ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా): ఏపీ సీఎం చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో యోగా శిక్షకుడు జగ్గీ వాసుదేవ్కు 400 ఎకరాలకు పైగా భూములను కేటాయిచాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామకృష్ణ బుధవారం ఉదయం ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా, స్థానిక నేతలు సుమారు 200 మంది ఉన్నారు. త్రిలోచనాపురంలోని అటవీ భూములను పరిశీలించిన అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు రాజధాని పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33వేల ఎకరాలు సేకరించాడని... విజయనగరం జిల్లా భోగాపురంలో 1500 ఎకరాలు సేకరించాలని తలపెట్టాడన్నారు. బాబుకు భూపిచ్చి పట్టుకుందని, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. దీన్ని సీపీఐ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. త్రిలోచనాపురంలో జగ్గీ వాసుదేవ్కు ఐదు, పది ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇక్కడ వన సంరక్షణ సమితి ద్వారా అటవీ భూములపై వందలాది మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారని.. ఆ భూములను ప్రభుత్వం వారికే కేటాయించేలా తాము పోరాడతామని రామకృష్ణ చెప్పారు.
చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టింది: రామకృష్ణ
Published Wed, Apr 22 2015 12:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement