దేశవ్యాప్తంగా నేడు లోక్ అదాలత్‌లు | National Lok Adalat to take up 19 lakh cases today | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా నేడు లోక్ అదాలత్‌లు

Nov 23 2013 5:13 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఒకే రోజు లక్షలాది కేసుల పరిష్కారమే లక్ష్యంగా శనివారం దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు.

 న్యూఢిల్లీ: ఒకే రోజు లక్షలాది కేసుల పరిష్కారమే లక్ష్యంగా శనివారం దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు సహా అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుంచి కింది స్థాయి కోర్టులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నేషనల్ లోక్‌అదాలత్ కార్యక్రమం జరుగుతుంది. కోర్టులలోని పెండింగ్ కేసులను తగ్గిం చడం, వ్యాజ్యదారులకు సత్వర న్యాయాన్ని అందించాలన్నది ఈ అదాలత్‌ల నిర్వహణ లక్ష్యం. సుప్రీంకోర్టులో నేషనల్ లోక్ అదాలత్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎస్.సింఘ్వి, జస్టిస్ ఎ.కె.పట్నాయక్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తదితరులు పాల్గొంటారు.
 

Advertisement
 
Advertisement
Advertisement