
మంత్రివర్గం కోసం ఓ వాట్సప్ గ్రూప్!
ఆయన ఓ రాష్ట్ర మంత్రి. తన సహచర సభ్యులంతా కలిసి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుగా వాట్సప్లో ఓ గ్రూప్ క్రియేట్ చేశారు.
ఆయన ఓ రాష్ట్ర మంత్రి. తన సహచర సభ్యులంతా కలిసి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుగా వాట్సప్లో ఓ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇది జరిగింది పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రంలో. సుపరిపాలన కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని భావించిన షా.. 'కేబినెట్' అనే పేరుతోనే ఈ గ్రూప్ను క్రియేట్ చేశారు. అందులో మంత్రులతో పాటు సలహాదారులు, ప్రత్యేక సహాయకులు.. వీళ్లంతా కూడా ఉన్నారట.
ఇంతకీ ఈ గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలుసా.. సాక్షాత్తు సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రే! కేబినెట్లోని మంత్రులంతా తమ తమ కార్యకలాపాలు, సమస్యల గురించి ఈ వాట్సప్ గ్రూపులో తెలియజేయాలని ఆయన చెప్పారు. దాంతో తమ పర్యటనలు, సమావేశాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలన్నింటినీ మంత్రులు ఈ గ్రూపులో షేర్ చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.