భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడల్‌ | Chinese smartphone MI max 2 launch in india soon | Sakshi
Sakshi News home page

భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడల్‌

Jul 12 2017 6:29 PM | Updated on Nov 6 2018 5:26 PM

భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడల్‌ - Sakshi

భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడల్‌

షియోమీ మరో కొత్త మోడల్‌ను వచ్చేవారం భారత మార్కట్లో విడుదల చేయనుంది.

న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌  తయారీదారు షియోమీ మరో కొత్త మోడల్‌ను వచ్చేవారం భారత మార్కట్లో విడుదల చేయనుంది. ఎంఐ మాక్స్2 పేరుతో 6.44 అంగుళాల  డిస్‌ప్లేతో ఓ డివైస్‌ను మార్కట్లోకి తీసుకురానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5300 ఎంఏహెచ్.  ఈ ఫోన్ చైనాలో గత మే నెలలోనే విడుదల చేశారు. దీనిలో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌ ఉంది. రామ్ సామర్థ్యం 4 జీబీ. ఇంటర్నల్ స్టోరేజీ 64/128 జీబీ.

ఈ డివైజ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో 12 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ గత సంవత్సరం ఇండియాలో ఒక బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. అలాగే 2017 సంవత్సరం సెకండ్ క్వార్టర్లో షియోమీ కంపెనీకి చెందిన దాదాపు 2.31 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు  అమ్ముడు పోయాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement