కొడుకును రైలు కింద పడేశాడు | 4 years old boy injured in train accident in dharmavaram | Sakshi
Sakshi News home page

కొడుకును రైలు కింద పడేశాడు

Oct 7 2015 1:57 PM | Updated on Jul 12 2019 3:29 PM

తాగిన మత్తులో కన్నకొడుకును రైలు కింద విసిరాడో కసాయి తండ్రి.

ధర్మవరం: తాగిన మత్తులో కన్నకొడుకును రైలు కింద విసిరాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో చిన్నారి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ రైల్వేస్టేషన్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కదిరి రైల్వేగేట్ సమీపంలో నివాసముంటున్న మురళి, శంకరమ్మ దంపతులు ఇనుప వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు

. ఈ క్రమంలో ఇనుప వస్తువలను ఏరుకోవడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చిన వారు తమతో పాటు నాలుగేళ్ల చిన్నారి సతీష్‌ను కూడా వెంట తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న మురళి  రైలు కదులుతున్న సమయంలో సతీష్‌ను రైలు కింద పడేశాడు. ఈ ప్రమాదంలో చిన్నారి చేతి వేళ్లు తెగిపోయి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన రైల్వే పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరించారు. మురళిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement