'మోదీ, ఒవైసీ భేటీ అవాస్తవం' | BJP rejects 'Modi-Owaisi meeting' report | Sakshi
Sakshi News home page

'మోదీ, ఒవైసీ భేటీ అవాస్తవం'

Sep 18 2015 6:59 PM | Updated on Aug 15 2018 5:48 PM

'మోదీ, ఒవైసీ భేటీ అవాస్తవం' - Sakshi

'మోదీ, ఒవైసీ భేటీ అవాస్తవం'

ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయినట్టు వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయినట్టు వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ వార్తలు నిరాధారమని, దీనిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎంజే అక్బర్ తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోదీ, ఒవైసీ భేటీ జరిగిందని ఒక దినపత్రిక ప్రచురించింది.

ఎల్లో జర్నలిజానికి ఈ వార్త మచ్చుతునక అని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఎంజే అక్బర్ అన్నారు. ఈ వార్త ప్రచురించి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. విపక్షాలు తమపై కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి ఈ వార్తే సాక్ష్యమన్నారు. కాగా, తమ భేటీలో చర్చించిన రహస్యాలను మోదీ, ఒవైసీ ప్రజలకు వెల్లడించాలని జేడీ(యూ) నేత కేసీ త్యాగి డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒవైసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement