బాలి చర్చలు సఫలం
భారత్ ‘ఆహార భద్రత’కు డబ్ల్యూటీఓ అంగీకారం
ప్రపంచ వాణిజ్యానికి అవరోధాల సడలింపే కీలకం
రూ. 61 లక్షల కోట్ల మేర పెరగనున్న వాణిజ్యం
భారత్కు ఇది చరిత్మ్రాత్మక నిర్ణయం: ఆనంద్శర్మ
బాలి (ఇండోనేసియా): ఏళ్ల తరబడి వరుస వైఫల్యాల అనంతరం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఎట్టకేలకు.. అంతర్జాతీయ వాణిజ్యంపై చరిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేసింది. పేదలకు సబ్సిడీ ధరలతో ఆహార ధాన్యాలు అందించే ఆహార భద్రత పథకానికి రక్షణ కల్పించాలన్న భారత్ వంటి దేశాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ.. 159 దేశాల మంత్రులు శనివారం ఉదయం బాలి ప్యాకేజీకి అంగీకారం తెలిపారు. దోహా చర్చలు మొదలైన తర్వాత కుదిరిన ఈ తొలి ఒప్పందం వల్ల ప్రపంచ వాణిజ్య రంగం రూ. 61 లక్షల కోట్ల (లక్ష కోట్ల డాలర్లు) మేర పెరుగుతుందని అంచనా. గత నాలుగు రోజులుగా సుదీర్ఘంగా సాగిన చర్చల్లో.. క్యూబా చివరి నిమిషంలో అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరో మూడు లాటిన్ అమెరికా దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి.
ఐదో రోజు శనివారం చర్చల్లో ఒప్పందం ఖరారైంది. ‘‘డబ్ల్యూటీవో తొమ్మిదో మంత్రిత్వ సదస్సు బాలి ప్యాకేజీని పూర్తిగా ఆమోదించింది. ఇది చరిత్రాత్మక విజయం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని ఇండోనేసియా వాణిజ్య మంత్రి గీతావీర్జవాన్ సదస్సు ముగింపు సందర్భంగా ప్రకటించారు. కస్టమ్స్ విధివిధానాలను సరళం చేయటం, మరింత పారదర్శకంగా చేయటం ద్వారా వాణిజ్యానికి అవరోధాలను సడలించటం బాలి ఒప్పందంలో కీలకమైన అంశం. డబ్ల్యూటీఓ చర్చలు ప్రారంభమైనపుడు.. ఆహార భద్రత, సబ్సిడీ విషయంలో భారత్ కఠిన వైఖరి ప్రదర్శించటంతో ఈ చర్చలు కూడా విఫలమవుతాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే శుక్రవారం నాటి చర్చల్లో.. భారత్ వంటి దేశాలు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించటానికి, ప్రజలకు సబ్సిడీ ధరల్లో ఆహార ధాన్యాలను అందించటానికి, దానిపై ఎలాంటి జరిమానాలూ విధించకుండా ఉండటానికి డబ్ల్యూటీఓ అంగీకరించింది. దీంతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం భారతదేశానికి చరిత్రాత్మకమైనదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్శర్మ అభివర్ణించారు. దోహా చర్చల పునరుద్ధరణ, పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, బాలి డిక్లరేషన్ సానుకూలమైన పరిణామమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పేద, ధనిక దేశాలకు సమాన అవకాశాలను కల్పించేందుకు విస్తృత ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని బాలి ఒప్పందం సజీవంగా ఉంచింది. బాలి చర్చలు విజయవంతమైనందుకు సహకరించిన సభ్య దేశాలకు, ఆతిథ్యమిచ్చిన ఇండొనేసియాకు డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబర్టో అజివెడో కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేం ప్రపంచాన్ని మళ్లీ డబ్ల్యూటీఓలోకి తెచ్చాం. చరిత్రలో మొదటిసారిగా డబ్ల్యూటీఓ విజయం సాధించింది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం: కిసాన్సభ
న్యూఢిల్లీ: రైతులకు మద్దతు ధర అందించే, కోట్లాది మంది అన్నార్తులకు ఆహార భద్రత కల్పించే దేశపు సార్వభౌమాధికార హక్కును ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఉల్లంఘిస్తోందని.. దానిని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఎం అనుబంధ రైతు సంఘం అఖిల భారత కిసాన్సభ ప్రకటించింది. ఆహార భద్రత అవసరాల కోసం ప్రభుత్వం చేసే నిల్వలపై అసమానత్వం నిబంధనలతో కూడిన డబ్ల్యూటీఓ మంత్రిత్వ ప్రకటనను భారత ప్రభుత్వం.. రాష్ట్రాలతో, పార్లమెంటులో చర్చలేకుండా అంగీకరించి ఉండాల్సింది కాదని కిసాన్సభ శనివారం ఒక ప్రకటనలో తప్పుపట్టింది.
డబ్ల్యూటీఓ చరిత్రాత్మక ఒప్పందం
Published Sun, Dec 8 2013 3:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement