మీడియా అధిపతికి సీబీఐ ఝలక్‌! | CBI raids homes of Prannoy Roy, his wife | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: మీడియా అధిపతికి సీబీఐ ఝలక్‌!

Jun 5 2017 11:16 AM | Updated on Sep 5 2017 12:53 PM

మీడియా అధిపతికి సీబీఐ ఝలక్‌!

మీడియా అధిపతికి సీబీఐ ఝలక్‌!

ఓ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అనూహ్య దాడులు

న్యూఢిల్లీ: అనూహ్యరీతిలో సీబీఐ సోమవారం ఉదయం జాతీయ న్యూస్‌ చానెల్‌ ఎన్టీటీవీ సహ యాజమానులైన ప్రణవ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ ఇళ్లలో దాడులు నిర్వహించింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా వీరి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ధ్రువీకరించింది.
 
అయితే, ఎన్టీటీవీ కార్యాలయంలో ఈ సోదాలు జరగలేదు. ఎన్టీటీవీ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్‌, ఉత్తరాఖండ్‌ ఇలా మొత్తం నాలుగుచోట్ల సీబీఐ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. 
 
2008లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన గతవారం సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ప్రణయ్‌రాయ్‌ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 366 కోట్లు రుణంగా తీసుకొని.. రూ. 50 కోట్లు తక్కువ చెల్లించినట్టు సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement