జాలర్లను విడుదల చేసిన భారత్, శ్రీలంక | India and Sri Lanka release 52 fishermen each | Sakshi
Sakshi News home page

జాలర్లను విడుదల చేసిన భారత్, శ్రీలంక

Jan 14 2014 3:11 AM | Updated on Nov 9 2018 6:43 PM

భారత్, శ్రీలంకలు తమ అధీనంలోని మత్స్యకారులను సోమవారం విడుదల చేశాయి. ఇరు దేశాలూ చెరో 52 మంది మత్స్యకారులను విడిచిపెట్టాయి.

న్యూఢిల్లీ: భారత్, శ్రీలంకలు తమ అధీనంలోని మత్స్యకారులను సోమవారం విడుదల చేశాయి. ఇరు దేశాలూ చెరో 52 మంది మత్స్యకారులను విడిచిపెట్టాయి. ఈ పరిణామం ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య అవగాహనను మరింత పెంచుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌కు చెందిన 52 మంది మత్స్యకారుల్లో 20 మందిని మల్లాకం నుంచి 32 మందిని ట్రింకొమలై నుంచి శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంకకు చెందిన 52 మంది మత్స్యకారులను భారత ప్రభుత్వం తమిళనాడు నుంచి విడుదల చేసినట్టు అధికార ప్రతినిధి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement