బెంగాల్ లో బోణి కొట్టిన బీజేపీ | Sakshi
Sakshi News home page

బెంగాల్ లో బోణి కొట్టిన బీజేపీ

Published Tue, Sep 16 2014 4:55 PM

బెంగాల్ లో బోణి కొట్టిన బీజేపీ

కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టింది. తొలిసారిగా ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. ఉత్తర 24 పరణాల జిల్లాలోని బాసిర్హత్ దక్షిణ్ నియోజకవర్గంలో పాగా వేసింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి షమిక్ భట్టాచార్య విజయం సాధించారు. తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, భారత సాకర్ మాజీ కెప్టెన్ దిపేందు బిశ్వాస్ పై 1742 ఓట్ల మెజార్టితో గెలుపొందారు.

చౌరింగ్హీ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. తృణమూల్ అభ్యర్థి నాయన బందోపాధ్యాయ తన సమీప బీజేపీ అభ్యర్థి రితేష్ తివారిని 14,344 తేడాతో ఓడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement