మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు | manmohan singh was aware of coal scam, says madhu koda | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు

Sep 2 2015 5:29 PM | Updated on Sep 3 2017 8:37 AM

మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు

మాజీ ప్రధానిపై మాజీ సీఎం ఆరోపణలు

బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా బురద చల్లారు.

బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా బురద చల్లారు. జిందాల్ గ్రూప్ వాళ్లకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు విషయం సహా.. కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలూ నాటి ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్కు తెలిసే జరిగాయని ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టులో వెల్లడించారు.

ఒకవేళ అందులో ఏదైనా కుట్రకోణం ఉంటే.. అది ప్రధానమంత్రికి తెలియకుండా జరిగే అవకాశమే లేదన్నారు. అందువల్ల ఈ కేసులో అదనపు నిందితునిగా మన్మోహన్ సింగ్ను కోర్టుకు పిలిచి విచారించాలని మధుకోడా కోర్టును కోరారు. అయితే, ఈ విషయమై సీబీఐ గురువారం నాడు స్పందించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement