మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్ | Pakistan violates ceasefire in Jammu | Sakshi
Sakshi News home page

మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్

Aug 2 2015 8:57 AM | Updated on Mar 25 2019 3:03 PM

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్లోని భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఆర్ ఎస్ పురా సెక్టర్ ప్రాంతంలో కాట్రంకా సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.

పాక్ కాల్పులపై వెంటనే స్పందించిన బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. శనివారం అర్థరాత్రి 1.00 గం.కు మొదలైన ఈ కాల్పులు 2.30 గం.ల వరకు జరుగుతునే ఉన్నాయని తెలిపారు. అయితే భారత్ వైపున ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement