, రాజకీయ మద్దతు ఇస్తామని మమ్నూన్ హుస్సేన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement