ఫొటోగ్రాఫర్‌ కాలర్‌ పట్టుకొని మరీ.. హీరో దాడి! | hero Attacks Photographer Outside Divorce Court | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫర్‌ కాలర్‌ పట్టుకొని మరీ.. హీరో దాడి!

Jan 25 2017 9:52 AM | Updated on Sep 5 2017 2:06 AM

ఫొటోగ్రాఫర్‌ కాలర్‌ పట్టుకొని మరీ.. హీరో దాడి!

ఫొటోగ్రాఫర్‌ కాలర్‌ పట్టుకొని మరీ.. హీరో దాడి!

విడాకుల కేసు దాఖలు చేయడానికి వచ్చిన బాలీవుడ్‌ హీరో పులకిత్‌ సామ్రాట్‌ ఓ ఫొటో జర్నలిస్టుపై దాడికి దిగాడు.

ముంబై: విడాకుల కేసు దాఖలు చేయడానికి వచ్చిన బాలీవుడ్‌ హీరో పులకిత్‌ సామ్రాట్‌ ఓ ఫొటో జర్నలిస్టుపై దాడికి దిగాడు. విబేధాల కారణంగా గతకొంతకాలంగా దూరంగా ఉంటున్న పులకిత్‌, అతని భార్య శ్వేత రోహిరా విడాకుల కేసు దాఖలు చేయడానికి మంగళవారం బంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం పులకిత్‌ బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. తన ఫొటోలు తీస్తుండటంతో సహనం కోల్పోయిన పులకిత్‌ ఓ ఫొటోగ్రాఫర్‌ను పట్టుకొని మరీ కొట్లాటకు దిగాడు. ఫొటోగ్రాఫర్‌ కాలర్‌ పట్టుకొని మరీ పులకిత్‌ దాడికి దిగినట్టు ఫొటోలను బట్టి తెలుస్తోంది.

తాను కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తూ కనిపించారని, దీంతో కోపోద్రిక్తుడైన పులకిత్‌ సామ్రాట్‌ ఓ ఫొటోగ్రాఫర్‌పై దాడికి దిగారని ముంబై మీడియా తెలిపింది. అతను ఫొటోగ్రాఫర్‌ కాలర్‌ పట్టుకొని మరీ గొడవకు దిగిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయాయి.

సల్మాన్‌ రాఖీ సోదరిగా పేరొందిన శ్వేత రోహిరా.. యామీ గౌతమ్ వల్లే తాను భర్తతో వీడిపోతున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. పులకిత్, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మొదట్లో తమ కాపురం సవ్యంగా సాగిందని, యామీ గౌతమ్తో తన భర్తకు ఎఫైర్‌ ఉండటంతో తమ ఇద్దరి మధ్య కలతలు వచ్చాయని రోహిరా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పులకిత్తో తాను విడిపోవడానికి యామీ గౌతమ్ కారణమని ఆరోపించింది. కాగా, తన భార్యతో కలిసుండలేనని పులకిత్ చెప్పాడు. సానుభూతి పొందేందుకు తన ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొందని, వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి రచ్చ చేస్తోందని విమర్శించాడు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించనని, తన వివాహ బంధం ముగిసినట్టేనని పులకిత్ పేర్కొన్నాడు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement