సదా అప్రమత్తం | Alert Ever | Sakshi
Sakshi News home page

సదా అప్రమత్తం

Nov 29 2015 2:58 AM | Updated on Sep 3 2017 1:10 PM

సదా అప్రమత్తం

సదా అప్రమత్తం

భారతదేశం శాంతికి కట్టుబడి ఉందని, అదే సమయంలో తన సార్వభౌమత్వ పరిరక్షణకోసం సైనిక బలగాలతో ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా

సార్వభౌమత్వ పరిరక్షణపై రాష్ట్రపతి

 హసిమర(పశ్చిమబెంగాల్): భారతదేశం శాంతికి కట్టుబడి ఉందని, అదే సమయంలో తన సార్వభౌమత్వ పరిరక్షణకోసం సైనిక బలగాలతో ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఇక్కడి వ్యూహాత్మక సరిహద్దు ఎయిర్‌బేస్ వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన 22వ, 18వ స్క్వాడ్రన్లను సత్కరించారు. మన సాయుధ దళాల సామర్థ్యం ఎన్నతగినదని కొనియాడారు. మనం శాంతికి కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో మన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకోసం మనకున్న సర్వశక్తులనూ ఉపయోగిస్తామన్నారు. 

అత్యంత పరాక్రమశాలులైన మన సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనగలవన్న విశ్వాసం తనకుందన్నారు. దేశం కోసం వైమానిక దళం అందిస్తున్న సేవలను  ప్రస్తుతించారు. మానవతా సాయం, విపత్తుల సందర్భంగా పునరావాస చర్యల్లో ఐఏఎఫ్ అందిస్తున్న సేవలు ఎన్నతగినవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement