పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడి | Militants attack police post in Kashmir | Sakshi
Sakshi News home page

పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడి

Aug 18 2015 1:43 PM | Updated on Sep 17 2018 6:18 PM

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మసీదుకు రక్షణ కల్పిస్తున్న పోలీసు పోస్ట్ పై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్, పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. కానిస్టేబుల్ నుంచి ఐఎన్ఎస్ఏఎస్ తుపాకీని లాక్కుని ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement