కూలిపోయిన ఇండోనేసియా విమానం | indonosia plane found crashed in papua by residents | Sakshi
Sakshi News home page

కూలిపోయిన ఇండోనేసియా విమానం

Aug 16 2015 7:38 PM | Updated on Sep 3 2017 7:33 AM

కూలిపోయిన ఇండోనేసియా విమానం

కూలిపోయిన ఇండోనేసియా విమానం

గల్లంతయిన ఇండోనేసియా విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యహ్నం పపువా ప్రాంతంలో పర్వతంపై కూలిపోయినట్టు స్థానికులు చెప్పారు.

జకర్తా: గల్లంతయిన ఇండోనేసియా విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యహ్నం పపువా ప్రాంతంలో పర్వతంపై కూలిపోయినట్టు స్థానికులు చెప్పారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విమానంలో  54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ రోజు మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి  ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఓక్సిబిల్కు బయల్దేరింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆ సమయంలో దట్టమైన మేఘాలు, వర్షం, పొగమంచుతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement