హోటల్లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి | Fire at Mumbai hotel; 1 dead, 20 injured | Sakshi
Sakshi News home page

హోటల్లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

Aug 8 2014 10:42 AM | Updated on Sep 5 2018 9:45 PM

ముంబయిలోని వాషి ప్రాంతంలో ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ముంబయి: ముంబయిలోని వాషి ప్రాంతంలో ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎన్ఎంఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం ... హోటల్లో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో మృతి చెందిన ఓ మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement