న్యూఢిల్లీ: దాదాపు 15 ఏండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన గీత వ్యవహారంలో అనూహ్య మలుపు తిరిగింది. పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన 23 ఏండ్ల ఆమె తన కుటుంబసభ్యులను గుర్తుపట్టలేదు. చెవిటి, మూగ అమ్మాయి అయిన గీత తమ కూతురని బిహార్కు చెందిన జనార్దన్ మహతో కుటుంబం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. జనార్దన్ మహతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గీత తమ బిడ్డేనని పలువురు ముందుకొచ్చారు.
వీరి ఫొటోలను పాకిస్థాన్కు పంపించగా.. జనార్దన్ మహతో తన కుటుంబ సభ్యుడిగా గీత గుర్తించింది. అయితే ఢిల్లీలో మహతో కుటుంబాన్ని చూసి కూడా గీత వారిని గుర్తుపట్టలేదు. దీంతో గీత అసలు తల్లిదండ్రులు ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు వేచిచూస్తామని, ఫలితాలు వచ్చిన తర్వాత నిజమైన కుటుంబసభ్యులను గుర్తించి గీతను అప్పగిస్తామని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం స్పష్టం చేశారు. గీత అసలైన తల్లిదండ్రులను వెతికేవరకు ఆమె ఇండోర్లో ఉండనున్నారు.
ఢిల్లీలో ఘనస్వాగతం
దాదాపు దశాబ్దంన్నరకు పాకిస్థాన్ నుంచి స్వదేశం చేరుకున్న గీతకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలుపు-ఎరుపు రంగులో ఉన్న సల్వార్ కమీజ్ ధరించి.. సంతోషం నిండిన వదనంతో భారత్కు వచ్చిన ఆమెకు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 'మన బిడ్డ గీతకు స్వాగతం' అంటూ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. అనంతరం గీత సుష్మాస్వరాజ్ను కలిశారు. ఈ సందర్భంగా తన హృదయం ఎప్పుడూ భారత్లోనే ఉందని మంత్రితో గీత పేర్కొన్నారని అధికారులు తెలిపారు. ఇన్నాళ్లు పాకిస్థాన్లో గీత బాగోగులు చూసుకున్న ఈధీ ఫౌండేషన్ సభ్యులు గీతతోపాటు భారత్ వచ్చారు. కాగా, గీతకు ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఇవ్వనున్న విందును భూకంపం ఘటన కారణంగా రద్దుచేశారు. మరోవైపు పాక్ చూపిన ఈ సౌహార్దానికి ప్రతిగా భారత్ కూడా 459మంది తమ దేశపు ఖైదీలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్టు పాక్ రాయబార కార్యాలయం తెలిపింది.
నాకు పెళ్ల కాలేదు: గీత
తాను చిన్నప్పుడే పాకిస్థాన్కు వెళ్లిపోయానని, తనకు ఇంకా పెళ్లికాలేదని, పిల్లలు లేరని గీత స్పష్టం చేశారు. మైనర్గా ఉన్నప్పుడే గీతకు ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని మహతో కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనను ఆమె తిరస్కరించారు.
గీత వ్యవహారంలో అనూహ్య మలుపు!
Published Mon, Oct 26 2015 4:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement