
పాక్లో 130 మంది ఉగ్రవాదులు హతం
పాకిస్తాన్లో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 130 మందిని ఆ దేశ భద్రతాదళాలు గత కొన్ని రోజుల్లో మట్టుబెట్టాయి.
లాహోర్/పెషావర్: పాకిస్తాన్లో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 130 మందిని ఆ దేశ భద్రతాదళాలు గత కొన్ని రోజుల్లో మట్టుబెట్టాయి. మరో 350 మందిని అరెస్టు చేశాయి. అరెస్టైన వారిలో ఎక్కువగా అఫ్గాన్ జాతీయులు ఉన్నారు. ఆదివారం అఫ్గాన్ సరిహద్దులో భద్రతా దళాలు జరిపిన దాడిలో 15 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.
యువతను ఉగ్రవాదులుగా చేర్చుకుని, ఆత్మాహుతి దాడులు చేసేలా ప్రేరేపించడంలో సిద్ధహస్తుడైన ఓ ముష్కరుడు కూడా హతమైన 15 మందిలో ఉన్నట్లు తెలిసింది. వాయవ్య పాకిస్తాన్లో మరో 11 మంది అఫ్గాన్ ఉగ్రవాదులను భద్రతా దళాలు చంపాయి. శుక్రవారం నాటికి వంద మంది ఉగ్రవాదులను హతమార్చగా, తాజాగా ఆ సంఖ్య 130కి చేరింది. గత వారం ఉగ్రదాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాక్ ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తోంది.