ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం! | air chief marshal bs dhanoa flies mig-21 fighter flight | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!

Jan 13 2017 7:11 PM | Updated on Sep 5 2017 1:11 AM

ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!

ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. ఓ యుద్ధవిమానం!

ఆయన భారత వైమానిక దళంలోనే అత్యున్నత అధికారి. విమానాలు నడిపించాల్సిన అవసరం ఆయనకు లేదు.

ఆయన భారత వైమానిక దళంలోనే అత్యున్నత అధికారి. విమానాలు నడిపించాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ, మన వైమానిక దళంలో అత్యంత పురాతనమైన విమానాలుగా పేరుపొందిన మిగ్-21 ఫైటర్‌ జెట్ నడిపి చూపించారు. అవును.. భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస్ ధనోవా స్వయంగా మిగ్-21 నడిపించారు. రాజస్థాన్‌లోని ఉత్తర్‌లాయ్ అనే ప్రాంతంలో ఈ తరహా విమానాన్ని ఆయన నడిపించారు. ఆ ప్రాంతంలో ఆయన మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. వైమానిక దళం చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆపరేషనల్ బేస్‌కు ఆయన వెళ్లడం ఇదే మొదటిసారి. 
 
కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ధనోవా మిగ్ విమానాలు నడిపించారు. రాత్రిపూట చాలా సార్లు ఆయన ఈ విమానంలో వెళ్లి శత్రువుల మీద విరుచుకుపడ్డారు. దాంతో ఆయన వీరత్వానికి గాను ఆయనకు యుద్ధ సేవా మెడల్ కూడా లభించింది. ధనోవా కంటే ముందు ఎయిర్‌ చీఫ్ మార్షల్స్‌గా పనిచేసిన ఏవై టిప్నిస్, దిల్‌బాగ్‌ సింగ్ కూడా వీటిని నడిపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement