ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం

Published Sat, Aug 8 2015 4:42 PM

first phase of pattiseema project to be inaugurated on 15th august, says parakala prabhakar

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం పట్టిసీమ మొదటి దశను ప్రారంభిస్తారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో మీభూమి - మీ ఇంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజున షియోమి ఫోన్ల కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారన్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ, మరికొన్ని జిల్లాల్లో పర్యటిస్తారని పరకాల చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement