సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి.. | certainly attend ‘rath yatra’ if Akhilesh invites: Shivpal Yadav | Sakshi
Sakshi News home page

సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి..

Oct 28 2016 12:49 PM | Updated on Sep 4 2017 6:35 PM

సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి..

సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి..

'నన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. అంటే ఇప్పుడు నేను సీఎం దగ్గర పనిచేయడం లేదు. కాబట్టి రథయాత్రకు విధిగా వెళ్లను. పిలిస్తేనే వెళతా'

న్యూడిల్లీ: ములాయం సింగ్ యాదవ్ 'ఆల్ ఈజ్ వెల్' ప్రకటనతో సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యపోరు తాత్కాలికంగా సర్దుమణిగినా.. వచ్చేవారం ఆ పార్టీకి సంబంధించిన రెండు కీలక ఘట్టాలు పాతగొడవల్ని తట్టిలేపుతాయని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకటి నవంబర్ 3నుంచి ప్రారంభం కానున్న అఖిలేశ్ రథయాత్ర, రెండు నవంబర్ 5న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుక.

సరిగ్గా ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న రథయాత్రకు తాను కూడా హాజరవుతానని, అయితే అఖిలేశ్ స్వయంగా ఆహ్వానిస్తేనే ఆ అక్కడికి వెళతానని అన్నారు. రథయాత్రపై విలేకరులు అడిగి ప్రశ్నలకు బదులిచ్చిన శివపాల్..'నన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. అంటే ఇప్పుడు నేను సీఎం దగ్గర పనిచేయడం లేదు. కాబట్టి రథయాత్రకు విధిగా వెళ్లను. పిలిస్తేనే వెళతా'అని వ్యాఖ్యానించారు. అఖిలేశ్ తండ్రి మాట వినాలని హితవుపలికారు.
 
సమాజ్ వాదీ పార్టీ 25ఏళ్ల వేడుకకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. అందులో భాగంగా పార్టీ యూపీ అధ్యక్షుడు శివపాల్ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్ డీ) చీఫ్ అజిత్ సింగ్ ను కలుసుకుకుని, ఆహ్వాన పత్రిక అందజేశారు. జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితిశ్ కుమార్ తోపాటు ములాయం వియ్యంకుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఇతర పార్టీల ముఖ్యులనూ సమాజ్ వాదీ పాతికేళ్ల వేడుకకు ఆహ్వానించనున్నట్లు శివపాల్ విలేకరులకు చెప్పారు.

మరి 'కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను కూడా ఆహ్వానిస్తారా?' అని ప్రశ్నించగా.. 'కేవలం సోషలిస్టు పార్టీలను మాత్రమే పిలుస్తున్నాం'అని బదులిచ్చారు. కొడుకు అఖిలేశ్ తిరుగుబావుటా సంకేతాల నేపథ్యంలో ములాయం.. పార్టీ పాతికేళ్ల వేడుకను కొత్త పొత్తులకు కేంద్రంగా మలుచుకుంటారనే ప్రచారం యూపీలో జోరుగా సాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement