బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది.
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 55 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఆరు జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి.
ఈ నెల 12న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు 57.5 శాతం మంది మహిళలు, 52.5 శాతం మంది పురుషులు ఓటేశారు.