పాకిస్థాన్ కు ధీటైన జవాబివ్వండి:మోడీ | narendra Modi seeks befitting reply to Pak's excesses against fishermen | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ కు ధీటైన జవాబివ్వండి:మోడీ

Feb 1 2014 10:55 PM | Updated on Aug 15 2018 2:14 PM

పాకిస్థాన్ కు ధీటైన జవాబివ్వండి:మోడీ - Sakshi

పాకిస్థాన్ కు ధీటైన జవాబివ్వండి:మోడీ

భారతీయ మత్స్యకారుల పట్ల దారుణంగా వ్యవహరించిన పాకిస్థాన్‌కు దీటైనచర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం తగిన బదులు ఇవ్వాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ డిమాండ్ చేశారు.

రాజ్‌కోట్: భారతీయ మత్స్యకారుల పట్ల దారుణంగా వ్యవహరించిన పాకిస్థాన్‌కు దీటైనచర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం తగిన బదులు ఇవ్వాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ డిమాండ్ చేశారు. అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా  రాజ్‌కోట్‌కు వచ్చిన మోడీ మాట్లాడారు. ‘‘12 ఏళ్ల భావిక ప్రధానికి రాసిన లేఖ ప్రతి నాకు అందింది. చేపలు పట్టడానికి వెళ్లిన ఆమె తండ్రిని పాక్ భద్రతా దళాలు అపహరించాయి.మూడు నెలల క్రితం భావిక తండ్రి పాక్ జైల్లో చనిపోయాడు.

 

అతనిని కడసారి చూసేందుకు ఆమె ఎదరు చూస్తోంది. తండ్రి ఎలా మరణించాడో తెలుసుకోవాలని చూస్తోంది. న్యాయం కోసం ఆమె ఆశిస్తోంది' అని మోడీ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే పాక్ కు భారత్ ధీటుగా జవాబివ్వాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement